
జైల్లో ఖైదీలకు బెడ్, పరుపు, దుప్పటి ఇస్తారా? స్నానానికి సబ్బు సంగతేంటి
Facilities in Jail : తప్పు చేసినవారిని శిక్షించేందుకు ప్రభుత్వాలు జైళ్లను ఉపయోగిస్తాయి. కోర్టులు జైలు శిక్ష విధించగా పోలీసులు దాన్ని అమలుచేస్తారు... ఇలా ప్రభుత్వం, కోర్టులు, పోలీస్ వ్యవస్థలు కలిసి జైళ్ల పర్యవేక్షణ చూసుకుంటాయి. నేరాలకు పాల్పడినవారిలో పరివర్తన తీసుకువచ్చేలా జైలు శిక్షను అమలుచేస్తారు... అందుకే ఇక్కడ చాలా కఠిన నియమ నిబంధనలు పాటిస్తారు. మరి భారతదేశంలోని జైళ్లలో ఖైదీలకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారో ఇక్కడ తెలుసుకుందాం. జైళ్ల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం... కాబట్టి ఒక్కోరాష్ట్రంలోని ఖైదీలకు ఒక్కో రకమైన సదుపాయాలు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే జైలులోని సాధారణ ఖైదీలకు బెడ్ (మంచం) ఉండదు.. నేలపైనే పడుకోవాలి. అయితే కింద పర్చుకోడానికి బెడ్ షీట్ లేదా చాప ఇస్తారు.... అలాగే కప్పుకోడానికి దుప్పటి కూడా అందిస్తారు. అయితే కోర్టు అనుమతితో లేదా ఆరోగ్య కారణాలతో డాక్టర్ల సూచనమేరకు కొందరు ఖైదీలు బెడ్ సదుపాయం పొందవచ్చు. ఇక విఐపి ఖైదీలను జైలులోని ప్రత్యేక బ్యారక్స్ లో ఉంచుతారు... ఇందులో బెడ్ తో పాటు టేబుల్, కుర్చీ వంటి ప్రత్యేక వసతులు ఉంటాయి. కోర్టు అనుమతితో టీవి, న్యూస్ పేపర్ సదుపాయాన్ని కూడా కొందరు విఐపి ఖైదీలు పొందుతుంటారు. ఇండియాలో ఆధునిక జైళ్లు వస్తున్నాయి... వీటిలో ఖైదీలకు విదేశీ జైళ్ల తరహా సదుపాయాలను కల్పిస్తున్నారు. ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించేందుకు బంక్ బెడ్స్ అంటే ఒకదానిపై ఒకటి ఉండే మంచాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో నిర్మించిన సెంట్రల్ జైళ్ళలో సాధారణ ఖైదీలకు కూడా బెడ్ సదుపాయం కల్పిస్తున్నారు. తెలంగాణ జైళ్లలో ఖైదీలు ఉపయోగించే బెడ్ షీట్స్, దుప్పట్లను స్వయంగా వాళ్లు తయారుచేసుకున్నవే ఉంటాయి. అంటే జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీలతో వీటిని తయారుచేయిస్తారు... రాష్ట్రంలోని అన్ని జైళ్లకు సరఫరా చేస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోలీస్ శిక్షణా కేంద్రాల్లోనూ ఖైదీలు తయారుచేసిన బెడ్ షీట్స్, దుప్పట్లనే