
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఇదే సమయంలో ఆదాయాన్ని పెంచుకునే అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. టికెట్ రహిత ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణా ఆర్టీసీ మెట్రో రైలు తరహాలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేస్తోంది. రూట్వేవ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హయత్నగర్-2 డిపోకు చెందిన పది ఎలక్ట్రిక్ బస్సుల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.డిజిటల్ స్క్రీన్స్ పై ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయానికి ప్లాన్ ఈ డిజిటల్ స్క్రీన్లపై వాణిజ్య ప్రకటనలతో పాటు రాబోయే బస్ స్టాప్ల వివరాలు, ఆర్టీసీ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ప్రదర్శించనున్నారు. ఈ డిజిటల్ స్క్రీన్స్ ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు మెట్రో రైలు తరహాలోనే ముందుగా స్టేజీల పేర్లు చూపించడం వల్ల నగరానికి కొత్తగా వచ్చినవారు, మార్గాలు తెలియని ప్రయాణికులు సులభంగా గమ్యస్థానం వద్ద దిగగలుగుతారు.ఒక ఆలోచనతో మూడు ప్రయోజనాలు అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయటం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పే అవకాశం కలుగుతుంది. ఈ మూడు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు పైలట్ ప్రాజెక్టు కోసం హయత్నగర్-పటాన్చెరు రద్దీ మార్గాన్ని ఎంపిక చేశారు. పది బస్సుల్లో ఇప్పటికే స్క్రీన్లు అమర్చారు.హయత్ నగర్ పటాన్ చెరు రూట్ లో పైలట్ ప్రాజెక్ట్ ప్రయాణికుల స్పందన, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సాంకేతిక పనితీరును పరిశీలించిన తర్వాత నగరంలోని ఇతర డిపోల ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఈ వ్యవస్థను విస్తరించే అవకాశం ఉంది. గతంలో డిజిటల్ స్క్రీన్లు ప్రధానంగా వినోదం, ప్రకటనలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సదుపాయాలు జోడించి ప్రయాణికులకు ఉపయోగపడే సమాచార వేదికగా మారుస్తున్నారు.ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఇల్లులేని వారికి తీపికబురు.. ఇక మొదలెట్టండి!పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అన్ని

HONOR Pad 20 Pro Paperlike Edition : హానర్ కొత్త టాబ్లెట్ వచ్చేసింది. హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్లైక్ ఎడిషన్ కంపెనీ లాంచ్ చేసింది. ఈ హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్లైక్ ఎడిషన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో యాంటీ-గ్లేర్, టెక్స్చర్డ్ స్క్రీన్ సర్ఫేస్, హై పర్ఫార్మెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ టాబ్లెట్ విద్యార్థులు, నిపుణులు, డిజిటల్ క్రియేటివ్లకు బెస్ట్ డివైజ్.. హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్లైక్ ఎడిషన్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి. ధర ఎంతంటే? : హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్లైక్ ఎడిషన్ ధర త్వరలో వెల్లడి కానుంది. హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్లైక్ ఎడిషన్ కేవలం గ్రే కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అడ్రినో 825 జీపీయూతో ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S జెన్ 4 4nm మొబైల్ ప్లాట్ఫామ్తో రన్ అవుతుంది. ఇందులో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 10.0తో వస్తుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్టు ఇచ్చే 10100mAh బ్యాటరీతో రన్ అవుతుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. : హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్లైక్ ఎడిషన్లో బ్యాక్ సైడ్ ఎఫ్/2.0 అపర్చర్తో 13MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.0 అపర్చర్తో 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సౌండ్ ఫీచర్లలో 6 స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, DTS:X అల్ట్రా సౌండ్, హానర్ స్పేషియల్ ఆడియో ఉన్నాయి. కొలతల పరంగా పరిశీలిస్తే.. : ఈ టాబ్లెట్ 277.07 మిమీ పొడవు, 179.28 మిమీ వెడల్పు, 6.29 మిమీ మందం, 537 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. Wi-Fi 7, బ్లూటూత్ 6.0, USB టైప్-C, OTG వంటి ఆప్షన్లు ఉన్నాయి

మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి. తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి. అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కొందరు నిదానంగా తింటారు. మరికొందరు చాలా వేగంగా తింటారు. అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు. కుటుంబ సభ్యులు అయినా, స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు. వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్ చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం కాకుండా ఆ తరువాత సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట. స్ట్రాంగ్ ప్రాక్టీస్ ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం

ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి ఏ పని చేయాలి అనిపించకపోవడం, ఇష్టమైన పనులపై కూడా ఆసక్తి లేకపోవడం, చిన్న పని చేయాలన్నా బద్ధకంగా అనిపించడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే అనుభవమే. అయితే ఇది ప్రతిసారీ బద్ధకం అని అనుకోవడం సరైంది కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు సైకాలజీ నిపుణులు. అవేంటో చూద్దాం. సైకాలజీ నిపుణుల ప్రకారం మనకు ఏ పని చేయాలనిపించకపోవడానికి ముఖ్యమైన కారణం మానసిక అలసట. రోజంతా పని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, సంబంధాల్లో ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే మెదడుకు తగిన విశ్రాంతి ఉండదు. బయటకు పెద్దగా శారీరక పని చేయకపోయినా మనసు మాత్రం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో సాధారణ పనులు కూడా పెద్ద భారంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఒకేసారి ఎన్నో పనులు చేయాల్సి వస్తున్నప్పుడు “ముందు ఏం చేయాలి?” అనే ఆలోచన కూడా ఒత్తిడిని పెంచి పనిని ప్రారంభించే ఉత్సాహాన్ని తగ్గించవచ్చు. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, తరచూ నిద్ర లేవడం లేదా ఎక్కువసేపు నిద్రపోయినా విశ్రాంతిగా అనిపించకపోవడం వల్ల మరుసటి రోజు శక్తి తగ్గిపోవచ్చు. అలసటతో పాటు ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. డిప్రెషన్లో కూడా నిద్రలో మార్పులు, శక్తి తగ్గడం, ఆసక్తి కోల్పోవడం, ప్రేరణ లేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పని పూర్తి చేయాలి, ఈ టైం లోపు అయిపోవాలి, నేను తప్పకుండా విజయం సాధించాలి.. అనే ఒత్తిడి ఎక్కువైతే పని చేయడం హ్యాపిగా కాకుండా భారంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక పెద్ద పనిని మొత్తం ఒకేసారి పూర్తి చేయాలని ప్రయత్నిస్తే మెదడుకు చాలా కష్టమైన లక్ష్యంగా కనిపించవచ్చు. దానివల్ల పని ప్రారంభించడానికే మనసు వెనుకాడుతుంది. అందుకే పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి.. ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పనిని ఎంచుకోవడం మంచి పద్ధతి