
ఆర్థికమంత్రి భార్యపై చర్యలేవీ? టీచర్లనే బలిచేస్తారా
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Government Employees: ఉపాధ్యాయులపై చిన్న చిన్న ఆరోపణలు వస్తేనే సస్పెండ్ చేస్తున్న ప్రభుత్వం.. ఆర్థిక శాఖ మంత్రి భార్యపై 10శాతం కమీషన్ ఆరోపణలు వచ్చినా.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రశ్నించారు. సాధారణ ఉపాధ్యాయుపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఓ రిటైర్డె ఉద్యోగురాలు బహిరంగాంగానే మంత్రి సతీమణిపై ఆరోపణలు చేసినా ఎందుకు స్పందించలేదో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈరెండున్నరేళ్లలో మొదటి తారీఖున జీతం ఇవ్వడం మినహా చేసిందేమీ లేదంటూ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం 2 డీఏలు పెండింగ్ లో ఉంటే ఈ పాలనలో అవి ఏకంగా 6కు చేరుకున్నాయన్నారు. 2023 చివరి నాటికి రూ. 4వేల కోట్లుగా ఉన్న ఉద్యోగుల బకాయిలు.. ఇప్పుడు ఏకంగా రూ. 16వేల కోట్లకు చేరుకున్నాయని ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఇక ఉద్యోగుల నుంచి 4 దఫాలుగా చందాలు వసూలు చేసినా.. ఉపాధ్యాయులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయడంలో సర్కార్ దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఆ పదవిలో కొనసాగాలంటే మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు పాలిటెక్నిక్ విద్య విషయంలోనూ
