
ఒకే దెబ్బకు ఏడుగురు ఆటగాళ్లు, ఇద్దరు కోచ్ లపై వేటు... ప్రపంచ రికార్డు సృష్టించిన పాకిస్థాన్
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత షాకింగ్ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్ను విస్మయానికి గురిచేసింది. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ మధ్యలోనే ఏకంగా ఏడుగురు కీలక ఆటగాళ్లను స్వదేశానికి పంపిస్తూ, ఇద్దరు కోచ్లను తొలగించింది. ఈ పరిణామంపై మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ టెస్టు జట్టు ప్రదర్శన దారుణంగా తయారైంది. మొదటి రెండు టెస్టుల్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని సిరీస్ను 0-2 తేడాతో ముందస్తుగానే కోల్పోయింది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న మూడో ఆఖరి టెస్టు మ్యాచ్కు ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఊహించని నిర్ణయం తీసుకుంది. జట్టులోని ఏడుగురు కీలక సభ్యులతో పాటు ఇద్దరు కోచ్లను అర్ధాంతరంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రికెట్ చరిత్రలోనే పర్యటన మధ్యలో ఇంత పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను ఇంటికి పంపడం ఎప్పుడూ జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. పీసీబీ తీసుకున్న ఈ అకస్మాత్తు చర్యపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీబీసీ పాడ్కాస్ట్ ముఖాముఖిలో మాట్లాడుతూ పీసీబీ తీరును ఎద్దేవా చేశారు. క్రికెట్లో ఎక్కడా ఇలాంటి వింత నిర్ణయాలు ఉండవని, ఒకేసారి ఇంతమందిని పక్కన పెట్టి పాకిస్థాన్ కొత్త వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిందని కామెంట్ చేశాడు. బోర్డు ఒత్తిడికి తలొగ్గి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం తగదని హితవు పలికారు. ఫుట్బాల్ సంస్కృతిని క్రికెట్కు రుద్దడమేంటి? పీసీబీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టిన రమీజ్ రాజా, ఇది క్రికెట్ బోర్డులా కాకుండా ఫుట్బాల్ క్లబ్లా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఫుట్బాల్ లీగ్లలో మధ్యలోనే మేనేజర్లను, ప్లేయర్లను మార్చినట్లుగా క్రికెట్లో చేయడం ఆట ప్రాథమిక సూత్రాలకే విరుద్ధమని స్పష్టం చేశారు. మూడో టెస్టు ముగిసే వరకు కనీసం పది రోజుల పాటు ఓపిక పట్టకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగుల
