
హుస్సేన్ సాగర్ పూర్వ వైభవానికి మాస్టర్ప్లాన్
ఒకప్పుడు అందాల హుస్సేన్ సాగర్.. ఇప్పుడు కాలుష్య కాసారం.. హైదరాబాద్ నగరంలో హుస్సేన్సాగర్ కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. ఒకప్పుడు నగరవాసులకు తాగునీరు అందించిన ఈ చారిత్రక జలాశయం కాలక్రమేణా కాలుష్యం, మురుగునీటి ప్రవాహం, నిర్వహణ లోపాల వల్ల సహజ సౌందర్యాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితిని మార్చేందుకు HMDA ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.హుస్సేన్ సాగర్ కోసం అంతర్జాతీయ స్థాయిలో టెండర్లుఈ మాస్టర్ ప్లాన్ తయారీకి అర్హత కలిగిన కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసేందుకు వచ్చే వారంలోపు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలవనున్నారు. ప్రధాన లక్ష్యాలు కాలుష్య నివారణ, మురుగునీటి మళ్లింపు, పర్యావరణ పరిరక్షణ, లేక్ఫ్రంట్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడంగా నిర్ణయించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రస్తుతం ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (STP) సామర్థ్యాన్ని పెంచనున్నారు.సంజీవయ్య పార్కులో ప్రత్యేక లెర్నింగ్ సెంటర్ ఏర్పాటుకొత్త మురుగు మళ్లింపు పైప్లైన్లు ఏర్పాటు చేసి సాగర్లోకి మురుగు చేరకుండా నిరోధిస్తారు. గ్రీన్ స్కేపింగ్, పర్యావరణ హిత అర్బన్ డిజైన్ల ద్వారా నీటిని స్వచ్ఛంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంజీవయ్య పార్కులో ప్రత్యేక లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు, విద్యార్థులకు పర్యావరణం, ప్రకృతి, నగర చరిత్రపై అవగాహన కల్పించేలా దీన్ని రూపొందిస్తారు. పాత రోజ్ గార్డెన్ స్థానంలో కొత్త థీమ్ గార్డెన్లు, వనాలు అభివృద్ధి చేస్తారు.సాంస్కృతిక కార్యక్రమాలకు ఓపెన్ ఎయిర్ ప్లాజాలు ఏర్పాటులేక్ఫ్రంట్ పరిసరాల్లో సైక్లింగ్ ట్రాక్లు, వాకింగ్ పాత్లు, యోగా జోన్లు, డిజైనర్ ఫుడ్ కోర్టులు నిర్మిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఓపెన్ ఎయిర్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ నరసింహారావు మార్గ్, లుంబినీ పార్క్, పీపుల్స్ ప్లాజా, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం పరిసరాలను అనుసంధానిస్తూ సుందరీకరణ పనులు చేపడతారు.ఆగస్టు23 నుండి అష్టాదశ యోగంతో ఈ రాశులవారికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి!ఎన్టీఆర్ గార్డెన్స్ను కూడా ఆధునిక