
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలి అనుకునేవారు ఈ రోజుల్లో తాము చేసే వంటలో నూనె తగ్గించడం మొదలుపెడుతున్నారు. కానీ, నూనె తగ్గించి, వంట చేయడం వల్ల కూర రుచిగా ఉండదు అనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రముఖ సెలబ్రెటీ షెఫ్ రణ్ వీర్ బ్రార్ రీసెంట్ గా ఓ సీక్రెట్ బయట పెట్టారు. వంటలో రుచి కొంచెం కూడా తగ్గకుండా, అతి తక్కువ నూనెతో కూడా రుచిగా, ఆరోగ్యకరంగా ఎలా చేయాలో ఆయన చెప్పారు. ఆ ట్రిక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దాదాపు అందరి ఇంట్లోనూ... పెద్ద పెద్ద ఆయిల్ క్యాన్లు, బాటిల్స్ వాడుతూ ఉంటారు. వాటితోనే నేరుగా.. కూరలోని నూనె పోసేస్తూ ఉంటారు. లేదంటే.. ఆ నూనె డబ్బాల్లో పెద్ద గరిటెలు పెడుతూ ఉంటారు. దీని వల్ల మనకు తెలీకుండానూ కూరలో నూనె ఎక్కువ వాడేస్తూ ఉంటాం. దీని వల్ల, మనం తెలీకుండానే నూనె ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అందుకే, ముందు.. ఆ నూనె డబ్బాను మార్చేయాలి. పెద్ద మూత ఉన్న నూనె డబ్బాను తీసేసి.. దాని ప్లేస్ లో చిన్న లేదా సన్న మూతి ఉన్న నూనె బాటిల్ పెట్టాలి. దీని వల్ల.. కాస్త తక్కువ నూనె గా వాడతాం. అనుకోకుండా, నూనె ఎక్కువగా పడే అవకాశమే ఉండదు. మనం కూరకు పోపు లేదా తాలింపు వేసేటప్పుడు పోపు గింజలు మాడిపోకుండా ఉండటానికి మనం ఎక్కువ నూనెలు వాడుతూ ఉంటాం. కానీ, అలా జరగకుండా ఉండేందుకు సింపుల్ చిట్కా వాడొచ్చు. తాలింపు వేసేటప్పుడు నూనె చాలా తక్కువగా వేసి, గింజలు చిటపటలాడాక కొద్దిగా నీటిని చిలకరించండి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడిపోవు, పైగా నూనె తక్కువైనా మసాలా సువాసన, రుచి వంటకానికి బాగా పడతాయి. కర్రీలు, కూరలు లేదా పులుసులు వండిన తర్వాత పైభాగంలో నూనె తేలుతూ కనిపిస్తుంది. వంట పూర్తయి సర్వ్ చేసే ముందు, పైన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమంపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో తీసుకోల్సిన తదుపరి చర్యలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను ఖరారు చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత వైపు వేగంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో కేవలం అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులను సైతం పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. దీంతో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ బృహత్తర కార్యక్రమంలో నేరుగా పాలుపంచుకోనున్నారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే బడి బయట ఉండిపోయిన పిల్లలను తక్షణమే గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఫలితంగా ప్రతి చిన్నారికి విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేస్తూ నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను పురమాయించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత మరియు ఇతర

ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా..ఏమౌతుందో తెలుసా?ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా..ఏమౌతుందో తెలుసా? August 17 Jyothi Gadda జీర్ణక్రియ నెమ్మదించడం: ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులోని జీర్ణరసాలు, ఎంజైమ్లు పచన సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల మనం తిన్న ఆహారం త్వరగా అరగక జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్: ఆపిల్లో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటాయి. ఆపిల్ తిని వెంటనే నీరు తాగితే కడుపులో గ్యాస్ ఏర్పడటం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, అసౌకర్యం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎసిడిటీ సమస్య పెరగడం: తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబడి, ఆహారాన్ని అరిగించడానికి కడుపు ఎక్కువ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీకి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు: ఆపిల్లో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ వేగం మారి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాల శోషణ తగ్గడం: ఆపిల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తిన్న వెంటనే నీటిని తీసుకోవడం వల్ల శరీరం ఈ పోషకాలను సరిగ్గా పీల్చుకోలేకపోతుంది. దీనివల్ల ఆపిల్ వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలు లభించవు. కడుపులో అసౌకర్యం, నొప్పి: ఆపిల్ తిన్న వెంటనే చల్లని నీరు తాగితే కడుపులో ఉష్ణోగ్రత మారిపోతుంది. ఇది కడుపు పిసికినట్లు ఉండటం, తిమ్మిరి లేదా సన్నని కడుపు నొప్పికి కారణం కావచ్చు. సరియైన సమయం ఎంత? ఆపిల్ తిన్న తర్వాత నీరు తాగడానికి కనీసం 30 నుండి 45 నిమిషాల సమయం వేచి చూడాలి. ఈ వ్యవధిలో ఆపిల్ జీర్ణాశయంలో ప్రాసెస్ కాబడి, నీటి అవసరం సురక్షితంగా మారుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు: చిన్నపిల్లలు, జీర్ణశక్తి తక్కువగా ఉండే వృద్ధులు ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే త్వరగా విరేచనాలు లేదా జీర్ణకోశ ఇన్ఫెక్షన్లకు గురయ్యే

Virat Kohli Favourite Street Food: క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యంత కఠినమైన డైట్ నియమాలు ఫాలో అయ్యే కింగ్ కోహ్లీకి కూడా ఓ చిరు బలహీనత ఉంది. ఢిల్లీ వీధుల్లో దొరికే ఆ ఒక్క దేశీ వంటకం చూస్తే చాలు, ఆయన తన డైట్ రూల్స్ పక్కన పెట్టేస్తాడట. ఢిల్లీ వీధుల్లో దొరికే ఆ వంటకమంటే ప్రాణం.. విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన కళ్లు చెదిరే బ్యాటింగే కాదు, ఎవరూ అందుకోలేని అత్యుత్తమ స్థాయి శారీరక ధారుడ్యం. ప్రపంచంలోనే అత్యంత ఫిట్ అథ్లెట్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ సైతం ఓ ఆహారం చూస్తే లొట్టలేసుకుని తింటాడు. అదే ఢిల్లీ వాసుల మనసు దోచిన ప్రసిద్ధ చోలే బటూరే. కోహ్లీ పుట్టి పెరిగింది ఢిల్లీ నగరంలోనే కావడంతో అక్కడి స్థానిక రుచులంటే అతడికి ఎనలేని మక్కువ. మరీ విశేషంగా రజౌరీ గార్డెన్ లేదా జైల్ రోడ్ పరిసరాల్లో ఉండే రామా చోలే బటూరే సెంటర్ నుంచి వచ్చే బటూరే అంటే ప్రాణం పెడతాడు. ఎంత కఠినమైన వ్యాయామాలు చేసినా, తనకు ఇష్టమైన ఈ కమ్మటి స్ట్రీట్ ఫుడ్ గురించి అడిగితే చాలు కోహ్లీ ముఖంలో ఓ చిన్న పిల్లాడి ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. తన పాత రోజులను నెమరువేసుకుంటూ ఆ రుచిని ఆస్వాదిస్తాడు. చీట్ మీల్స్ రోజున నోరూరించే దేశీ రుచులు.. ఎప్పుడైనా కఠినమైన డైట్ నుంచి చిన్న బ్రేక్ తీసుకునే సమయంలో కోహ్లీ పూర్తిగా నార్త్ ఇండియన్ వంటకాల వైపే మొగ్గుచూపుతాడు. ఆ రోజు అతడి ప్లేట్లో పక్కా దేశీ ఇంటి భోజనం తరహా రుచులు దర్శనమిస్తాయి. వేడి వేడి అన్నంలో కమ్మటి రాజ్మా చావల్ లేదా కడీ చావల్ కలుపుకుని తినడం అతడికి ఎంతో ఇష్టమైన వ్యాపకం. ఇవి అతడికి తన మూలాలను

ప్రస్తుత కాలంలో లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అర్థరాత్రి 11, 12 దాటే వరకు ఎవరూ పడుకోవట్లేదు. ఈ కారణంగానే డిన్నర్ కూడా చాలా ఆలస్యంగా చేస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. కానీ, రాత్రి సమయం అనేది మన శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమయ్యే సమయం. అలాంటి సమయంలో భారీగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అసలు, ప్రతిరోజూ ఆలస్యంగా తినడం వల్ల హెవీగా బరువు పెరుగుతారు. ఇంకా ఎన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం... 1. జీర్ణక్రియ సమస్యలు & ఎసిడిటీ తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల కడుపులోని ఆమ్లాలు (Acids) పైకి వచ్చి ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. రాత్రి సమయంలో జీర్ణ వ్యవస్థ వేగం తగ్గుతుంది, దీనివల్ల ఆహారం సరిగ్గా అరగక కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. 2. వేగంగా బరువు పెరగడం రాత్రివేళ మన శరీర జీవక్రియ రేటు చాలా మందగిస్తుంది.ఆలస్యంగా తిన్నప్పుడు కలగలిసే కేలరీలు శక్తిగా మారడానికి బదులు శరీరంలో కొవ్వు (Fat) రూపంలో నిల్వ ఉంటాయి. దీనివల్ల ఊబకాయం లేదా బరువు పెరిగే ప్రమాదం ఉంది. 3. నిద్రలేమి కడుపు నిండా ఆహారం ఉండి జీర్ణక్రియ జరుగుతున్నప్పుడు శరీరం విశ్రాంతి స్థితికి వెళ్లలేదు.దీనివల్ల మంచి నిద్ర పట్టక రాత్రంతా అసౌకర్యంగా ఉంటుంది. పదే పదే మెలకువ వస్తూ ఉటుంది. దీని వల్ల.. మరుసటి రోజు.. అలసట, నీరసానికి దారితీస్తుంది. 4. షుగర్ (మధుమేహం) పెరిగే ప్రమాదం రాత్రి ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో ఇన్సులిన్ తీవ్రత మారుతుంది. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం కష్టమై, దీర్ఘకాలంలో 'టైప్-2 డయాబెటిస్' వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 5. గుండె ఆరోగ్యానికి ప్రమాదం రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటు ఉన్నవారిలో బిపి (రక్తపోటు), కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి

అభిమాన హీరోపై ప్రేమను కేవలం సినిమా, ఫ్యాన్స్ ఈవెంట్స్ వరకే పరిమితం చేయకుండా.. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మార్చితే దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో ‘ఎన్టీఆర్ మీల్’ మరోసారి చూపించింది. అభిమాన హీరోపై ప్రేమను కేవలం సినిమా, ఫ్యాన్స్ ఈవెంట్స్ వరకే పరిమితం చేయకుండా.. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మార్చితే దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో ‘ఎన్టీఆర్ మీల్’ మరోసారి చూపించింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో సాగిన ఈ సేవా కార్యక్రమం ద్వారా ఆకలితో ఉన్న ఎంతోమందికి భోజనం అందించారు. ‘ఎన్టీఆర్ మీల్’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు లక్షలాది మంది ఆకలి తీర్చినట్లు, 2,000కిపైగా మీల్ కిట్లు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు.. వివిధ ప్రాంతాల్లో వాలంటీర్లు, బలమైన టీమ్ కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఒకే లక్ష్యంతో పనిచేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది. ఈ సేవా కార్యక్రమం గురించి ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “లక్షలాది మందికి ఆహారం, 2,000కిపైగా మీల్ కిట్లు, అన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు, బలమైన టీమ్.. ఇదే ‘ఎన్టీఆర్ మీల్’ ప్రభావం” అంటూ ప్రశంసించారు. ఇదే స్థాయిలో మరో టాలీవుడ్ హీరో అభిమానులు సేవా కార్యక్రమం నిర్వహించి ఉంటే ఇప్పటికి విస్తృతంగా ప్రశంసలు, గుర్తింపు లభించేవని అభిప్రాయపడ్డారు. ‘ఎన్టీఆర్ మీల్’ చేసిన సేవను ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం గురించి పెద్దగా ప్రచారం లేకపోయినా.. ఇది చేసిన సేవే దాని ప్రభావానికి నిదర్శనమని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ‘ఎన్టీఆర్ మీల్’ సేవలు నిలిచిపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో “Hope you’ll be back soon, bro” అంటూ సేవా కార్యక్రమం మళ్లీ ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తున్నారు

Soya Chunks Recipe: శ్రావణ మాసంలో నాన్వెజ్కి దూరంగా ఉండే మాంసాహార ప్రియుల కోసం సోయా చంక్స్ డ్రై (Soya Chunks Dry) అద్భుతమైన ప్రత్యామ్నాయం. చికెన్, మటన్ ముక్కల్లాగే నమలడానికి వీలుగా ఉండే ఈ రెసిపీ రుచిలోనే కాదు.. ప్రొటీన్లు అందించడంలోనూ సాటిలేనిది. ఇంట్లోనే అత్యంత సులభంగా, తక్కువ సమయంలో దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం! మిల్ మేకర్ (సోయా చంక్స్): ¾ నుంచి 1 కప్పు (చిన్నవి) ఉల్లిపాయ: 1 (పెద్దది – నిలువుగా తరిగినవి) టమాటాలు: 2 (సన్నగా తరిగినవి) అల్లం వెల్లుల్లి పేస్ట్: ¾ నుంచి 1 టీస్పూన్ పచ్చిమిర్చి: 1 నుంచి 2 (పొడవుగా కోసినవి) జీలకర్ర: ½ టీస్పూన్ కరివేపాకు: ఒక గమ్మ ఇంగువ: చిటికెడు కారం: ½ టీస్పూన్ గరం మసాలా (లేదా కిచెన్ కింగ్ మసాలా): ½ నుంచి ¾ టీస్పూన్ పసుపు: చిటికెడు నూనె: 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర: కొద్దిగా (గార్నిష్ కోసం) ఉప్పు: రుచికి సరిపడా ముందుగా ఒక పాత్రలో 3 కప్పుల నీటిని మరిగించి, అందులో సోయా చంక్స్ వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి కాసేపు నీటిలోనే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో రెండుసార్లు శుభ్రంగా కడిగి, నీరు ఏమీ లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. పిండిన సోయా చంక్స్లో ½ టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ¼ టీస్పూన్ కారం, ½ టీస్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన ఉంచితే ముక్కలకు మసాలా బాగా పడుతుంది. పాన్లో నూనె వేడి చేసి జీలకర్ర, కరివేపాకు వేయాలి. జీలకర్ర చిటపటలాడాక ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు దోరగా మారే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు