
సోకులతో మంటపెట్టేస్తున్న మృణాళిని రవి.. దద్దరిల్లిన పిక్స్
యంగ్ బ్యూటీ మృణాళిని రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ ముద్దుగుమ్మ టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. | Mirnalini Ravi | 13-09-2026

యంగ్ బ్యూటీ మృణాళిని రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ ముద్దుగుమ్మ టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. | Mirnalini Ravi | 13-09-2026

Anil Ravipudi: సంక్రాంతి అంటే అనిల్ రావిపూడిదే.. ఈ ప్లానింగ్ చూసి నేర్చుకోవాల్సిందే!

Ravi Teja: ‘ఇరుముడి’ నాకు కొత్త గౌరవం తీసుకొచ్చింది.. రవితేజ ఎమోషనల్!

Jayam Ravi | గోవిందుడిగా రవిమోహన్.. మంచు మనోజ్ ‘వడ్డీ కాసులవాడ’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల!

Jayam Ravi | రవి మోహన్–కేనిషా ఫ్రాన్సిస్ వీడియో వైరల్.. అప్పట్లో చెప్పిందంతా అబద్ధమేనా?

టాలీవుడ్ లో ఘనవిజయాలు అందించే కొన్ని సక్సెస్ ఫార్ములాలు ఉంటాయి. వాటిలో యమలోకం కాన్సెప్ట్ ఒకటి. ఈ కథాంశంతో వచ్చిన ఎక్కువ చిత్రాలు తెలుగులో కాసుల వర్షం కురిపించాయి. హీరోలు యమలోకానికి వెళ్లడం లేదా యముడే భూలోకానికి రావడం ఈ తరహా కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లరి నరేష్ వరకు ఈ ఫార్ములాతో సక్సెస్ అందుకున్నారు. ఎన్టీఆర్ యమగోల, చిరంజీవి యముడికి మొగుడు, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రాలలో హీరోలు యమలోకానికి వెళ్లి తిరిగి భూమిపైకి వస్తారు. అల్లరి నరేష్ యముడికి మొగుడు మూవీ కూడా అదే కాన్సెప్ట్. అలీ యమలీల సినిమాలో యముడే భూలోకానికి వస్తాడు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. నాగార్జున కూడా ఇదే తరహా కాన్సెప్ట్ తో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు లాంటి హిట్స్ అందుకున్నారు. కానీ ఈ ఫార్ములా మాస్ మహారాజ రవితేజకి మాత్రం కలసి రాలేదు. యమలోకం కాన్సెప్ట్ తో రవితేజ నటించిన దరువు చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఇది అంత బ్యాడ్ మూవీ కాదు. కనీసం యావరేజ్ సినిమాగా ఆడి ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పటికీ ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్లు యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకే ఒక్క తప్పు వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి దూకుడు మీద ఉన్న టైంలో దరువు చిత్రాన్ని రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ హోరులో దరువు చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దరువు ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం ఇదే. సోలోగా రిలీజ్ అయి ఉంటే అబౌ యావరేజ్ లేదా హిట్ అయ్యే అవకాశాలు ఉండేవి. టీవీల్లో, యూట్యూబ్ లో ఈ సినిమాని ప్రేక్షకులు

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నరసరావుపేట సమీపంలోని కాకాని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించారు. అనంతరం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండను సందర్శించి శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాకానిలోని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో సుమారు రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన గౌతమి, కృష్ణవేణి, నాగార్జున హాస్టల్ భవనాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన కోటప్పకొండ క్షేత్రాన్ని దర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.తన పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు

మాస్ మహారాజా రవితేజ, ప్రియ భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇరుముడి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21 న రిలీజ్ అయ్యి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మాస్ మహారాజా రవితేజ (Raviteja), ప్రియ భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇరుముడి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21 న రిలీజ్ అయ్యి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా 200 కోట్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ సక్సెస్ ని మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సక్సెస్ మీట్ లో శివ నిర్వాణకు ఇరుముడి సీక్వెల్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మల్లెపూల పల్లకి సాంగ్ లో రామ్ చరణ్ కనిపిస్తాడు అని రూమర్ వచ్చింది. రామ్ చరణ్ క్రమ తప్పకుండా అయ్యప్ప మాల ధరిస్తారని, అందుకే ఫ్యాన్స్ ఆయన ఇరుముడి సీక్వెల్లో నటించే అవకాశం ఉందేమో అని ఆశించడం సహజమని పాత్రికేయులు పేర్కొనగా, దానికి శివ నిర్వాణ స్పందిస్తూ.. 'అలాంటి ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుండటం చూసి నేనే షాక్ అయ్యాను. రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో పనిచేసే అవకాశం వస్తే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. అయితే ఇరుముడి కథ చాలా సహజంగా పుట్టుకొచ్చిన ఆలోచన. కేవలం సినిమా హిట్ అయిందనే కారణంతో వెంటనే సీక్వెల్స్ ప్లాన్ చేయలేము. ఆర్గానిక్గా అంతకంటే అద్భుతమైన పాయింట్ దొరికితే ఖచ్చితంగా ఆలోచిస్తాను అని పేర్కొన్నాడు. అలాగే సినిమాలో దైవత్వాన్ని చూపించిన తీరుపై మాట్లాడుతూ, కేవలం దేవుడి ఎలిమెంట్ను క్యాష్ చేసుకోవడానికి తాను ప్రయత్నించలేదని

‘ఇరుముడి’ సినిమాలో చూపించిన గవర్నమెంట్ స్కూల్ సన్నివేశాలు, యూనిఫామ్పై సోషల్ మీడియాలో కొంత చర్చ, అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ వేదికపై పూర్తి స్పష్టతనిచ్చారు. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) రూపొందించిన ‘ఇరుముడి’ (Irumudi) చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును దాటి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం బుధవారం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సినిమాలో చూపించిన గవర్నమెంట్ స్కూల్ సన్నివేశాలు, యూనిఫామ్పై సోషల్ మీడియాలో కొంత చర్చ, అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ వేదికపై పూర్తి స్పష్టతనిచ్చారు. ఇటీవల తిరుపతి పర్యటనలో తనకు ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను ఈ సందర్భంగా శివ నిర్వాణ గుర్తుచేసుకున్నారు. ‘‘రెండు రోజుల క్రితం నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాను. అక్కడ ఓ మహిళ పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ‘సార్.. నేను గవర్నమెంట్ టీచర్ని.. మీరు సినిమా అంతా చాలా బాగా తీశారు కానీ, ప్రభుత్వ పాఠశాల సీన్లు నన్ను కాస్త ఇబ్బంది పెట్టాయి. సేమ్ యూనిఫామ్లు, సేమ్ టీచర్లను అలా ఎందుకు చూపించారు?’ అని అడిగారు. అప్పుడు నేను ఆమెకు సినిమా ప్రారంభ సన్నివేశాలను గుర్తుచేశాను’’ అని తెలిపారు. ‘‘సినిమా ప్రారంభంలోనే హీరో ఊరైన పొల్లూరులో ఎలిమెంటరీ స్కూల్లో ఎంతో అంకితభావం కలిగిన ఒక మంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడిని చూపించాం. ఆయన పిల్లలను ఎంత బాగా చూసుకుంటారో, ఎంత చక్కగా మాట్లాడతారో అందరూ చూశారు. సినిమా క్లైమాక్స్ ఎండ్ సీన్లో కూడా పాపను తిరిగి ఆయనే తీసుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లపై

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్, రిలీజ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమై, సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ముందుగా అనుకున్నట్టుగా 2027 జూన్ 11న రిలీజ్ ఉంటుందా లేదా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు మైత్రి నిర్మాత రవిశంకర్ బదులిచ్చారు. తాజాగా జరిగిన ఇరుముడి ప్రెస్ మీట్ లో రవిశంకర్ మాట్లాడుతూ.. "రెండు వారాల తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. అప్పటినుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఫిబ్రవరికి షూటింగ్ పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది." అని చెప్పారు. ఫ్రెష్ లవ్ స్టోరీ: 'రోమాంచకం'లో ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు.. సుమంత్ ప్రభాస్ కాన్ఫిడెన్స్.!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజు మీనన్, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా నిర్మాతలు ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను పంచుకున్నారు.ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమవడంతో శస్త్రచికిత్స చేసిన సంగతి తెలిసిందే. తారక్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయన ఇప్పట్లో 'డ్రాగన్' సెట్స్ లో అడుగుపెడతారో లేదో అనే సందేహాలు వచ్చాయి. అయితే మరో రెండు వారాల్లో 'డ్రాగన్' షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని మైత్రీ నిర్మాత రవి శంకర్ చెబుతున్నారు. 'ఇరుముడి' లేటెస్ట్ ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి ఆయన మాట్లాడారు. ప్లాన్ చేసిన్నట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తామని, ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాని రిలీజ్ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.రెండు వారాల తర్వాత 'డ్రాగన్' షూటింగ్ బిగిన్ అవుతుంది. కంటిన్యూస్ గా షూట్ చేసి, ఫిబ్రవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేస్తాం. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగానే వచ్చే ఏడాది జూన్ లో బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది'' అని రవి శంకర్ పేర్కొన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే షెడ్యూల్ లో తారక్ పాల్గొంటారా లేదా? అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.నిజానికి ఎన్టీఆర్ గాయపడినా 'డ్రాగన్' మూవీ షూటింగుకి బ్రేకులు పడలేదు. హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాత చెప్పినదాన్ని బట్టి, సెప్టెంబర్ రెండో వారంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కీలకమైన టాకీ పార్ట్స్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నారు. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.'డ్రాగన్' సినిమాని

Visakhapatnam: మారికవలస గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలి ఎమ్మెల్సీ రవిబాబు విశాఖపట్నం: మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఆదివాసీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అయోమయంలోకి నెడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. మారికవలస గురుకుల పాఠశాల పునరుద్ధరణ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన, ఒకరోజు ఒక మాట, మరుసటి రోజు మరో మాట చెబుతూ ప్రభుత్వం ఆదివాసీ బిడ్డల భవిష్యత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు. మారికవలస గురుకుల పాఠశాలను కాపాడేందుకు వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజన మరియు పలు ప్రజా సంఘాల నేతలు, విద్యార్థి సంఘాలు, ఆదివాసీ తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హౌస్ అరెస్టులు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వానికి స్పష్టత లేదు విశాఖపట్నం జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులతో చర్చలు జరిపినప్పటికీ, అసలు సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదని ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు అన్నారు. జీవో నెం.69ను రద్దు చేస్తామనే హామీ ఎక్కడా రాలేదని, మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను శాశ్వతంగా యథావిధిగా కొనసాగిస్తామని కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదని ప్రశ్నించారు. “తల్లిదండ్రులు కోరితే వారి పిల్లలను ఇక్కడ చదివిస్తాం” అని అధికారులు చెప్పడం శాశ్వత పరిష్కారం కాదని అన్నారు. ఇప్పటికే తల్లిదండ్రుల సమావేశంలో వందలాది మంది తమ పిల్లలు మారికవలస గురుకులంలోనే చదవాలని స్పష్టంగా తీర్మానం చేసినప్పటికీ, మళ్లీ ఒక్కో తల్లిదండ్రి నుంచి వ్యక్తిగతంగా లిఖితపూర్వక లేఖలు కోరడం ఏమిటని ప్రశ్నించారు

బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు, భక్తిరస లేదా విభిన్న కథాంశంతో వచ్చే సినిమాలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'ఇరుముడి' థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా రూ. 200 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించింది. సాదాసీదాగా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో ప్రయాణం ప్రారంభించిన 'ఇరుముడి', వారాంతాల్లోనే కాకుండా వర్కింగ్ డేస్లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో నడిచింది. ముఖ్యంగా తండ్రి కూతురు బంధంతో సాగే ఈ ఎమోషనల్ డ్రామా కోసం ప్రేక్షకులు ఈ సినిమాకు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. మౌత్ టాక్ బాగా పనిచేయడంతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిసి, తక్కువ సమయంలోనే రూ. 200 కోట్ల గ్రాస్ మార్క్ను టచ్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన సర్ ప్రైజింగ్ గా అనిపించింది. అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి కూర్చుని ఉండగా.. పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్నారు. ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్లో నంబర్ వన్.. చాలా మంది భక్తులు తమ పిల్లలతో ఇదే తరహా ఫోటోస్ దిగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు సినిమాలోని లేని ఈ ఫోటను రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చిన సందర్భంగా విడుదల చేయడంతో అభిమానులు సర్ ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్నప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక వచ్చే వారంలోనూ ఈ సినిమా మేనియా తగ్గేలా లేదు. ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా.. సినిమా రూ. 200 కోట్ల మైలురాయిని చేరుకోవడంతో

టాలీవుడ్తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! సౌత్ బిగ్బాస్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల కొత్త సీజన్లు సెప్టెంబర్ 6న రాత్రి 7 గంటలకు ఒకేసారి ప్రారంభం కానున్నాయి. భాష ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఒకటే అనే సందేశంతో నలుగురు సూపర్స్టార్లు ఉన్న ప్రోమో ఆకట్టుకుంటోంది. రవితేజ, హసిత్ గోలి కాంబినేషన్లో రానున్న ప్రాజెక్ట్లో హీరోయిన్గా ఐశ్వర్య రాజేశ్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా మాళవికా మోహనన్ నటిస్తున్నట్లు వినికిడి. రశ్మిక లీడ్ రోల్లో నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత నేషనల్ క్రష్ రశ్మిక.. త్వరలోనే సెట్స్లో అడుగుపెట్టనుంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాలను తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. 200 కోట్ల క్లబ్లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండగ.. ఈసారి మునుపటి కంటే మిన్నగా

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది. భావోద్వేగ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్లిన 'ఇరుముడి', కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది. రవితేజ మార్క్ ఎనర్జీ, శివ నిర్వాణ శైలిలో సాగే కుటుంబ కథాంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకు బ్రహ్మరథం పడుతుండటంతో వసూళ్ల ప్రవాహం కొనసాగుతోంది.ఈ అరుదైన ఘనతను పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారని, 'ఇరుముడి' ఒక జనరేషనల్ బ్లాక్బస్టర్గా నిలిచిందని నిర్మాతలు తమ ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు
సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' సినిమా కంటే ముందు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఎవరికీ తెలియదంటూ ఆయన చేసిన కామెంట్స్ కన్నడ అభిమానులతో పాటు టాలీవుడ్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ సంచలన వివాదంలోకి వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్వర్మ ఎంట్రీ ఇచ్చి అల్లు అరవింద్కు గట్టి మద్దతు తెలిపారు. అరవింద్ అన్న మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆర్జీవీ విశ్లేషించారు. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు, అద్భుతమైన కథలు నటీనటులను రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్లుగా నిలబెడతాయని ఆయన పేర్కొన్నారు. అరవింద్ చెప్పిన విశ్లేషణను సాధారణ కోణంలో చూడాలని, అందులో ఎలాంటి వివాదం లేదని వర్మ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ కొన్ని ఆసక్తికర ఉదాహరణలను తెరపైకి తెచ్చారు. ‘బాహుబలి’ లాంటి వండర్ రాకముందు బాలీవుడ్ లేదా ఉత్తరాది ప్రేక్షకులకు ప్రభాస్ గురించి పెద్దగా తెలియదని, అలాగే ‘కాంతార’ సినిమా సంచలనం సృష్టించే వరకు రిషబ్ శెట్టి ఇమేజ్ పరిమితంగానే ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. అదే క్రమంలో ‘కేజీఎఫ్’ విజయంతోనే యశ్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరిందనే ఉద్దేశంతోనే అరవింద్ ఆ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చారు. హాలీవుడ్ స్థాయి విశ్లేషణను జోడిస్తూ, మార్లన్ బ్రాండో నటించిన ‘గాడ్ఫాదర్’ లేదా క్రిస్టోఫర్ నోలన్ తీసే సినిమాల్లో నటుల ఇమేజ్ కంటే కథా బలమే ప్రధాన పాత్ర పోషిస్తుందని వర్మ అన్నారు. ఒక మంచి అభిప్రాయాన్ని సున్నితంగా చెప్పినప్పుడు దానిని అర్థం చేసుకోకుండా అహంకారంతో ఆలోచించే వారే వ్యక్తిగతంగా తీసుకుని వివాదాలు సృష్టిస్తారని ఘాటుగా విమర్శించారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కన్నడ వర్సెస్ టాలీవుడ్ తరహాలో ఫ్యాన్ వార్స్ నడుస్తున్న వేళ ఆర్జీవీ ఇచ్చిన ఈ వివరణ కొత్త చర్చకు తెరలేపింది. ఇండస్ట్రీలో ఒక నిజమైన

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. పవర్ ఫుల్ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల డ్రామా, భక్తి రసంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి బ్లాక్బస్టర్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర ముఖ్య పాత్రలు పోషించారు. చిన్న, పెద్ద, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తూ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్న మూవీ 'ఇరుముడి'. రీసెంట్ టైమ్స్లో సరైన హిట్ లేక రవితేజ ఫ్యాన్స్ నిరాశలో ఉన్న సమయంలో, డైరెక్టర్ శివ నిర్వాణ ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ డివోషనల్ కథతో ముందుకు వచ్చారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం, అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యం మిక్స్ చేసి చెప్పిన ఈ కథ ప్రేక్షకులకు హత్తుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్లిన 'ఇరుముడి', బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా, కొన్ని చోట్ల థియేటర్ల సమస్యలు ఎదురైనా, ఆడియన్స్ ఆదరణ ముందు అవన్నీ తలవంచక తప్పలేదు. పిల్లలు, పెద్దలు, యూత్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ 'ఇరుముడి'ని తమ సొంత సినిమాగా భావించి థియేటర్లలో పండుగ చేసుకుంటున్నారు. ఆ ఫలితంగానే 'ఇరుముడి' మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 200 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకొని, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. యశ్ వివాదంలో ఆర్జీవీ ఎంట్రీ: అహంకారం ఉన్నవారే అలా కామెంట్ చేస్తారు.!

సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 రిలీజ్ పై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ చాలా సైలెంట్ గా సాగుతుండటం, రీషూట్స్ జరుగుతున్నాయనే పుకార్లు రావడంతో పాటు దసరా రేసులో తెలుగు సినిమాలు కూడా పోటీ పడుతుండటంతో జైలర్ 2 వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా పోస్ట్పోన్ అవుతుందంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు సన్ పిక్చర్స్ తమదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్ర యూనిట్ అఫిషియల్ గా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, సినిమాను 2026 అక్టోబర్ 15నే గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ పిక్చర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ లుక్ లో రజనీకాంత్ చేతిలో తుపాకీ పట్టుకుని చాలా మాస్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ పై మొదటి భాగంలోని సూపర్ హిట్ డైలాగ్ 'అలప్పారై సెలబ్రేషన్స్' లైన్ తో పాటు అక్టోబర్ 15 రిలీజ్ డేట్ ను స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను నెల్సన్ దిలీప్కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి భాగాన్ని మించేలా పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, మోహన్లాల్, ఎస్. జె. సూర్య కీలక పాత్రల్లో
మాస్ మహారాజా రవితేజ , సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భావోద్వేగ భక్తిరస చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన ప్రజాదరణను దక్కించుకుంది. రవితేజ మార్క్ ఎనర్జీకి తోడు, కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే శివ నిర్వాణ కథా కథనాలు సినిమాను బ్లాక్బస్టర్ దిశగా నడిపించాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి రవితేజ కెరీర్లోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది.12 రోజుల్లోనే రూ. 200 కోట్లు ఈ అప్రతిహత విజయ యాత్రను కొనసాగిస్తూ కేవలం 12 రోజుల్లోనే 'ఇరుముడి' ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ ఘనతను పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, యువత నుంచి కుటుంబ ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఈ చిత్రాన్ని ఒక ఉత్సవంలా ఆదరిస్తున్నారని మేకర్స్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఇది జనరేషనల్ బ్లాక్బస్టర్గా నిలిచిందంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.సడెన్గా హాస్పిటల్లో చేరిన మమితా బైజు... డాక్టర్లు ఏం చెబుతున్నారంటేనైజాంలో కాసుల వర్షంఆంధ్రా, సీడెడ్ ఏరియాలతో పాటు ఓవర్సీస్లోనూ 'ఇరుముడి' అద్భుతమైన కలెక్షన్లు రాబడుతున్నప్పటికీ నైజాం మార్కెట్లో మాత్రం ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ఊహకందని రీతిలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజూ అద్భుతమైన వసూళ్లను రాబడుతూ రవితేజ కెరీర్లోనే నైజాం ఏరియాలో బిగ్గెస్ట్ గ్రాసర్గా దూసుకుపోతోంది. 12వ రోజైన మంగళవారం ఈ చిత్రం నైజాంలో రూ.2.51 కోట్ల గ్రాస్, రూ.1.19 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఓవరాల్గా చూసుకుంటే

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను చూపిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన నుంచి వచ్చిన ‘ఇరుముడి’ పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను చూపిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే బ్లాక్బస్టర్ టాక్తో థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును విజయవంతంగా దాటేసి ‘జనరేషనల్ బ్లాక్బస్టర్’గా నిలిచింది. రవితేజ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన సరికొత్త స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణ ఫోటో ఫ్రేమ్ రూపంలో డిజైన్ చేసిన ఈ పోస్టర్లో.. మధ్యలో బేబి నక్షత్రను పులిపై కూర్చున్న శ్రీ మణికంఠుడి (బాల అయ్యప్ప) అవతారంలో చూపించారు. ఆమెకు ఇరువైపులా రవితేజ, ప్రియా భవానీ శంకర్ దంపతులుగా చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉండటం ఆకట్టుకుంటోంది. సినిమాలోని ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్స్తో పాటు పోస్టర్లో మణికంఠుడి రూపం సరికొత్తగా కుదరడంతో అభిమానులు ఈ పోస్టర్ను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, భావోద్వేగాలతో కూడిన కథనం సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్కు మరింత చేరువ చేశాయి. పోటీగా ఇతర భారీ చిత్రాలు ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా రవితేజ తన మార్క్ ఎనర్జీతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ ఇప్పటికీ థియేటర్లలో స్ట్రాంగ్ ఆక్యుపెన్సీతో ‘ఇరుముడి’ తన

మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా, జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది. "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు. పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు. అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Fahadh Faasil:‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ సినిమాలో మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ ప్రధాన పాత్రలో నటించారు. హీరోయిన్గా మమితా బైజు కనిపించనున్నారు. ఈ సినిమాకు గిరీశ్ ఏ.డి. దర్శకత్వం వహించారు. ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో జస్టిన్ పాత్రలో నివిన్ పాలీ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మైత్రి రవి, ఫహద్ ఫాజిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైత్రి రవి ఫహద్ ఫాజిల్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పి అందరినీ నవ్వించారు. ఫహద్ ఫాజిల్ బయటకు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తారని మైత్రి రవి అన్నారు. అయితే ఆయన కనిపించినంత అమాయకుడు కాదని సరదాగా వ్యాఖ్యానించారు. ఫహద్లో చాలా సరదా మనస్తత్వం ఉందని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. కొన్ని రోజుల క్రితం కొచ్చిలో ఫహద్ ఫాజిల్ ఓ పార్టీని ఏర్పాటు చేశారని మైత్రి రవి గుర్తు చేసుకున్నారు. ఆ పార్టీకి తాము కూడా వెళ్లామని, అక్కడ చాలా సరదాగా గడిపామని చెప్పారు. ఫహద్ కూడా ఆ పార్టీలో చాలా హ్యాపీగా ఉన్నారని, రాత్రంతా ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేశారని తెలిపారు. బయట చాలా ప్రశాంతంగా, అమాయకంగా కనిపించే ఫహద్ పార్టీలో మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటారని మైత్రి రవి సరదాగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ సినిమా మైసా నుంచి ఇటీవల ఒక శక్తివంతమైన పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్లో రష్మిక చేతిలో భారీ ఈటె పట్టుకుని ముఖంపై తీవ్రమైన యుద్ధ గాయాలతో కనిపించారు. మంటలు మరియు జనం గుంపు నేపథ్యంతో ఆమె ఒక వీర యోధురాలిగా కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన లుక్పై నటుడు విజయ్ దేవరకొండ స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రష్మిక లుక్ చిత్రంతో పాటు ఆమెను వైలెంట్ పిల్లా అని సంబోధిస్తూ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తుండగా అన్ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. రష్మిక కెరీర్లో ఇప్పటివరకు చేయని పూర్తి స్థాయి రఫ్ మరియు ఇంటెన్స్ వారియర్ అవతార్గా ఈ పాత్రను రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ పోస్టర్ను షేర్ చేస్తూ దేవతల ఆశీస్సులు నీకు ఉండాలని రాసుకొచ్చారు. ఈ సినిమా ద్వారా రష్మిక తన అభిమానులు అందరూ గర్వపడేలా మరొక గొప్ప నటనను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఈ కామెంట్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని చిత్ర బృందం తెలిపింది. మరో 12 రోజుల పాటు చిత్రీకరణ పూర్తి చేస్తే మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం అందుతోంది. ఇటీవల ఒక భారీ పోరాట సన్నివేశంలో నటిస్తున్న సమయంలో రష్మిక ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆ కారణంగా ఆమె కొన్ని రోజుల పాటు షూటింగ్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం కోలుకుంటున్న రష్మిక త్వరలోనే మళ్లీ సెట్స్లోకి అడుగుపెట్టి మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ఫలితంగా నవంబర్ 27న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ

రవితేజకి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో నిరూపించింది `ఇరుముడి` మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత నెల 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటించగా, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, సాయికుమార్, రమేష్ ఇందిరా, స్వసిక విజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అయ్యప్ప భక్తుల కథతో, తండ్రీకూతుళ్ల బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. అయ్యప్ప భక్తుల కథ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఈ మూవీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పటికీ దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. `ఇరుముడి` మూవీ రవితేజకి అదిరిపోయే విజయాన్ని అందించారు. ఆయనకు సరైన హిట్ పడితే బాక్సాఫీసు వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తోంది. ఇది ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లింది. వీకెండ్లోనే కాదు వీక్ డేస్లోనూ ఊహించని వసూళ్లని రాబట్టడం విశేషం. మంగళవారం(12వ రోజు) కూడా బాక్సాఫీసు వద్ద రవితేజ దుమ్ములేపాడు. ఈ చిత్రానికి ఇండియాలో రూ.5.90కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో యాభై లక్షలు రాబట్టింది. మొత్తంగా 12 రోజుల్లో ఈ మూవీ రూ.186.50కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద సాలిడ్గా రన్ కావడం మరో విశేషం. ఓ వైపు టాక్సిక్ మూవీ థియేటర్లో ఆడుతోంది. అంతో ఇంతో సందడి చేస్తోంది. ఆ పోటీని తట్టుకొని కూడా ఈ చిత్రానికి ఇంతటి భారీ వసూళ్లు రావడం విశేషంగా చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు. థియేట్రికల్గా అయిన బిజినెస్ రూ.20 కోట్లు. రూ.21కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. మూడో రోజుతోనే లాభాల్లోకి వెళ్లింది. నిర్మాతలకు

మాస్ మహారాజా రవితేజ ఇటీవల `ఇరుముడి` మూవీతో విజయాన్ని అందుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయనకు విజయం దక్కింది. ఆల్మోస్ట్ `ధమాఖా` తర్వాత రవితేజ హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన `ఇరుముడి` మూవీ ఇప్పుడు బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. రెండో వారంలో కూడా దీనికి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. వీక్ డేస్లోనూ డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. `టాక్సిక్` ప్రభావం ఉన్నా కూడా రవితేజ బాక్సాఫీసు వద్ద సత్తా చాటడం విశేషం. ఇక `ఇరుముడి` మూవీ సోమవారం రూ.6.60కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.179.10కోట్లు రావడం విశేషం. ఇది రెండు వందల కోట్ల దిశగా వెళ్తుంది. అంటే ఈ సినిమా ద్వారా సుమారు రూ.90కోట్ల షేర్ వచ్చింది. మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు అయితే, థియేట్రికల్ బిజినెస్ రూ.20కోట్లు మాత్రమే. దీంతో ఈ మూవీ ద్వారా మేకర్స్ సుమారు రూ.70కోట్ల లాభాలను సాధించారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో లాభాలు పొందిన సినిమా ఇదే కావడం విశేషం. చిరంజీవి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ తర్వాత `ఇరుముడి` అత్యధిక లాభాలు పొందిన సినిమాగా నిలవడం విశేషం. అయితే `ఇరుముడి` మూవీకి రవితేజ తీసుకున్న పారితోషికం ఎంతనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి రవితేజ తీసుకున్న పారితోషికం కేవలం రూ.8కోట్లు అని సమాచారం. సినిమా విడుదలకు ముందు ఒప్పుకున్న పారితోషికం ఇది. అయితే ఆయనకు పారితోషికం కింద నైజాం రైట్స్ ని ఇచ్చారు నిర్మాతలు. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లని రాబట్టింది. నైజాంలో అదిరిపోయేలా కలెక్షన్లని రాబట్టింది. ఈ లెక్కన చూస్తే రవితేజకి ఓవరాల్గా రూ.50-60కోట్లు అందుకున్నారు. అంటే ఈ మూవీకి ఆయన పారితోషికం రూ.60కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇరుముడి మూవీలో నటించిన ఇతర కాస్టింగ్ పారితోషికాల వివరాలు చూస్తే, ఇందులో హీరోయిన్గా నటించిన ప్రియా భవానీ

రవితేజ ఇరుముడి సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రెండు వారాలు గడిచినా హౌస్ఫుల్స్తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెట్ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినప్పటికీ, సెప్టెంబర్ 18 తర్వాతే ఓటీటీ రిలీజ్ ఉండవచ్చని తెలుస్తోంది

ఎమ్మెల్యే పుట్టాపై కిడ్నాప్ కేసు బెంగళూరు బీజేపీ నేత అపహరణ రాజరాజేశ్వరినగర్ పీఎస్లో ఫిర్యాదు నమోదైంది Putta Sudhakar Yadav: ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్పై బెంగళూరులో సంచలన కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన భారతీయ జనతా పార్టీ నేత డాక్టర్ రవిప్రకాష్ను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. నాలుగు విభిన్న వాహనాల్లో వచ్చిన దుండగులు ఆయనను అపహరించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ దారుణ ఘటనపై బాధితుడు రవిప్రకాష్ భార్య సబీనా వెంటనే స్పందించి పోలీసులను ఆశ్రయించడంతో ఈ హైడ్రామా వెలుగులోకి వచ్చింది. Narendra Modi: బంగారం కొనకండి.. విదేశీ ప్రయాణాలకు బ్రేక్ వేయండి.. ప్రధాని మోదీ సంచలన పిలుపు పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు: ఎమ్మెల్యేతో పాటు కుమారుడిపై కేసు నమోదు: ఈ కిడ్నాప్ వ్యవహారంపై డాక్టర్ రవిప్రకాష్ భార్య సబీనా బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన భర్త అపహరణ వెనుక మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్(Putta Sudhakar Yadav)తో పాటు ఆయన కుమారుడు పుట్టా రవికుమార్ ప్రమేయం ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. కిడ్నాప్నకు గల ఆర్థిక లేదా రాజకీయ కోణాలపై పోలీసులు దృష్టి సారించి శోధిస్తున్నారు

‘ఇరుముడి’తో సాలిడ్ బ్లాక్బస్టర్ అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఫుల్ జోష్ లో ఉన్న ఆయన అంతే జోష్ తో తదుపరి ప్రాజెక్ట్పై ఫోకస్ పెట్టారు. ‘ ‘ఇరుముడి’తో సాలిడ్ బ్లాక్బస్టర్ అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ (Ravi teja). ఫుల్ జోష్ లో ఉన్న ఆయన అంతే జోష్ తో తదుపరి ప్రాజెక్ట్పై ఫోకస్ పెట్టారు. ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాలతో తనదైన మార్క్ కామెడీ, ఎంటర్టైనింగ్ టేకింగ్తో ఆకట్టుకున్న దర్శకుడు హసిత్ గోలితో (Hasith Goli) రవితేజ జతకడుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. రవితేజకు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ నుంచి ఆమె షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నటుడు శ్రీవిష్ణు కూడా ఉన్నారు. ఆయనకు జోడీగా ఆయనకు జోడీగా మాళవికా మోహనన్ను రెండో హీరోయిన్గా ఎంపిక చేసినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ను సెప్టెంబర్లో ప్రారంభించి కేవలం నాలుగున్నర నెలల్లోనే పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసి 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. రవితేజ మాస్ ఇమేజ్కు హసిత్ గోలి ఎంటర్టైనింగ్ టేకింగ్ తోడవడంతో ఈ కాంబినేషన్పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు శ్రీవిష్ణు, ఐశ్వర్య రాజేష్, మాళవికా మోహనన్ వంటి నటీనటులు భాగం కావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇతర నటీనటుల వివరాలు, త్వరలో వెల్లడిస్తారు

ఆగస్ట్ (August 2026) మొదటివారంలో కొరియన్ కనకరాజు, డీసీ, జీడీ నాయుడు, కేజేక్యూ, అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “కొరియన్ కనకరాజు” క్లీన్ హిట్ అనిపించుకుంది. పరిమిత బడ్జెట్ లో తీయడం, మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. వరుణ్ తేజ్ ఈ మూవీతో గట్టెక్కాడు. మిగతా సినిమాల్లో “డీసీ”కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తక్కువ రేటుకు అమ్మకాలు సాగడంతో బయ్యర్లకు బాగానే డబ్బులొచ్చాయి. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రెండో వారంలో “విశ్వనాధ్ అండ్ సన్స్,” పళ్ల బురుసు, పాంచాలి పంచ భర్తృక, అగథ, మకుటం, హుషార్ పిట్టలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “విశ్వనాధ్ అండ్ సన్స్” సినిమా సూపర్ హిట్టయింది. తమిళ్ లో కంటే తెలుగులో మంచి వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన పళ్ల బురుసుతో పాటు మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎమ్మెస్ రాజు తీసిన అగధ చిత్రం కూడా ఆడకపోగా.. విశాల్ చేసిన మకుటం కూడా ఫ్లాప్ అయింది. సురేశ్ బాబు రిలీజ్ చేసిన హుషార్ పిట్టలు సినిమాకు ఏపీలో కొన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడో వారంలో ఇరుముడి, ఖలీఫా, సర్దార్ సర్వాయి పాపన్న, అమీర్ లోగ్, రెడ్ బ్యాగ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. రవితేజ నటించిన “ఇరుముడి” బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నాలుగో వారంలో టాక్సిక్, కికు చిరంజీవి, హాయ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. యశ్ నటించిన “టాక్సిక్” సినిమా డిజాస్టర్ అయింది. మొదటి వారం 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినప్పటికీ, సినిమా ఎక్కడా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా ఆగస్ట్ లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా, 2 సినిమాలు హిట్

'ఇరుముడి' హిట్ కొట్టిన రవితేజ మంచి జోష్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతడి ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘ కొడుకు మాధవ్ ప్రధాన పాత్ర చేసిన 'మారెమ్మ' విడుదలకు సిద్ధమైంది. వచ్చే శుక్రవారం(సెప్టెంబరు 10) ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. ఇది ఆకట్టుకునేలా ఉంది. (ఇదీ చదవండి: 'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని: అల్లు అర్జున్) గతంలో 'లవ్ యూ ఇడియట్' అనే మూవీలో మాధవ్ హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఇదొచ్చిందా లేదా అనే సంగతి జనాలకు పెద్దగా తెలీదు. తర్వాత విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే 'మారెమ్మ' ఒప్పుకొన్నాడు. ఏడాది క్రితం దీని గురించి ప్రకటన వచ్చింది. కొన్నిరోజుల క్రితం మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు. మారెమ్మ అనే గ్రామ దేవత, ఈ దేవి కోసం పెంచే ఓ దున్నపోతు. దాన్ని కాపాలా కాసే ఓ కాపరి. ఊరిలో జరిగే కొన్ని అరిష్టాలు. ఇలా ట్రైలర్ సాగింది. తెలంగాణలోని ఓ పల్లె నేపథ్యంగా మూవీ ఉండనుంది. ఇందులో మాధవ్ సరసన దీపా బాలు హీరోయిన్గా చేసింది. మంచాల నాగరాజు దర్శకుడు. ఈ సినిమాతోనైనా మాధవ్ హీరోగా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?) కీర్తి సురేశ్ కలర్ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు) ‘ఐ యామ్ గేమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా నాగ్ అశ్విన్ (ఫొటోలు) పోలీసులు ఆపుదాం అని చూసారు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్ బాబు సభ కోసం బెదిరింపులు.. బయటపడ్డ ఆడియో లీక్ 'రోడ్డు

బీసీ రిజర్వేషన్లు (BC reservations), ఓటర్ల జాబితాపై కేసులు వేస్తుండటంపై మంత్రి కొల్లు రవీంద్ర ( Kollu Ravindra) ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ( Jagan) ఎన్ని కుట్రుల పన్నినా స్థానిక సంస్థల ఎన్నికలు (local body Elections) ఆగవన్నారు. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలిపారు. ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికల విషయంలో జగన్ది ద్వంద్వ వైఖరి అని దుయ్యబట్టారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని కుట్రలు చేసినా తమను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరన్నారు. రాష్ట్రంలోని అన్ని నీటి ప్రాజెక్ట్లను పూర్తి చేసి ప్రజలకు అంకింతం చేస్తామన్నారు

రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ టాలీవుడ్ పరిశ్రమ మొత్తానికి కొత్త ఊపిరి పోసిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనియాడారు. రాజ్తరుణ్, శివరాజ్కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కూర్మావతార్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్లకు జనం తండోపతండాలుగా తరలివస్తుంటేనే సినిమాలు తీసే నిర్మతలకు, నటీనటులకు కొండంత ధైర్యం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సినిమాలో గురుస్వామి పాత్రలో జీవించిన సీనియర్ నటుడు సాయికుమార్ నటనపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు గుప్పించారు. ఆగస్టు 21న గ్రాండ్గా థియేటర్లలోకి వచ్చిన ఇరుముడి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మైండ్ బ్లాకింగ్ కలెక్షన్లతో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ భక్తిరస డ్రామా ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో తండ్రి కూతుళ్ల అనుబంధంతో పాటు అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమా తెచ్చిపెట్టిన పాజిటివ్ వైబ్ కేవలం ఒక చిత్ర బృందానికే కాకుండా మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో ప్లస్ అయిందని దిల్ రాజు విశ్లేషించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ రేసులో ఇరుముడి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ సినిమా భారతదేశంలో నెట్ వసూళ్ల రూపంలో ఏకంగా రూ. 129.55 కోట్లు సాధించింది. ఇదిలా ఉండగా ఇండియా గ్రాస్ పరంగా రూ. 150 కోట్ల మార్కును చాలా సులువుగా దాటేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. వరల్డ్వైడ్గా చూస్తే ఈ చిత్రం రూ. 170 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించి రవితేజ కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. ఈ విజయం ఒకవైపు జోరుగా కొనసాగుతుండగా మరోవైపు

‘ఇరుముడి’ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ చేసే సినిమాకు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరనే విషయం పై రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. వరుస ప్లాప్లతో కాస్త వీక్గా ఉన్న రవితేజకు ఈ సినిమా ఊపిరి పోయడమే కాదు, ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల రూపాయల షేర్ మార్కును దాటేసింది. ఇక ఓవర్సీస్, ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉన్న హోల్డ్ చూస్తుంటే మరో నాలుగైదు రోజుల్లో ఈజీగా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇతర పెద్ద సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ‘ఇరుముడి’ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ రేంజ్ బ్లాక్బస్టర్ హిట్ పడటంతో దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. తెలుగు చిత్రసీమలో ఒక డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్తో గ్రాండ్ హిట్ కొడితే చాలు.. నిర్మాతలు, హీరోల మేనేజర్లు వారి చుట్టూ తిరగడం సహజమే. ఇప్పుడు శివ నిర్వాణ విషయంలోనూ ఇదే జరుగుతోందట. పలువురు ప్రముఖ నిర్మాతలు ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని చెక్కులు పట్టుకుని తిరుగుతున్నారట. ఇప్పుడు కాకపోయినా పర్లేదు.. భవిష్యత్తులో మీతో సినిమా చేస్తాం, అడ్వాన్స్ తీసుకోండి అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారనే పుకార్లు

సంక్రాంతికి వస్తున్నాం అని ఊరికే మాటలు చెప్పడం కాదు.. ఏకంగా 4 నెలల ముందే మేకర్స్ తమ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. చట్టం తన పని తను చేసుకుపోతున్నట్లు.. పండగ బరిలో ఉన్న హీరోలంతా పక్కా ప్లానింగ్తో అప్డేట్స్ ఇస్తూ ఆసక్తి పెంచేస్తున్నారు. ఎవరికి ఎవరూ తగ్గట్లేదు.. మీరొక అప్డేట్ ఇస్తే మేం రెండిస్తామంటున్నారు. మరి ఆ హంగామా మనం కూడా చూద్దామా..? పండగ సినిమాల ప్రమోషన్స్ అనగానే అనిల్ రావిపూడే గుర్తుకొస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో వస్తున్న సినిమాను జనవరి 12 విడుదల అనే టైటిల్ ప్రకటిస్తూనే ప్రమోషనల్ వీడియో విడుదల చేసారు అనిల్. ఇక శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో రాబోతున్న జార్జ్ క్రిష్ సినిమా ఓపెనింగ్ మొన్నే జరిగింది.. దీని షూట్ కూడా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరగబోతుంది. ఈ ప్రమోషనల్ హంగామాలో చిరు కూడా చేరిపోయారు. బాబీతో ఈయన చేస్తున్న మెగా 158 ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 22న టైటిల్ గ్లింప్స్ రానుంది. చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్తో రాబోతున్న ఈ సినిమా అప్డేట్ మెగా అభిమానుల్లో పండగ ముందే వచ్చినంత జోష్ నింపుతోంది. మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతుంది. మెగా క్యాంపు నుంచే వస్తున్న సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ ప్రమోషన్స్ మొదలయ్యాయి. మొన్నే జనవరి 12 అంటూ డేట్ ప్రకటించారు. ఒకేరోజు ఇటు వెంకటేష్, అటు సాయి ధరమ్ తేజ్ సినిమాలు బాక్సాఫీస్పై దండెత్తబోతున్నాయి. మొత్తానికి 4 నెలల ముందే మొదలైన ఈ ప్రమోషన్ల జాతర చూస్తుంటే.. ఈసారి సంక్రాంతి థియేటర్లలో మామూలు రచ్చ ఉండేలా లేదు. పాన్,ఆధార్ వాట్సాప్లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి? వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

సాక్షి, హైదరాబాద్: సుస్మిత వ్యాఖ్యలను పరిశీలించాం. సీఎం రేవంత్పై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోసారి క్రమశిక్షణ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై కూడా చర్చించాం. చిన్నారెడ్డి అంశంపై కూడా మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ‘‘మూడు గంటల పాటు ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి వ్యవహారం పై చర్చించాం. సుస్మిత మాట్లాడిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాం. కొండా సురేఖ వివరణ అందింది. కొందరు ఎమ్మెల్యేలు ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. వీలైనంత త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖ అంశంపై నిర్ణయం తీసుకుంటాం. ..చిన్నారెడ్డి వివరణ కూడా అందింది. చిన్నారెడ్డి మాట్లాడిన విడియోను పరిశీలించాం. ఎమ్మెల్యే మేఘారెడ్డి అభిప్రాయం తీసుకున్న తర్వాత చిన్నారెడ్డి కేసులో నిర్ణయం తీసుకుంటాం. కంది శ్రీనివాస్ రెడ్డిని విచారించాం. తన వాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు’’ అని మల్లు రవి తెలిపారు. ఫ్రెండ్స్తో ఫుల్ జోష్లో ఆనంది..(ఫోటోలు) చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు) బ్యూటీఫుల్ డ్రెస్లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద మృతదేహాలు చిరంజీవి బర్త్డే స్పెషల్.. మెగా 158 గ్లింప్స్ వచ్చేసింది.. ఇక GOLD కొనలేమా? భారీగా పెరిగిన బంగారం ధరలు నన్ను ఆపే దమ్ము నీకుందా..? జేసీ ప్రభాకర్ ని ఏకిపారేసిన పెద్దారెడ్డి జియోకి జీవోకి తేడా తెలియని నువ్వు... జగనన్నలా ఛాలెంజ్ చేసే దమ్ముందా?

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజ హీరోగా నటించి 'అమర్ అక్బర్ ఆంటోని' పరాజయం పాలైనా ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు అదే బ్యానర్ లో సోలో హీరోగా 'ఇరుముడి'తో రవితేజ గ్రాండ్ విక్టరీని అందుకున్నాడు. మాస్ మహరాజా రవితేజకు మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ సక్సెస్ ను అందించింది. అలానే మైత్రీ మూవీ మేకర్స్ కూ రవితేజ ఓ గ్రాండ్ విక్టరీని అందించాడు. ఎందుకంటే రవితేజ సినిమా సక్సెస్ సాధించి సంవత్సరాలు గడిచిపోయింది. అలానే 'పుష్ప -2' తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. మధ్యలో వచ్చి తమిళ చిత్రం 'డ్యూడ్' అక్కడ ఫర్వాలేదనిపించింది కానీ తెలుగులో పెద్దంతగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా, ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలు రెండూ పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో రవితేజతో చేసిన ద్విభాషా చిత్రం 'ఇరుముడి' హిట్ కావడం విశేషమే. ఆగస్ట్ 26న యశ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' వచ్చే వరకూ 'ఇరుముడి' స్వైర విహారం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజే 'ఇరుముడి' రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ లెక్కన శని, ఆదివారాలతో ఈ సినిమా తేలికగా రూ. 50 కోట్ల నుంచి 60 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక సోమ, మంగళవారాల్లోనూ ఇదే జోరు కొనసాగితే... బుధవారానికి 'ఇరుముడి' తేలికగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. ఒక వేళ బుధవారం వచ్చే 'టాక్సిక్' అటూ ఇటూ అయితే... అది కూడా 'ఇరుముడి'కి కలిసొచ్చే అంశమే. 'టాక్సిక్'కు ఇప్పుడున్న ఇమేజ్ బట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆ సినిమాకు వెళ్ళడం కష్టమే. అప్పుడు వారందరికీ 'ఇరుముడి' బెటర్ ఆప్షన్ అవుతుంది. అదే జరిగే... 'ఇరుముడి' ఆ తర్వాత వారాంతానికి రూ. 200 కోట్ల గ్రాస్ను వసూలు

మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా కెరీర్లో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని.. నెటిజన్లు, విమర్శకుల నుంచి తీవ్రస్థాయి ట్రోలింగ్ను ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెల్సిందే. మాస్ మహారాజా రవితేజ (Raviteja) గత కొంతకాలంగా కెరీర్లో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని.. నెటిజన్లు, విమర్శకుల నుంచి తీవ్రస్థాయి ట్రోలింగ్ను ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెల్సిందే. వయసు పెరుగుతున్నా ఇంకా రొటీన్ మాస్ మసాలా ఫార్ములాలు, యంగ్ హీరోయిన్లతో డ్యూయెట్లు, లాజిక్ లేని ఫైట్లు చేయడం వల్ల ప్రేక్షకులు ఆయన సినిమాలను తిరస్కరిస్తూ వచ్చారు. గత నాలుగేళ్లలో రవితేజ తీసిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదు. అయితే, ఈ ప్రతికూలతలన్నింటికీ చెక్ పెడుతూ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి(Irumudi) చిత్రంతో రవితేజ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాడు. ఈ విజయం సినీ వర్గాలకు, నటులకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు ఎప్పుడూ నటుడి వయస్సును, ఇమేజ్ను మాత్రమే చూడరని, బలవంతంగా రుద్దే మాస్ అంశాల కంటే బలమైన కంటెంట్, ఎమోషన్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారని ఇరుముడి రుజువు చేసింది. ఈ సినిమాలో రవితేజ తన రెగ్యులర్ మేనరిజమ్స్, బిగ్గరగా అరిచే డైలాగులను, క్రింజ్ కామెడీని పక్కనపెట్టి, అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్న ఒక తండ్రిగా తన వయస్సుకు తగిన పరిణతి చెందిన పాత్రను పోషించాడు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ను ఆయన పండించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మలయాళం చిత్రాల్లో కనిపించే తరహా సహజసిద్ధమైన కథాంశాన్ని ఎంచుకుని, దేవతా విశ్వాసాలు, క్రైమ్, రివెంజ్ ఎలిమెంట్స్ను సరిగ్గా మిక్స్ చేసి తెరకెక్కించడంతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తారాగణం ఎంత పెద్దదైనా కథలో దమ్ముండాలనే సత్యాన్ని రవితేజ గ్రహించి చేసిన ఈ ప్రయత్నం ఫలితాన్నిచ్చింది. ఇప్పటికైనా రవితేజ లాంటి అగ్ర కథానాయకులు తమ ఇమేజ్ చట్రం నుండి బయటపడి, వయస్సుకు

‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద జోరు కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన రావడం చిత్రానికి కలిసొచ్చే అంశంగా మారింది. ‘ఇరుముడి’ తొలి రోజే సుమారు రూ.23–25 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మౌత్ టాక్ తో వీకెండ్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్, పాజిటివ్ రెస్పాన్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. ‘ఇరుముడి’ దూకుడు ఇప్పుడు ఇప్పటికే థియేటర్లలో ఉన్న ‘విశ్వనాథ్ & సన్స్’కు (Vishwanath and sons) కొంత పోటీగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సూర్య నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా డీసెంట్ బిజినెస్ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాభాల జోన్లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో వీకెండ్లోకి అడుగుపెడుతున్న సమయంలో ‘ఇరుముడి’ రావడం సూర్య సినిమాకు సవాల్గా మారింది. ‘ఇరుముడి’ ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకర్షిస్తుండటంతో థియేటర్లలో ప్రేక్షకులు డివైడ్ అయ్యే అవకాశం ఉంది. ‘విశ్వనాథ్ & సన్స్’కు కొన్ని కేంద్రాల్లో ఆక్యుపెన్సీ తగ్గే అవకాశాలు లేకపోలేదు. అలాగని పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పలేం. ఇప్పటికే సినిమాకు వచ్చిన టాక్, తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్లు దానికి బలంగా మారాయి. సినిమా లాభాల దిశగా

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన 'ఇరుముడి' నిన్ననే థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ కనిపించడం .. ఈ సినిమా నుంచి సాంగ్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం బాగా కలిసొచ్చింది. దాంతో ఈ మధ్య కాలంలో థియేటర్స్ దగ్గర ఎప్పుడూ కనిపించని సందడి ఈ వారం కనిపించింది. ఆన్ లైన్ లో చకచకా టికెట్స్ అమ్ముడయ్యాయి. నిజానికి రవితేజ మినహా మిగతా ఆర్టిస్టులంతా ఓ మాదిరి క్రేజ్ ఉన్నవారే. ఇక రవితేజతో పాటు తెరపై పూర్తి స్థాయిలో కనిపించిన పాప 'నక్షత్ర' కూడా ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం లేదు. అయినా విడుదలకు ముందు నుంచి ఈ సినిమా మంచి బజ్ ను సంపాదించుకుంది. రవితేజ క్రేజ్ .. 'ఇరుముడి' అనే టైటిల్ .. ట్రైలర్ .. సాంగ్స్ అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఈ సినిమా, విడుదలైన తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా 24 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.అయ్యప్పస్వామి వైపు నుంచి ఉన్న డివోషనల్ టచ్. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి కథానాయకుడు కావడం .. కూతురుపై అతనికి గల ప్రేమ .. తాను ఉన్నానంటూ కూతురుకు అండగా నిలిచే తీరు .. ఆడపిల్లల్లో భయాన్ని కాదు, ధైర్యాన్ని నింపాలి అనే సందేశం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. కథాకథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. లొకేషన్స్ ను కవర్ చేసిన విధానం .. హుషారెత్తించే పాటలు

ప్రసిద్ధ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వార్తలు మళ్లీ విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. నవంబర్ 10 లేదా 11న గ్రీస్ దేశంలో కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రైవేట్ వేడుకకు సంబంధించి గెస్ట్ లిస్ట్ విషయంలో సరికొత్త చర్చ మొదలైంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్లను మాత్రమే ఆహ్వానించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇతర ప్రధాన స్టార్లకు ఆహ్వానాలు అందలేదనే వార్త అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఇద్దరి వివాహబంధం గురించిన వార్తలు 2025 నుంచే నిరంతరం ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. ఆ సమయంలో అనిరుధ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వార్తలను సాధారణ సరదా పోస్ట్తో కొట్టిపారేశాడు. అయితే 2026 జూన్ నెలలో అనిరుధ్ మేనమామ వై.జీ. మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో వీరి పెళ్లి వార్త నిజమేనని స్పష్టంగా వెల్లడించారు. కావ్య మారన్ సామర్థ్యాన్ని కొనియాడుతూ వీరి వివాహం ఖచ్చితంగా జరుగుతుందని ఆయన ధృవీకరించారు. అనంతరం ఆగస్టు నెలలో పలు సంస్థలు దీపావళి పండుగ ముగిసిన రెండు రోజుల్లోనే గ్రీస్లో పెళ్లి జరగనుందని కథనాలను ప్రచురించాయి. దక్షిణాది చిత్రసీమలో దాదాపు అందరు అగ్ర హీరోలతో పనిచేసిన అనిరుధ్ అతిథుల జాబితాను పరిమితం చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. విజయ్, ధనుష్ వంటి అగ్ర కథానాయకులతో అనిరుధ్కు అత్యంత బలమైన కెరీర్ సంబంధాలు మరియు హిట్లు ఉన్నాయి. దీంతో కొందరికే ఆహ్వానం అందించడం పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కేవలం రజినీకాంత్ మరియు షారుఖ్ ఖాన్లను మాత్రమే పిలవడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అనిరుధ్కు ఎవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఈ నిర్ణయం స్పష్టం చేస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. విడుదలైన తొలిరోజుకే భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.14.80 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించినట్లు సాక్నిల్క్ నివేదిక అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.24.20 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. ఏపీ తెలంగాణ నుంచే రూ.15 కోట్లు తొలిరోజు ‘ఇరుముడి’ వసూళ్లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి రూ.15కోట్లు గ్రాస్ వచ్చినట్లు అంచనా. కర్ణాటక నంచి 1.5 కోట్లు, తమిళనాడు నుంచి రూ.34 లక్షలు, మిగతా ప్రాంతాల నుంచి 36 లక్షలు వసూళయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం గ్రాస్ రూ.17.20 కోట్లకు చేరింది. ఓవర్సీస్లో రూ.7 కోట్ల గ్రాస్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు రూ.24.20 కోట్లకు చేరాయి. బ్యూటీఫుల్ డ్రెస్లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) పీవీ సింధూ పోస్టుకి, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాకూ తేడా తెలీదు ఇరుముడిలో మరో ఎడిట్.? జోరుగా టికెట్ బుకింగ్ బిడ్డ వ్యాఖ్యలపై కొండా మురళి రియాక్షన్..!

టీ20 క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. భవిష్యత్తులో టెస్టు క్రికెట్కు కొత్త ఉత్సాహాన్ని తీసుకురాగలడని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. అయితే 15 ఏళ్ల వైభవ్ ఎదుగుదలను జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించాడు. అతడికి తగినంత సమయం, అనుభవం ఇవ్వాలని చెప్పాడు.వైభవ్ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడనున్నాడు. వైట్బాల్ క్రికెట్లో ఇప్పటికే సత్తా చాటిన అతడికి.. రెడ్బాల్ క్రికెట్లో నిలకడ సాధించేందుకు ఇది కీలక అవకాశం. 2025 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్కు ద్రవిడ్ కోచ్గా వ్యవహరించాడు.వైభవ్ ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అతడి సగటు 17.25గా ఉంది. దేశవాళీ రెడ్బాల్ క్రికెట్లో ఎక్కువకాలం వరుసగా ఆడే అవకాశం అతడికి ఇప్పటివరకు పెద్దగా దక్కలేదు. దులీప్ ట్రోఫీతో ఆ లోటు తీరే అవకాశం ఉంది. సెప్టెంబరులో ఆస్ట్రేలియా-ఏతో ఇండియా-ఏ రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది. ఈ మ్యాచ్లు కూడా వైభవ్కు ఉపయోగపడే అవకాశముంది.టీ20 క్రికెట్కు, టెస్టు క్రికెట్కు చాలా తేడా ఉంటుందని ద్రవిడ్ పేర్కొన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇన్నింగ్స్ను నిర్మించడం, ఒత్తిడిని తట్టుకోవడం, ఎక్కువసేపు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేయడం వైభవ్ నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.వైభవ్ ఇంకా 15 ఏళ్లేనని ద్రవిడ్ గుర్తు చేశాడు. అతడి కెరీర్లో విజయాలతో పాటు వైఫల్యాలు కూడా వస్తాయని పేర్కొన్నాడు. అందుకే అతడిపై ఓపికతో వ్యవహరించాలని సూచించాడు.టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలన్నా, ఎదగాలన్నా మూడు ఫార్మాట్లలో ఆడగల ఆటగాళ్లు అవసరమని ద్రవిడ్ అన్నాడు. వైభవ్ భవిష్యత్తులో భారత్ తరఫున టెస్టు ఆటగాడిగా ఎదిగితే ప్రపంచ

భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. అతడిని రెడ్బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఆటతో 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతడి బ్యాటింగ్ శైలీని పలువురు దిగ్గజ క్రికెటర్లు ప్రశంసిస్తుంటారు. అంతేకాక అతడికి పలు సూచనలు సైతం చేస్తుంటారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ యువ హిట్టర్ గురించి కీలక విషయాలను ప్రస్తావించారు. ఐర్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశం కల్పించాలన్నారు. టెస్ట్ క్రికెట్ అభివృద్ధి చెందాలంటే వైభవ్లాంటి ఆటగాళ్లు ఆడాలని ద్రవిడ్ వెల్లడించారు. 15 ఏళ్ల వైభవ్ను రెడ్ బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు. వైభవ్ ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల ద్వారా వైట్బాల్ అనుభవం సంపాదిస్తున్నాడని, అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో రెడ్బాల్ మ్యాచ్లు కూడా ఆడేలా చూడాలని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్కు వైభవ్ ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో ఈ టోర్నీ అతడి రెడ్బాల్ సామర్థ్యాలను పరీక్షించడానికి కీలకంగా మారనుందని ద్రవిడ్ అన్నారు. భవిష్యత్తులో టెస్టు క్రికెట్కు ఎంపిక కావాలంటే ఇలాంటి అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవాలని ద్రవిడ్ సూచించారు. ఇదే సమయంలో వైభవ్ విషయంలో క్రికెట్ అభిమానులకు ద్రవిడ్ కీలక సూచనలు చేశాడు. వైభవ్పై అంచనాలు పెట్టుకునే విషయంలో తొందరపడకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ పెద్ద స్థాయిలో విజయాలు సాధించాడని, భవిష్యత్లో కూడా ఆటలో హెచ్చుతగ్గులు సహజమేనని, అందుకే అతడికి తగినంత సమయం ద్రవిడ్ సూచించారు. ద్రవిడ్ చెప్పినట్లుగా, వైభవ్ విషయంలో తొందరపడకుండా సమయం ఇవ్వడం కీలకమని

రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు కూడా బలమైన జోరు కొనసాగిస్తోంది. ఆగస్టు 22 ఉదయం 10:30 గంటల సమయంలో బుక్మైషోలో గంటకు 30 వేలకుపైగా టికెట్లు అమ్ముడవుతున్నట్లు సూచిస్తున్నాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ సంఖ్య గంటకు 34–35 వేల వరకు చేరినట్లు తెలుస్తోంది. మొదటి రోజు భారీ టికెట్ అమ్మకాలు నమోదు చేసిన తర్వాత కూడా ఇరుముడి డిమాండ్ తగ్గకపోవడం చిత్రానికి కీలకంగా మారింది. శనివారం కావడంతో రోజు మొత్తం ఇదే స్థాయి కొనసాగుతుందా అనే ఆసక్తి ఇప్పుడు బాక్సాఫీస్ వర్గాల్లో నెలకొంది. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఇరుముడి మొదటి రోజే బలమైన ఓపెనింగ్ నమోదు చేసింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం భారత్లో తొలి రోజు సుమారు ₹14.8 కోట్ల నెట్, ₹17.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వసూళ్లు సుమారు ₹24 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లు ఈ వసూళ్లలో ప్రధాన పాత్ర పోషించాయి. రవితేజకు కొవిడ్ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ అనంతరం ఇది రెండో అత్యున్నత ఓపెనింగ్గా నిలిచింది. పలు సెంటర్లలో హౌస్ఫుల్ షోలు, అధిక ఆక్యుపెన్సీ కనిపించడంతో రెండో రోజుపై అంచనాలు మరింత పెరిగాయి. ఇరుముడి మొదటి రోజు బుక్మైషోలో ఒక దశలో గంటకు 32.25 వేలకుపైగా టికెట్ల అమ్మకాలు నమోదు చేసినట్లు సమాచారం. దీంతో రెండో రోజు కూడా గంటకు 30 వేల స్థాయిని దాటుతున్న టికెట్ అమ్మకాలు ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కొన్ని అప్డేట్స్లో గంటకు 34–35 వేల టికెట్లు కూడా అమ్ముడైనట్లు పేర్కొంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన కేంద్రాల్లో బలమైన ఆక్యుపెన్సీ కొనసాగుతున్నట్లు సమాచారం. అదనపు షోలు, థియేటర్లు జోడించినా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కొనసాగుతోందని అందుబాటులో ఉన్న వివరాలు సూచిస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు 20 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు 21న విడుదలైన సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 24.20 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్కు అవసరమైన వసూళ్లలో మొదటి రోజే గణనీయమైన భాగాన్ని అందుకుంది. శనివారం వసూళ్లు ఇదే స్థాయిలో కొనసాగితే బ్రేక్ ఈవెన్ మరింత వేగంగా సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ఇరుముడి’కి ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 నుంచి 45 కోట్ల గ్రాస్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుందని ట్రేడ్ అంచనాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు భారత్లో సుమారు 14.80 కోట్ల నెట్, 17.20 కోట్ల గ్రాస్ నమోదైనట్లు సమాచారం. ఓవర్సీస్ నుంచి మరో 6 నుంచి 7 కోట్ల వరకు వచ్చినట్లు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. భారత్లో వచ్చిన వసూళ్లలో తెలుగు వెర్షన్ ప్రధాన వాటా సాధించినట్లు అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోంది. ప్రీమియర్లు, ముందస్తు బుకింగ్స్ నుంచి కనిపించిన స్పందన మొదటి రోజు వసూళ్లలోనూ కొనసాగింది. దీంతో ‘ఇరుముడి’ తొలి రోజే బ్రేక్ ఈవెన్ లక్ష్యంలో 60 శాతానికి పైగా రికవరీ సాధించినట్లు కొన్ని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రాక్టాలీవుడ్ వంటి ట్రేడ్ సోర్సులు బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని సుమారు 40 కోట్ల గ్రాస్గా అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా, మరికొన్ని అంచనాల్లో ఈ లక్ష్యం 45 కోట్ల వరకు ఉండొచ్చని పేర్కొంటున్నారు. ఈ రెండు అంచనాల్లో ఏది తీసుకున్నా తొలి రోజు 24.20 కోట్ల గ్రాస్ సినిమా వసూళ్లకు బలమైన పునాది వేసినట్లే కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం వరకు ఇదే జోరు కొనసాగితే లక్ష్యానికి మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఫలితంగా రవితేజకు ఇటీవలి చిత్రాల తర్వాత ‘ఇరుముడి’

మాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి బాక్సాఫీస్ వద్ద కీలకమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్మైషోలో ఒకే గంటలో 32.25 వేల టికెట్లు అమ్ముడుపోయి ప్రాంతీయ సినిమాల్లో కొత్త బెంచ్మార్క్ నమోదు చేసింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు ఒక గంటలో 31.6 వేల టికెట్లతో ఈ రికార్డును అందుకుంది. ఇప్పుడు ఆ సంఖ్యను అధిగమించిన ఇరుముడి, విడుదల తర్వాత ప్రేక్షకుల్లో ఉన్న డిమాండ్ను టికెట్ బుకింగ్స్ రూపంలో చూపిస్తోంది. భారీ పాన్ ఇండియా చిత్రాలను పక్కనపెడితే ప్రాంతీయ సినిమా విభాగంలో ఈ స్థాయి గంటవారీ టికెట్ అమ్మకాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇరుముడి ఆగస్టు 21న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మజిలీ, టక్ జగదీష్,చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. తండ్రి, కూతురు మధ్య అనుబంధంతో పాటు ఆధ్యాత్మికత, కుటుంబ భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని కథను రూపొందించారు. రవితేజ ఇందులో త్రినాథ్ పాత్రలో కనిపిస్తుండగా, ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకునే తండ్రిగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. బేబీ నక్షత్ర కూతురు మనెమ్మగా, ప్రియా భవానీ శంకర్ భార్య కావేరిగా కీలక పాత్రల్లో కనిపించారు. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన రావడం ఇరుముడి బుకింగ్స్కు మరింత బలం ఇచ్చింది. ప్రీమియర్ షోలు, తొలి రోజు ప్రదర్శనల్లో మంచి ఆక్యుపెన్సీ నమోదవడంతో టికెట్లకు డిమాండ్ పెరిగింది. దీంతో బుక్మైషోలో ఒక దశలో గంట వ్యవధిలోనే 32.25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీతో కుటుంబ కథనాన్ని ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, తండ్రి-కూతురు భావోద్వేగాలు, అయ్యప్ప దీక్ష నేపథ్యం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రేక్షకుల స్పందన బలపడటం

Jalaj Saxena Stats: దేశవాళీ క్రికెట్లో అసాధారణ రికార్డులు నెలకొల్పి, పరుగుల వరదతో పాటు వికెట్ల పంట పండించినా కొందరు ఆటగాళ్లకు జాతీయ జట్టు తలుపులు తెరుచుకోవు. రంజీ ట్రోఫీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఆల్రౌండ్ విన్యాసాలు ప్రదర్శించిన ఓ ప్లేయర్ భారత టెస్టు జట్టులో కనీసం ఒక్కసారైనా చోటు దక్కించుకోలేకపోవడం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భారత రెడ్ బాల్ క్రికెట్ సర్క్యూట్లో అత్యుత్తమ ఆల్రౌండర్గా పేరుగాంచిన జలజ్ సక్సేనా, రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ సాధించని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్లో 6000 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 400 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఏకైక ఆటగాడిగా ఆయన ఆల్టైమ్ రికార్డు సృష్టించాడు. మైదానంలో నిలకడైన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను అలసిపోయేలా చేయడమే కాకుండా, తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో కీలక సమయాల్లో భాగస్వామ్యాలను విడదీస్తూ ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఇలాంటి ఆల్రౌండ్ నైపుణ్యం ఉన్న ఆటగాడు మరే ఇతర దేశంలో ఉన్నా సులువుగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేవాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కువమంది చదివినది:SL vs IND: లంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ దూకుడు.. ఆ జట్టు ఔట్..? ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మైలురాళ్లు.. 500 వికెట్లు, 14 సెంచరీలు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జలజ్ సక్సేనా నమోదు చేసిన గణాంకాలు ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. తన సుదీర్ఘ రెడ్ బాల్ కెరీర్లో మొత్తం 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఆయన 33.75 సగటుతో ఏకంగా 7224 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. బౌలింగ్ విభాగంలోనూ ఆయన అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 25.45 సగటుతో 512 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఒకే ఇన్నింగ్స్లో 5 వికెట్ల ఘనతను

రవితేజకి `ధమాఖా` తర్వాత హిట్ లేదు. ఆ తర్వాత చేసిన ఆరేడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాయి. తన మార్క్ కమర్షియల్, ఎంటర్టైనర్స్ థియేటర్లో సేల్ కావడం లేదు. దీంతో రూట్ మార్చాడు రవితేజ. తన జోనర్ మార్చాడు. భక్తిరస చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. అయ్యప్పస్వామి భక్తులకు సంబంధించిన ఆధ్యాత్మిక కథతో వచ్చారు. తండ్రీ కూతురు సెంటిమెంట్ని, ఎమోషన్స్ ని, యాక్షన్ థ్రిల్లర్ అంశాలను మేళవించి రూపొందించిన `ఇరుముడి` చిత్రంతో ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తున్నాడు. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఇది శుక్రవారం విడుదలైంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వసిక విజయ్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. `ఇరుముడి` మూవీకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం బాక్సాఫీసుపై కనిపిస్తుంది. సినిమా మంచి వసూళ్ల దిశగా వెళ్తోందని ట్రేడ్ సైట్లు చెబుతున్నాయి. ఇక ఫస్ట్ డే ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. రవితేజ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రావడం విశేషం. రవితేజ కెరీర్లో సోలో హీరోగా వచ్చిన చిత్రాల్లో `ధమాఖా`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలు మాత్రమే ఎనిమిది కోట్లతో టాప్ లో ఉన్నాయి. కానీ `ఇరుముడి` మూవీ మాత్రం వాటి రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ ఏడాది వచ్చిన చిరంజీవి `మన శంకరవర ప్రసాద్ గారు` మూవీ రికార్డుని కూడా బ్రేక్ చేసింది. దానికి రూ.31.6వేల టికెట్స్ బుక్ అయితే `ఇరుముడి`కి రూ.32.25వేల టికెట్స్ అడ్వాన్స్ గా అమ్ముడు పోవడం విశేషం. `ఇరుముడి` చిత్రానికి మొదటి రోజు ఏకంగా రూ.24.20కోట్లు రావడం విశేషం. రవితేజ గత చిత్రాలతో పోల్చితే మూడు రెట్లు అధికంగా వచ్చాయి. ఇది ఇండస్ట్రీకి, ట్రేడ్ వర్గాలకే

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ మాస్ మాహారాజా ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. దాదాపు నాలుగేళ్లుగా రవితేజకు సరైన హిట్ లేదు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ మాస్ మాహారాజా ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. దాదాపు నాలుగేళ్లుగా రవితేజ (Raviteja)కు సరైన హిట్ లేదు. ఎట్టకేలకు నేడు రిలీజైన ఇరుముడి( Irumudi)థియేటర్లలో విడుదలై సర్వత్రా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంటుంది.శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా.. బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా చాలా కాలం తర్వాత రవితేజ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఘనస్వాగతం అందేలా చేసింది. ఇక ఈ సినిమాలో ప్రధానంగా మల్లెపూల పల్లకి పాట వినిపిస్తున్నప్పుడు థియేటర్లలో ప్రేక్షకుల స్పందన మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి. ఇంకా అయ్యప్ప మాల సీజన్ ప్రారంభం కానప్పటికీ, ఏళ్ల తరబడి దీక్ష తీసుకుంటున్న భక్తులు, యూత్ ఈ పాటకు తీవ్రంగా కనెక్ట్ అయ్యారు. హైదరాబాద్లోని విమల్, సంధ్య థియేటర్ల నుంచి కరీంనగర్, కర్నూలు వరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి పూలు చల్లుతూ డ్యాన్సులు చేస్తున్నారు. అంతేకాకుండా, కొందరు అయితే ఆ సాంగ్ వచ్చినప్పుడు హారతులు ఇస్తున్నారు. ఈ పాట తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్లో కూడా ఇదే సాంగ్ బిట్ను బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వాడటం క్యారెక్టర్ ఎలివేషన్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మల్లెపూల పల్లకి సాంగ్ ఈ చిత్రంలో ఉంది అన్నప్పటి నుంచి ప్రేక్షకులు థియేటర్లను గుడులుగా మారుస్తారు అని చెప్పుకోస్తూనే ఉన్నారు. ఆ తరువాత మల్లెపూల పల్లకి సాంగ్ రిలీజ్ అయ్యినప్పుడు రీమిక్స్ లేదు.. కొత్తగా ఉంది.. ఊపు లేదు అంటూ పెదవి విరిచారు. కానీ, థియేటర్ లో మాత్రం ఆ సాంగ్ ని ఫ్యాన్స్ ఏ