
రష్మిక మందన్న ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో
ప్రఖ్యాత కర్ణాటక గాయిక అయిన ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న బయోపిక్లో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ ప్రాజెక్ట

ప్రఖ్యాత కర్ణాటక గాయిక అయిన ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న బయోపిక్లో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ ప్రాజెక్ట

భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్లో కథానాయికగా రష్మిక మందన్న ఎంపికయ్యారు.

ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి అంతర్జాతీ కెరీర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, మాజీ ప్లేయర్లు అతడి అద్భుతమైన కెరీర్కు గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి అంతర్జాతీ కెరీర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, మాజీ ప్లేయర్లు అతడి అద్భుతమైన కెరీర్కు గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు. ‘నంబర్ 10 లేకుండా అర్జెంటీ జెర్సీ ఇకపై ప్రత్యేకంగా అనిపించదు. ఒత్తిడి, పట్టుదల, ఎన్నో పరాజయాలు, చివరకు అద్భుతమైన విజయాలతో మీ ఫుట్బాల్ కెరీర్ నిండిపోయింది. మెస్సి.. నువ్వు వదిలిన వారసత్వం అద్భుతం’ - శిఖర్ ధావన్ ‘చరిత్ర తిరగరాస్తూనే దిగ్గజాలుగా నిలిచేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిలో నువ్వొకడివి లియో. ఆహా.. ఎంత అద్భుతమైన కెరీర్! చివరి విజిల్ తర్వాత కూడా ప్రపంచం ఈ ఆటగాడిని గుర్తుంచుకుంటుంది’ - యువరాజ్ సింగ్ మెస్సి అర్జెంటీనా తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగానే కాకుండా.. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు. జాతీయ జట్టు తరఫున 203 మ్యాచ్లు ఆడి 124 గోల్స్ సాధించాడు. 2006 నుంచి 2026 వరకు ఏకంగా ఆరు ప్రపంచకప్లలో మెస్సి పాల్గొన్నాడు. మొత్తం 34 మ్యాచ్ల్లో 21 గోల్స్ సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపే 22 గోల్స్తో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్కు మెస్సి వీడ్కోలు పలికినా.. క్లబ్ ఫుట్బాల్లో మాత్రం కొనసాగనున్నాడు. అమెరికా మేజర్ లీగ్ సాకర్లో ఇంటర్ మియామి తరఫున అతడు తన ఆటను కొనసాగించనున్నాడు. యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి రౌండ్లో ఘన విజయం ఇంకెప్పుడు జట్టుకు అండగా ఉంటావు.. బాబర్ ఆజమ్పై పాక్ బ్యాటర్ ఫైర్

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖలీఫా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా వైశాఖ్ (vaisakh) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖలీఫా’ (Khalifa 2) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది. ఇక్కడ పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమాకు మార్కెట్లో తగినంత బజ్ రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మలయాళ వెర్షన్కు భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. అయితే ‘ఖలీఫా’ టీమ్ సడెన్గా ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమా సక్సెస్ మీట్లోనే ‘ఖలీఫా 2’ను అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ను కూడా వెల్లడించింది. ‘ఖలీఫా 2 – ది లెగసీ’ పేరుతో సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ సీక్వెల్లో మోహన్లాల్ కీలకమైన ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయన మంబరక్కల్ అహ్మద్ అలీ పాత్రను పోషించనుండగా.. మొదటి భాగంలో హీరోగా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఆమిర్ అలీగా మరోసారి కనిపించనున్నారు. మొదటి భాగంలో కొనసాగిన కథనే సీక్వెల్లో ముందుకు తీసుకెళ్లనుండగా.. ఈసారి అహ్మద్ అలీ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం చూసిన వారికి మోహన్లాల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమిర్ అలీ తాతగా మోహన్లాల్ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించారు. టోవినో థామస్ కూడా సహాయక పాత్రలో నటించారు. జిను వి. అబ్రహామ్, సూరజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఉన్న పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలను కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం. మొదటి భాగం విడుదలైన వెంటనే సీక్వెల్ను ప్రకటించడం, అందులో మోహన్లాల్ను కీలక పాత్రలోకి తీసుకురావడం ఇప్పుడు మలయాళ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది

నందమూరి బాలకృష్ణ తన 111వ సినిమా షూటింగ్లో తీవ్రంగా గాయపడి మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ, నిర్మాతలకు నష్టం కలగకుండా త్వరలోనే సెట్స్కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వైద్యులు రెండు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని స్పష్టంగా సలహా ఇచ్చినప్పటికీ, ఆయన సెప్టెంబర్లోనే షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. తండ్రి సీనియర్ ఎన్టీఆర్ చూపించిన వృత్తిపరమైన నిబద్ధతను కొనసాగిస్తూ బాలకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జూలై నెలలో కాకినాడ మరియు రాజమండ్రి పరిసర ప్రాంతాలలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ ఎడమ మోకాలికి తీవ్ర గాయమైంది. ఆయన క్వాడ్రిసెప్స్ టెండన్ చీలిపోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కూడా దెబ్బతినడంతో వెంటనే హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్స్కు తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యుల బృందం దాదాపు 3 గంటల పాటు క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి దెబ్బతిన్న టెండన్ను విజయవంతంగా అతికించి సపోర్టింగ్ టిష్యూలను రిపేర్ చేశారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత కనీసం రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో షూటింగ్ ఆలస్యమైతే నిర్మాతులపై భారీగా ఆర్థిక భారం పడుతుందని భావించిన బాలకృష్ణ, సెప్టెంబర్ నెలలోనే సెట్స్కు వస్తానని చిత్రబృందానికి భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, పల్లెటూరి పిల్ల మరియు సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాల సమయంలో ఎన్టీఆర్ కూడా గాయాలను లెక్కచేయకుండా షూటింగ్లు పూర్తి చేసిన సంఘటనలను ఈ సందర్భంగా సినీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న బాలకృష్ణ సైతం అదే బాటలో నడుస్తూ తన వల్ల నిర్మాతలు ఆర్థికంగా నష్టపోకూడదనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఫలితంగా సెప్టెంబర్ నెలలోనే తన టాకీ పార్ట్ పూర్తి చేసి, అక్టోబర్లో ప్యాచ్ వర్క్ అలాగే నవంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ మాసంలోనే సినిమాను భారీ స్థాయిలో విడుదల

Minister Narayana: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కొన్ని స్థానిక సంస్థలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉండటంతో గతంలో వాటిని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మిగిలిన అన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. పవన్ కల్యాణ్ గైర్హాజరుపై వక్రభాష్యం వద్దు అమరావతిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడంపై మంత్రి నారాయణ స్పందించారు. ఈ విషయాన్ని ఎవరూ వక్రంగా అర్థం చేసుకోవద్దని సూచించారు. తానే స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్ను కార్యక్రమానికి ఆహ్వానించానని తెలిపారు. అయితే ఆపరేషన్ చేయించుకున్న కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేనని పవన్ తనకు చెప్పారని మంత్రి వివరించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావడం లేదని మంత్రి నారాయణ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రోజువారీ చెత్త సేకరణపై దృష్టి ఇళ్ల నుంచి వచ్చే చెత్తను రోజుకు రోజే తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కమర్షియల్ కాంప్లెక్స్లు, ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన రోడ్లు, వీధి లైట్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వసతులు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం లక్షల టన్నుల లెగసీ చెత్తను పేరుకుపోయేలా చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం

క్విట్ ఇండియా గొప్పతనాన్ని యువతరం తెలుసుకోవాల్సి ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా కీలక ఘట్టమని అభివర్ణించారు. హైదరాబాద్, ఆగస్టు 09: క్విట్ ఇండియా గొప్పతనాన్ని యువతరం తెలుసుకోవాల్సి ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా కీలక ఘట్టమని అభివర్ణించారు. ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆగస్టు 8వ తేదీన మహత్మా గాంధీ ఇచ్చిన పిలుపుతో యావత్ భారతదేశం కదం తొక్కిందని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతోపాటు సుభాష్ చంద్రబోస్.. ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి స్ఫూర్తి అని తెలంగాణ పీసీసీ చీఫ్ గుర్తు చేశారు. బ్రిటిష్ వాళ్లు భారత్ విడిచి వెళ్ళిపోవడానికి ఈ ఉద్యమమే ప్రధాన కారణమని వివరించారు. కేంద్రం మొండి వైఖరికి వ్యతిరేకంగా జెన్ జీ ఉద్యమం చేపట్టిందని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకోవాలని జెన్ జీ ఉద్యమ వీరులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వేలాది మంది సర్వం కోల్పోయి ప్రాణత్యాగాలు చేస్తేనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం దేశంలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని నెహ్రూను మరిపించే ప్రయత్నం జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ను బీజేపీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే వారికి క్విట్ చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా మెడలు వంచక తప్పదని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రావటానికి గల కారణాలను యువత అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డారు. దేశం ఆశ్చర్యం పోయేలా తెలంగాణలో అభివృది, సంక్షేమం జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఉందని