
Kushitha Kallapu : నటి కుషిత కళ్లపు వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
నటి, సోషల్ మీడియా ఫేమ్ కుషిత కళ్లపు నేడు వినాయకచవితి సందర్భంగా ఇంట్లో పూజలు నిర్వహించి అనంతరం పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

నటి, సోషల్ మీడియా ఫేమ్ కుషిత కళ్లపు నేడు వినాయకచవితి సందర్భంగా ఇంట్లో పూజలు నిర్వహించి అనంతరం పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

Embodiments of architectural excellence and hallmarks of history. ప్రస్తుత రోజుల్లో ఎటువంటి భవనం నిర్మిస్తున్నా.. వాటి నాణ్యత ఏమేరకు ఉంటుందో, ఎంతవరకు మరమ్మతులకు గురికాకుండా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అయితే బ్రిటిష్ హయాంలో కట్టడాలు మాత్రం అందుకు భిన్నంగా దర్శన మిస్తున్నాయి. వందేళ్లు దాటినా నేటికీ ఎంతో పదిలంగా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.

Rohit Sharma: వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఆడతాడా..? అసలు క్లారిటీ ఇచ్చిన హిట్మ్యాన్..

Rohit Sharma | వరల్డ్కప్ చాలా దూరంలో ఉంది.. అప్పుడు చూసుకుందాంలే..!

Rohit Sharma: క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన హిట్ మ్యాన్.. టీ20ల్లో 9 ఏళ్లుగా చెక్కుచెదరని రోహిత్ శర్మ రికార్డు

Rohit Sharma: టీవీలోకి 'హిట్మ్యాన్' ఎంట్రీ.. ఇక క్రికెట్కు పూర్తిగా దూరమైనట్లేనా?

ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు... న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు సభ్యుడిగా ఉన్న మోహిత్ జైన్ 2026-27 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 43 ఏళ్ల తర్వాత బీసీసీఎల్కు చెందిన ప్రతినిధి మరోసారి ఏబీసీ చైర్మన్ పదవిని చేపట్టినట్లయింది. ప్రింట్ మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న మోహిత్ జైన్.. ప్రచురణ, వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కెమికల్ ఇంజనీరింగ్తో పాటు ఎంబీఏ చదివిన జైన్.. 2021-22లో ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా సేవలందించారు. రెండు దశాబ్దాలకు పైగా ఐఎన్ఎ్సతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ గ్లోబల్ సూపర్వైజరీ బోర్డులోనూ మోహిత్ జైన్ మూడేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ దక్షిణాసియా విభాగం బోర్డు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాగా, ఏబీసీ డిప్యూటీ చైర్మన్గా విక్రమ్ సఖుజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

BCCI Meeting: భారత క్రికెట్ బోర్డు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ నిర్వహిస్తోంది. భారత జట్టు ఇటీవలి ప్రదర్శనలతో పాటు రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడాలా వద్దా అనే అంశంపై తీవ్ర చర్చ జరగనుంది. కోచ్ గంభీర్, సెలెక్టర్ అగార్కర్ హాజరవుతున్న ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ ముఖ్యమైన భేటీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్లతో పాటు బోర్డు అగ్రశ్రేణి అధికారులు హాజరుకానున్నారు. అందరూ బుధవారం రాత్రికే ముంబై చేరుకున్నారు. ఆయా పర్యటనల్లో జట్టు ప్రదర్శించిన వైఫల్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై బోర్డు పెద్దలు పూర్తి స్థాయి విశ్లేషణ చేయనున్నారు. రోహిత్ శర్మ భవిష్యత్తుపై తేలనున్న నిర్ణయం ఈ సమావేశంలో అందరి దృష్టి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్పైనే ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరు లేదంటూ ప్రచారంలో ఉన్న కథనాలపై బోర్డు ఒక స్పష్టతకు రానుంది. రోహిత్ను జట్టులో కొనసాగించాలా లేక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త ఆటగాడిని తీర్చిదిద్దాలా అనే కోణంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. వయసు, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా రోహిత్ భవిష్యత్తు పై ఒక కీలక రోడ్మ్యాప్ రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీ20 సిరీస్ ఓటములతో పాటు ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ పరాజయంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. వాస్తవానికి ఈ సమావేశం ముందే జరగాల్సి ఉన్నప్పటికీ జింబాబ్వే, శ్రీలంక పర్యటనల కారణంగా వాయిదా పడింది. ఆ రెండు సిరీస్లు గెలిచినప్పటికీ విదేశీ గడ్డపై ఎదురైన ప్రతికూల ఫలితాలకు గల కారణాలను గంభీర్, అగార్కర్ వివరించాల్సి ఉంటుంది. బౌలింగ్, బ్యాటింగ్ లోపాలను ఎత్తిచూపుతూ బోర్డు గట్టి నిలదీతలకు

Chittoor: చిత్తూరులో పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు: భారీ స్కూటర్ ర్యాలీ! చిత్తూరు: డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చిత్తూరులో జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి అరణి కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల్లో భాగంగా చిత్తూరు నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం నుంచి మురకంబట్టు వరకు సాగిన ఈ ర్యాలీకి చిత్తూరు జనసేన సీనియర్ నాయకులు పగడాల శశికాంత్ నాయకత్వం వహించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు చేతబట్టి పవన్ కళ్యాణ్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. అలాగే చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం నుంచి సుమారు 100 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వేడుకలకు తరలివచ్చారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం జనసేన శ్రేణులతో సందడిగా మారింది

ఆ హీరో ఫ్యాన్స్ మీరున్న సిటీలో మీ కళ్ళ ముందు ఉండే ఉంటారు.. అచ్చు ఆ హీరోలాగానే హెయిర్ స్టైల్, డ్రెస్, ఫేస్ కట్స్ తో 24 అవర్స్ ఆన్ మై హీరో యాటిట్యూడ్ అనేలా ఉండటం కూడా ఆ హీరో ఫ్యాన్స్ నైజం. కానీ ఆ హీరో సుమారు 270 చిత్రాల్లో చేస్తే 180కి పైగా ప్లాప్స్. పైగా ముప్పై ఏళ్ల పాటు సరైన సోలో హిట్ లేదు. నిజం సైతం నిజామా అని ఆశ్చర్యపోయినా కూడా ఇది నిజమే. కానీ తన క్రేజ్, స్టార్డమ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనే భారతీయ సినీ యవనికపై 'డిస్కో డాన్సర్'గా ముద్ర వేసుకున్న హీరో మిథున్ చక్రవర్తి. . 1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయ' అనే క్లాసిక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మిథున్, తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. అప్పట్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ కాలపు అతిపెద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. అక్కడ నుంచి మిథున్ ఇండియాలోనే మోస్ట్ డిమాండింగ్ స్టార్లలో ఒకరిగా మారారు. అయితే కాలం మారే కొద్దీ కథల ఎంపికలో వేగం, క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 90ల కాలంలో ఏడాదికి పదుల సంఖ్యలో, తక్కువ బడ్జెట్ మరియు వేగంగా పూర్తయ్యే సినిమాల్లో నటిస్తూ రికార్డులు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయన ఖాతాలో ఓటములు ఎక్కువగా చేరుతూ వచ్చాయి. 1993 నుంచి 1998 మధ్యకాలంలోనే ఆయన నటించిన 33 చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అలా తన మొత్తం కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించగా, ఏకంగా 180కి పైగా సినిమాలు తీవ్రమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాదాపు 30 ఏళ్ల పాటు బాక్సాఫీస్

టాలీవుడ్తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! సౌత్ బిగ్బాస్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల కొత్త సీజన్లు సెప్టెంబర్ 6న రాత్రి 7 గంటలకు ఒకేసారి ప్రారంభం కానున్నాయి. భాష ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఒకటే అనే సందేశంతో నలుగురు సూపర్స్టార్లు ఉన్న ప్రోమో ఆకట్టుకుంటోంది. రవితేజ, హసిత్ గోలి కాంబినేషన్లో రానున్న ప్రాజెక్ట్లో హీరోయిన్గా ఐశ్వర్య రాజేశ్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా మాళవికా మోహనన్ నటిస్తున్నట్లు వినికిడి. రశ్మిక లీడ్ రోల్లో నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత నేషనల్ క్రష్ రశ్మిక.. త్వరలోనే సెట్స్లో అడుగుపెట్టనుంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాలను తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. 200 కోట్ల క్లబ్లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండగ.. ఈసారి మునుపటి కంటే మిన్నగా

మాగనూరు, సెప్టెంబర్ 2: మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. మూడేళ్లుగా మంత్రిగా కొనసాగుతున్నా ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మాగనూరు మండలం నేరడగం గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో గ్రామ సర్పంచ్ దాసరి వెంకటమ్మతో పాటు కాంగ్రెస్కు చెందిన వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు 50 మందికి పైగా బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని బీఆర్ఎస్కు మద్దతుగా నినాదాలు చేశారు. “నేను జీవో తెచ్చా.. మూడేళ్లలో మీరు ఏం చేశారు?” నేరడగం, బూత్పూర్ గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తిస్తూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జీవో తీసుకొచ్చానని చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. ‘‘నేను జీవో తెచ్చా.. మూడేళ్లలో మీరు ఏం చేశారు?’’ అంటూ మంత్రిని ప్రశ్నించారు. ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని చిట్టెం రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. [caption id="attachment_2500433" align="aligncenter" width="1280"] Chittem Rammohan Reddy1[/caption] మంత్రి సొంత నియోజకవర్గంలో నేరడగం గ్రామ సర్పంచ్ దాసరి వెంకటమ్మ, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన, వార్డు నెంబర్లు, ఉట్కూరు అశోక్,కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం రాజకీయంగా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tummidihatti: ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి కోరింది తెలంగాణ సర్కార్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షత వహించగా.. తెలంగాణ తరపున నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, మహారాష్ట్ర నుంచి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అయితే సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరిగిన తొలి విడత చర్చలు అర్థవంతంగా ముగిసాయని తెలంగాణ అధికారులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత, చేవేళ్ల సుజల స్రవంత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ 148 మీటర్ల ఎత్తులో మాత్రమే బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. అయితే ఈ ఎఫ్ఆర్ఎల్ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు ఒక లేఖ రాసింది. అదే సమయంలోప్రధానమంత్రి మోదీకి, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసిని తెలంగాణ ప్రభుత్వం.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో.. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో.. తెలంగాణ 152 మీటర్ల పూర్తి వరద మట్టం (FRL)తో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదనపైనే విస్త్రుతంగా చర్చ జరిగింది. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ వల్ల మహారాష్ట్రలో మునిగిపోయే ప్రాంతాలు, ప్రాణహిత

BCCI Selection Policy: ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ కీలక మార్పు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక చేసే సమయంలో ఆటగాడు మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడనే విషయంలో బోర్డు మరింత స్పష్టత తీసుకోనుంది. అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా పేర్లకు ఫిట్నెస్ షరతు విధించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నారా లేదా అనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే వారి తుది లభ్యతపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల గాయపడిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని, ఆ తర్వాత వారు మ్యాచ్లకు దూరమైన సందర్భాల నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం. నివేదిక ప్రకారం.. ఇక ఆటగాడి ఫిట్నెస్పై 100 శాతం కాకుండా 200 శాతం నమ్మకం ఉన్నప్పుడే అతడిని పూర్తిగా ఎంపిక చేసినట్లు పరిగణించే విధానాన్ని బీసీసీఐ అవలంబించనుంది. దీనివల్ల జాతీయ జట్టులోకి ఎంపికైన తర్వాత ఫిట్నెస్ కారణంగా ఆటగాడు అందుబాటులో లేకపోయే పరిస్థితులను తగ్గించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్మ్యాన్ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్లో ఒంటి చేత్తో..! అయితే అంతర్జాతీయ సిరీస్కు జట్లను సాధారణంగా కొన్ని వారాల ముందే ఎంపిక చేస్తారు. ఎంపిక తేదీకి ఆటగాడు పూర్తి ఫిట్గా లేకపోయినా, సిరీస్ ప్రారంభానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటే అతడిని పూర్తిగా పక్కన పెట్టకుండా ‘ఫిట్నెస్కు లోబడి’ ఎంపిక చేసే విధానాన్ని బీసీసీఐ కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వివరించినట్లు నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలో అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్కు ప్రకటించిన 15 మంది జట్టులో బుమ్రా, నితీశ్, వాషింగ్టన్, హర్షిత్ రాణాలకు ఫిట్నెస్ క్లియరెన్స్ తప్పనిసరి. నివేదిక ప్రకారం బుమ్రా, నితీశ్ సిరీస్ తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండే

వడమాలపేట: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్కానింగ్ మిషన్ ఉన్నా మహిళలకు ఉపయోగం లేకుండా పోయింది. గైనకాలజిస్టు లేకపోవడంతో సుమారు మూడేళ్లుగా స్కానింగ్ మిషన్ వినియోగానికి నోచుకోవడం లేదని స్థానికులు తెలిపారు. మహిళలు, గర్భిణులు అవసరమైన స్కానింగ్ పరీక్షల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే గైనకాలజిస్టును నియమించి, స్కానింగ్ మిషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

హైటెక్ సిటీలో రైళ్ల నిలుపుదల అదనపు చార్జీలు లేని సౌకర్యం చార్లపల్లి నుండి ప్రత్యేక రైళ్లు Hitech City Railway Station: పండుగ సీజన్లలో ప్రయాణికుల తీవ్ర రద్దీని తట్టుకునేందుకు, ఐటీ కారిడార్ వాసులకు ప్రయాణ సౌలభ్యం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లింగంపల్లి, సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు గాను హైటెక్ సిటీ రైల్వే స్టేషన్(Hitech City Railway Station)లో పలు ఎక్స్ప్రెస్ రైళ్ల తాత్కాలిక నిలుపుదలను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగల సమయంలో ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. Ponnam Prabhakar: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. 700 ప్రత్యేక బస్సులతో ఆర్టీసీ ధమాకా.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు రెండు విడతల్లో స్టాపింగ్స్: అదనపు చార్జీలు లేకుండా మార్పు: నరసాపూర్ - లింగంపల్లి, కాకినాడ టౌన్ - లింగంపల్లి ఎక్స్ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీలో స్టాపింగ్ను రెండు విడతల్లో పొడిగించారు. మొదటి విడతగా దసరా, దీపావళి రద్దీ కోసం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకు, రెండో విడతగా క్రిస్మస్, సంక్రాంతి కోసం డిసెంబర్ 18 నుంచి జనవరి 19 వరకు ఈ రైళ్లు ఆగుతాయి. లింగంపల్లి నుండి బోర్డింగ్ ఉన్న ప్రయాణికులు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ బోర్డింగ్ పాయింట్ను హైటెక్ సిటీకి సులభంగా మార్చుకోవచ్చని సూచించారు. చార్లపల్లి - తిరుచానూర్ ప్రత్యేక రైళ్లు: పండుగ ప్రయాణికులకు ఊరట: మరోవైపు ఆధ్యాత్మిక యాత్రికుల కోసం చార్లపల్లి - తిరుచానూర్ మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 4న చార్లపల్లి నుండి, సెప్టెంబర్ 5న తిరుచానూర్ నుండి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇవి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట

చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మగ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మగ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోర్వెల్ మోటార్కు అనుసంధానించిన తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ ఏనుగుకు తగలడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చనేది ప్రాథమికంగా అంచనా వేశామని అధికారులు చెప్పారని అన్నారు. ఈ మేరకు ఎక్స్(X)లో పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.. ఏనుగు మృతి ఘటనపై విచారణ చేపట్టి, నివేదికను సమర్పించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగును ఖననం చేయాలని సూచించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్ రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్

Mumbai Indians : ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. హార్డిక్ పాండ్య సారథ్యంలో ఆ జట్టు ఘోరంగా వైఫల్యం చెందింది. అయితే, వచ్చే ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు సత్తాచాటేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించేలా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తిలక్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కెప్టెన్ గా కొత్తవారిని ఎంపిక చేసేందుకు ముంబయి కసరత్తు చేస్తోందని సమాచారం. ఆ బాధ్యతలను రోహిత్ శర్మ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త కెప్టెన్ ఎంపికలో రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారని.. ఈ క్రమంలో అతను రెండు పేర్లను జట్టు యాజమాన్యంకు సూచించినట్లు సమాచారం. అందులో సీనియర్ ప్లేయర్ జస్ర్పీత్ బుమ్రా, యువ ఆటగాడు తిలక్ వర్మ. అయితే, బుమ్రా కంటే తిలక్ వర్మవైపు జట్టుయాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. జట్టు దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తేనే బాగుంటుందని రోహిత్ శర్మతోపాటు జట్టు యాజమాన్యం సైతం భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రాబోయే ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తిలక్ వర్మ బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ విషయంలో ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ చర్చల్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ను డీల్లో భాగంగా తీసుకునే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గ్రీన్ వర్క్లోడ్పై ఆందోళనల కారణంగా ముంబై ఆ ప్రతిపాదనపై ఆసక్తి చూపలేదని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో హార్దిక్ను ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించి, కెప్టెన్సీ మరొకరికి అప్పగించాలని ముంబయి భావిస్తోందట

పాన్ఇండియా రేంజులో ఆర్భాటంగా విడుదలవుతున్న సినిమాలు అంచనాలను అందుకోలేక చతికిలపడుతున్న తరుణంలో, ఓ చిన్న సినిమా అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రచారానికి కూడా బడ్జెట్ లేక సైలెంటుగా విడుదలైన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అది సాధిస్తున్న విజయం చూసి బాలీవుడ్ సైతం నివ్వెరపోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాని ప్రత్యేకతలేంటి? ఆగస్టు 7న ఏమాత్రం హడావుడి లేకుండా విడుదలైంది ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). స్టార్లుగానీ, తెలిసిన ముఖాలుగానీ లేని ఆ సినిమాకు తొలిరోజు వసూళ్లు.. కేవలం రూ.10 లక్షలు. ఓపెనింగే ఇంత డల్గా ఉంటే ఇంకేం ఆడుతుంది అనుకున్నారంతా. తొలివారంలో రూ.1కోటి 8లక్షలు వసూలు చేసింది. రెండో వారం మరింత దయనీయం. రూ.40లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక దీని పనైపోయినట్లే, బొమ్మ తీసేయడమే తరువాయి అని అనుకున్నారు. కానీ అప్పుడే అద్భుతం జరిగింది. తొలి 14 రోజుల్లో రూ.1.48 కోట్లు వసూలు చేసిన ఆ సినిమా, ఒక్క మూడో వారంలోనే ఏకంగా రూ.10.4 కోట్లు రాబట్టింది! నాలుగో వారంలో ఈ సినిమా దూకుడు చూసి ట్రేడ్ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. 22వ రోజు రూ.6.25 కోట్లు, 23వ రోజు రూ.9.25 కోట్లు, 24వ రోజు రూ.12.75 కోట్లు.. ఇలా రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తొలి రెండు వారాల మొత్తం కలెక్షన్ల కన్నా, 24వ రోజు వచ్చిన వసూళ్లే ఎక్కువంటే, ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థమవుతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.47.33 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ.50 కోట్లకు చేరువవుతోంది. ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ తీస్తే రూ.200 కోట్లొచ్చాయ్..! 1900-1973 మధ్య జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా(మహరాజ్జీ) జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను విశాల్ చతుర్వేది తెరకెక్కించారు. అతి తక్కువ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా ప్రచారానికి కూడా డబ్బుల్లేక

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడో 19 ఏళ్ల క్రితం వచ్చిన ఓ ఫ్లాప్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీయడమేంటి? అది సూపర్ హిట్ అవడమేంటి? ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించడమేంటి? బాలీవుడ్లో ఇప్పుడు అలాంటి అద్భుతమే జరిగింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ‘ఆవారాపన్ 2’ (Awarapan 2). 2007లో ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi), శ్రియా శరణ్ (Shriya Saran) జోడీగా నటించిన ‘ఆవారాపన్’ (Awarapan) విడుదలైంది. మోహిత్ సూరి (Mohit Suri) తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలే వచ్చినా, బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది. రూ.18 కోట్ల బడ్జెట్తో తీస్తే, రూ.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. థియేటర్ల నుంచి ఈ సినిమా వెళ్లిపోయిన తరువాత టీవీల్లో చూసిన ప్రేక్షకులు దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలా ఈ సినిమాకు కల్ట్ స్టేటస్ వచ్చింది. ఇన్నేళ్ల తరువాత ఈ ఏడాది ‘ఆవారాపన్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ జోడీగా నటించిన ఈ సినిమాను నితిన్ కక్కర్ తెరకెక్కించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వసూళ్ల వర్షం కురిసింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు సాధించడం విశేషం. అన్నదానాలతో ప్రచారం చేసి.. రూ.50 కోట్లు సాధించి..: ‘హనుమాన్ అంశ్’ విశేషాలివీ ఈ చిత్ర ఘనవిజయంపై ఇమ్రాన్ హష్మి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘రెండు దశాబ్దాల క్రితం విడుదలైన సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభించలేదు. అయినప్పటికీ సీక్వెల్తో మళ్లీ వచ్చింది. ఈసారి చరిత్రను తిరగరాసింది. ఇది అపూర్వ విజయం. ఇదే నా బెస్ట్ ఫిలిం’’ అని ఆయన పోస్ట్ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు

తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. న్యూఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా బ్యారేజీ ఎత్తు, సాంకేతిక అంశాలు, అంతర్రాష్ట్ర సమస్యలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమీక్షించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్లకు బదులుగా 152 మీటర్లకు పెంచేలా ఆ రాష్ట్రాన్ని ఒప్పించేందుకు తెలంగాణ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించినట్లు తెలిసింది. బ్యారేజీ ఎత్తు పెంపుతో తెలంగాణకు కలిగే ప్రయోజనాలను అధికారులు మహారాష్ట్ర దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్ర నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని తెలుస్తోంది. 152 మీటర్ల ప్రతిపాదనకు అంగీకారం కుదరని పరిస్థితుల్లో కనీసం 150 మీటర్ల ఎత్తుకైనా అంగీకరించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది. తెలంగాణ ప్రతిపాదనలను ఆ రాష్ట్ర అధికారులు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్యారేజీ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు తదుపరి దశలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తదుపరి భేటీలో బ్యారేజీ ఎత్తుపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హై కోర్టులో ఊరట ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్

హైదరాబాద్ రాయదుర్గంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోరమైన హిట్ అండ్ రన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా కారు కాలినడకన వెళ్తున్న నందులాల్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ఘటనలో నందులాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రమాదాన్ని చూసి సహాయం చేయడానికి పరుగెత్తుకు వచ్చిన జైద్ షా కాద్రి అనే విద్యార్థి కూడా అదే వాహనం తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి కారును నిలపకుండా అక్కడి నుండి వేగంగా పరారయ్యాడు. ఈ హిట్ అండ్ రన్ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు వెంటనే దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనాన్ని నడిపినది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పోలీసులు వేగంగా స్పందించి సందీప్ను అరెస్ట్ చేసి, ప్రమాదానికి వాడిన కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనంద్ సాయి తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్గా గుర్తింపు పొందడమే కాకుండా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ ట్రస్ట్ బోర్డులో జనసేన నామినీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రమాద సమయంలో వాహనం ఏ వేగంతో వెళ్తోంది, డ్రైవర్ మద్యం సేవించి ఉన్నారా లేదా అనే అంశాలపై పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, గాయపడిన విద్యార్థి జైద్ షా కాద్రిని స్థానికులు తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన నందులాల్ కుటుంబ నేపథ్యం, ఇతర వివరాలను సేకరించే పనిలో పోలీసులు

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం 21వ వార్డు చెర్లోపల్లి ప్రాంతంలో అక్రమంగా కొనసాగుతున్న క్వారీలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్ల కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతుల పంట పొలాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా క్వారీలు నిర్వహిస్తూ పేలుళ్లు జరపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుళ్ల కారణంగా రాళ్లు ఎగిరిపడి భూములు కంపిస్తున్నాయని, ఇళ్లు, బోర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందా అని నిలదీశారు. కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!చెర్లోపల్లి రైతులు తమ ఆవేదనను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రోజా ఆరోపించారు. పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా, ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేయడం సరికాదన్నారు. క్వారీలకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, గనుల, రెవెన్యూ, పోలీసు శాఖల నిబంధనలు పాటిస్తున్నారా? అనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్వారీ యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉన్నాయని, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్పై వస్తున్న క్వారీ వసూళ్ల ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా ప్రమాదం జరిగే వరకు ఎదురుచూడొద్దు!ఒక ప్రాణం పోయిన తర్వాతో, రైతు భూమి నాశనమైన తర్వాతో పరిహారం ఇచ్చినా పోయిన జీవనాధారం తిరిగి రాదని రోజా స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే వరకు ప్రభుత్వం నిద్రపోకుండా ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెర్లోపల్లి ప్రాంతంలోని అక్రమ క్వారీలను వెంటనే నిలిపివేసి, అనుమతులు లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు

టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ట్రేడింగ్పై కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది. అతడిని ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించాలని ముంబై భావిస్తోందట. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) ట్రేడింగ్పై కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు హార్ధిక్ను ముంబై ట్రేడింగ్లోకి రిలీజ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా హార్దిక్ను ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించి, కెప్టెన్సీ మరొకరికి అప్పగించాలని ముంబై భావిస్తోందని సమాచారం. పాండ్యను భర్తీ చేసే సరైన ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా కొత్తవారిని ఎంపిక చేసేందుకు ముంబై ఫ్రాంఛైజీ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. కొత్త కెప్టెన్ ఎంపికలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కీలకపాత్ర పోషిస్తున్నాడని, ఇప్పటికే మెనేజ్మెంట్తో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ పోటీలో సీనియర్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అయితే, జట్టు దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిలక్ వర్మ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. హార్దిక్ను అసలు ట్రేడ్ చేయకపోయినా ఆశ్చర్యంలేదని ఫ్రాంఛైజీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ట్రేడ్ విషయమై ఆటగాడితో చర్చలు కూడా జరిగాయని, ఒక ట్రేడ్ జరగాలంటే చాలా విషయాలు ఒక కొలిక్కి రావాలని, ఇది అంత తేలికైన విషయం కాదని ఎంఐ ఫ్రాంఛైజీలోని ఓ సభ్యుడు వెల్లడించారు. అలానే మహేల జయవర్ధనెను కోచ్ పదవి నుంచి తప్పిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, వచ్చే సీజన్కు అతనే కోచ్గా ఉండే అవకాశముందని టాక్. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు లేకపోతే వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ గతేడాది మెరుగైన ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ అతడిని

Team India: భారత టెస్టు క్రికెట్లో నంబర్-3 స్థానానికి సుదీర్ఘకాలం పాటు వెన్నెముకగా నిలిచిన ఛతేశ్వర్ పుజారా తన డ్రీమ్ 11 సహచర ఆటగాళ్ల జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనతో కలిసి ఆడిన దిగ్గజాల్లో అత్యుత్తమ 11 మందిని ఎంచుకున్న ఆయన, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్లకు స్థానం కల్పించకపోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా తరఫున దాదాపు 13 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా టెస్టు క్రికెట్ ఆడిన పుజారా అనేక మంది దిగ్గజ ఆటగాళ్లతో మైదానాన్ని పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి ప్రఖ్యాత ఆటగాళ్ల నుంచి నేటితరం స్టార్ల వరకు అందరితో కలసి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సారథ్యంలో మ్యాచ్లు ఆడినప్పటికీ, తన ఆల్ టైమ్ బెస్ట్ 11 తోటి ప్లేయర్ల జాబితాలో మాత్రం కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు కల్పించారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్లాట్ఫారమ్ వేదికగా ఈ ఆసక్తికరమైన వివరాలను ఆయన వెల్లడించారు. టెస్టుల్లో ద్రవిడ్ వదిలివెళ్లిన డిఫెన్సివ్ బ్యాటింగ్ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన పుజారా, తన జట్టులో ద్రవిడ్ను చేర్చుకోవడం మరచిపోలేదు. ఆయన ఎంచుకున్న 11 మంది సభ్యులలో ఆరుగురు రిటైర్ అయిన మాజీలు ఉండగా, ఐదుగురు ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లు ఉన్నారు. రిటైర్డ్ జాబితా నుంచి వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, రవిచంద్రన్ అశ్విన్లను ఎంపిక చేసుకున్నారు. వీరందరిలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కరే వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నారు. యాక్టివ్ ప్లేయర్లలో ఎవరెవరికి చోటు దక్కిందంటే? ప్రస్తుతం ఆడుతున్న అంతర్జాతీయ క్రికెటర్లలో నుంచి రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలను పుజారా తన తుది జట్టులోకి తీసుకున్నారు. అదనంగా 12వ ఆటగాడిగా ఫాస్టెస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను సెలక్ట్ చేయడం విశేషం. పిచ్ పరిస్థితులను బట్టి

శ్రీకృష్ణ జన్మాష్టమిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 2026లో కృష్ణాష్టమి సెప్టెంబర్ 4న రానుంది. ఈ సందర్భంగా పూజా సమయం, ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: శ్రీకృష్ణ జన్మాష్టమి హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం.. 2026లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సెప్టెంబర్ 4, శుక్రవారం నిర్వహించనున్నారు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడనే విశ్వాసం ఉండటంతో.. ఆ సమయానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అష్టమి తిథి: సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:25 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 5న అర్ధరాత్రి 12:13 గంటలకు ముగుస్తుంది. రోహిణి నక్షత్రం: సెప్టెంబర్ 4న రాత్రి 11:04 గంటల వరకు ఉంటుంది. శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని భక్తుల విశ్వాసం. కృష్ణుడి జన్మ సమయం అర్ధరాత్రి కావడంతో.. ఈసారి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజునే జన్మాష్టమి వేడుకలు నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు. పూజా ముహూర్తం: సెప్టెంబర్ 4న రాత్రి 11:57 గంటల నుంచి 12:43 గంటల వరకు ఉంటుంది. ఈ నిశిత కాలంలో బాలకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి.. జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. జన్మాష్టమి పూజల్లో అర్ధరాత్రి సమయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణుడు నిశిత కాలంలో జన్మించాడని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు ఆ సమయంలో భజనలు, కీర్తనలు చేస్తూ శ్రీకృష్ణుడిని పూజిస్తారు. పూజ అనంతరం బాలకృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాలలో వేసి ఊపడం కూడా ముఖ్యమైన ఆచారం. జన్మాష్టమి సందర్భంగా ఇళ్లు, దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. బాలకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి పూజలు చేస్తారు. పూలు, పండ్లు, వెన్న, పాలు వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. పిల్లలకు కృష్ణుడు, రాధ వేషాలు వేయించడం కూడా జన్మాష్టమి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడనే విశ్వాసంతో జన్మాష్టమి రోజంతా భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి సమయంలో
తెల్ల జుట్టు రావడానికి జీన్స్ ప్రధాన కారణం. తల్లిదండ్రుల్లో ఎవరికైనా తెల్ల జుట్టు ఉంటే మీకు కూడా తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉందని హెల్త్లైన్ తెలిపింది. ఒత్తిడి అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఒత్తిడి తీవ్రం అయినప్పుడు విడుదల అయ్యే హార్మోన్లు, రసాయనాల వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. విటమిన్ బి12 లోపించడం వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. కుదుళ్లు కూడా బలహీనంగా మారుతాయి. ఐరన్, జింక్, రాగి, విటమిన్ డి వంటివి జుట్టుకు రంగును అందిస్తాయి. వీటి లోపం వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ తాగడం వల్ల శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీంతో జుట్టు తెల్లగా మారుతుంది. థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోవడం వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. హైపో థైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వల్ల కూడా జుట్టు నెరిసిపోతుంది. ఆటో ఇమ్యూన్ సమస్యల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. విటిలిగో, అలోపేసియా ఏరియాటా వంటి వ్యాధుల వల్ల తెల్ల జుట్టు వస్తుంది. కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుంది. కాబట్టి సహజ ఉత్పత్తులను మాత్రమే వాడండి. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తిరగడం వల్ల అందం పాడువుతుంది. జుట్టు తెల్లగా మారుతుంది. యూవీ కిరణాల బారిన పడటం వల్ల కూడా జుట్టు అందం పాడవుతుంది

రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడుచుకుంటూ వెళ్తున్న నందులాలను ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని విద్యార్థి జైద్షా కద్రీ ఆస్పత్రికి తీసుకెళ్తుండా మరో ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న విద్యార్థిని మహేంద్ర కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నందులాల అక్కడికక్కడే మృతిచెందగా.. విద్యార్థి జైద్షా కద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు యాజమాని వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు.. విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. మహేంద్ర కార్ యాజమానిని గుర్తించారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్.. కారు నడిపి ఒకరి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో కారును సీజ్ చేసిన పోలీసులు.. సందీప్ను అదుపులోకి తీసుకున్నారు. పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల మూడు పోలవరాలు కట్టేంత మొత్తాన్ని పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు

BCCI Chief Selector: భారత జట్టు ఆప్ఘాన్ టీంతో సిరీస్ కోసం బిజీగా మారింది. ఈ క్రమంలో టీం స్వ్కాడ్ 3వ తేదీన ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఆయన భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు ఇప్పటికే మొదలవ్వడంతో.. అగార్కర్ను మరో ఏడాది పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డులోని ఓ వర్గం ఆయనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం భారత పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుత కాంట్రాక్ట్ 2026 సెప్టెంబర్లో ముగియనుంది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనను కొనసాగించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అగార్కర్కు మరో ఏడాది గడువు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం సమావేశం అనంతరం తీసుకోనున్నారు. అంతేకాదు.. ఈ బాధ్యతను కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో అగార్కర్ అభిప్రాయం కూడా కీలకం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! 2023లో చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి కొన్ని అద్భుత విజయాలు సాధించింది. భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ సాధించింది. దీంతో వైట్బాల్ క్రికెట్లో జట్టు విజయాల్లో సెలక్షన్ కమిటీ పాత్రపై ప్రశంసలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో సెలక్షన్ కమిటీలో

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు ( House Arrest) చేశారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి నివాసానికి వెళ్లనున్నట్టు ప్రకటించడంతో ఆయన్ను గృహనిర్బంధం చేసినట్టు పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లాలో నిన్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. నల్గొండలో మంత్రి కోమటి రెడ్డి కార్యాలయం (Komatireddy office) పై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్ల దాడి చేయగా, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి (Varshit Reddy) నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు

ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఈక్వెషన్ యష్ విషయంలో శృతి తప్పింది. యష్ హోమ్ స్టేట్ కర్ణాటకలో టాక్సిక్ కి తగిలిన షాక్ ట్రేడ్ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. షాక్ కి గురి చేయడమే కాదు ఎందుకు ఇలా అనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. యష్ కి ఉన్న క్రేజ్, మాస్ ఇమేజ్ని బట్టి కర్ణాటకలో టాక్సిక్ చాలా తేలికగా 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరుతుందని అందరూ ఆశించారు. మొదటి రోజు వరల్డ్ వైడ్గా వచ్చిన . 140 కోట్ల గ్రాస్ లో కర్ణాటకలోనే దాదాపు 30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డుల బోణీ కొట్టింది. కానీ, రెండో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కర్ణాటకలో ఎలాంటి సినిమా లేకపోయినా కూడా ప్రేక్షకులు టాక్సిక్ థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో కర్ణాటక థియేట్రికల్ రన్లో కనీసం 100 కోట్ల గ్రాస్ మార్జిన్ అందుకోలేక చేతులెత్తేసింది. అయితే ఉత్తరాది హిందీ బెల్ట్లో మాత్రం ‘టాక్సిక్’ అద్భుతమైన ప్రదర్శనతో ఊరటనిస్తోంది. కన్నడ వెర్షన్తో పోలిస్తే బాలీవుడ్ మార్కెట్లో ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కుతుండటం విశేషం. హిందీ బెల్ట్లో తొలి రోజే ఏకంగా 55 కోట్ల మేర సాలిడ్ కలెక్షన్లు సాధించి, సౌత్ ఇండియా సినిమాల్లోనే హిందీ వెర్షన్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమా కంటెంట్కి, యశ్ స్క్రీన్ ప్రజెన్స్కి బ్రహ్మరథం పడుతుండటంతో అక్కడ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బాక్సాఫీస్ పరిస్థితిని పరిశీలిస్తే మరో రకమైన షాకింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. తెలుగులో మొదటి రోజు 20.1 కోట్ల గ్రాస్ సాధించి సాలిడ్ ఓపెనింగ్ తెచ్చుకున్నప్పటికీ, రెండో రోజు నుంచే థియేటర్లలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ఆడియన్స్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో పలు థియేటర్లలో షోలు రద్దయ్యే పరిస్థితులు కూడా చూసింది

Tanuku: ఘనంగా మానవతా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం! తణుకు: మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం తణుకు పట్టణంలో మానవతా శాంతి ర్యాలీ నిర్వహించారు. తోలుత ర్యాలీని ప్రిన్సిపాల్ K శ్రీనివాసరావు స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభించి అనంతరం నరేంద్ర కూడలి మీదుగా ఎన్టీఆర్ పార్క్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బిసి వసతి గృహాల్లో విద్యార్థులకు బాక్సులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ తణుకు శాఖ అధ్యక్షుడు వంగూరి హనుమంతరావు, బోయపాటి రామలక్ష్మి, యస్ వి సతీష్ బాబు,పాతూరి శివన్నారాయణ, ఆకుల శేషుబాబు,కడించర్ల రాజరాజేశ్వరరావు., పుప్పాల రామకృష్ణ , డాక్టర్ దాట్ల సత్యనారాయణ రాజు,పిఆర్ కె రాజు బోడపాటి ప్రసాద్ ఒబిలిశెట్టి హరనాథ్ అక్కా పంతుల బాలాజి, వి.శ్రీనివాస రావు, ఎస్బిఐఎం ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, ఎస్ఎన్విటి జూనియర్ కళాశాలల విద్యార్థు పాల్గొన్నారు

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజ హీరోగా నటించి 'అమర్ అక్బర్ ఆంటోని' పరాజయం పాలైనా ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు అదే బ్యానర్ లో సోలో హీరోగా 'ఇరుముడి'తో రవితేజ గ్రాండ్ విక్టరీని అందుకున్నాడు. మాస్ మహరాజా రవితేజకు మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ సక్సెస్ ను అందించింది. అలానే మైత్రీ మూవీ మేకర్స్ కూ రవితేజ ఓ గ్రాండ్ విక్టరీని అందించాడు. ఎందుకంటే రవితేజ సినిమా సక్సెస్ సాధించి సంవత్సరాలు గడిచిపోయింది. అలానే 'పుష్ప -2' తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. మధ్యలో వచ్చి తమిళ చిత్రం 'డ్యూడ్' అక్కడ ఫర్వాలేదనిపించింది కానీ తెలుగులో పెద్దంతగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా, ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలు రెండూ పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో రవితేజతో చేసిన ద్విభాషా చిత్రం 'ఇరుముడి' హిట్ కావడం విశేషమే. ఆగస్ట్ 26న యశ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' వచ్చే వరకూ 'ఇరుముడి' స్వైర విహారం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజే 'ఇరుముడి' రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ లెక్కన శని, ఆదివారాలతో ఈ సినిమా తేలికగా రూ. 50 కోట్ల నుంచి 60 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక సోమ, మంగళవారాల్లోనూ ఇదే జోరు కొనసాగితే... బుధవారానికి 'ఇరుముడి' తేలికగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. ఒక వేళ బుధవారం వచ్చే 'టాక్సిక్' అటూ ఇటూ అయితే... అది కూడా 'ఇరుముడి'కి కలిసొచ్చే అంశమే. 'టాక్సిక్'కు ఇప్పుడున్న ఇమేజ్ బట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆ సినిమాకు వెళ్ళడం కష్టమే. అప్పుడు వారందరికీ 'ఇరుముడి' బెటర్ ఆప్షన్ అవుతుంది. అదే జరిగే... 'ఇరుముడి' ఆ తర్వాత వారాంతానికి రూ. 200 కోట్ల గ్రాస్ను వసూలు

చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలకు తన్మయత్వంతో చిందులేసిన కుర్రాడు.. కళ్లుచెదిరే ఫైట్లు, కళ్లప్పగించి చూసే డ్యాన్సులతో వెండితెరకు వాయువేగాన్ని పరిచయం చేసిన అంజనీపుత్రుడు.. కమర్షియల్ సినిమాను కొత్త పుంతలు తొక్కించి బాక్సులు బద్దలుకొట్టిన స్టారాధిస్టారుడు.. నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగానికి ఎనలేని సేవలందించిన పద్మవిభూషణుడు.. ఏడు పదుల వయసులోనూ అభిమానుల హృదయాలను ఏలుతున్న చిరంజీవుడు.. మెగాస్టార్ చిరంజీవి! నేడు ఆయన 71వ జన్మదినోత్సవం. అభిమానులకు పట్టలేని సంబరం. ఈ సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం(Megastar Chiranjeevi 71st Birth day). చిరంజీవి అనగానే గుర్తొచ్చేది.. ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది ఒకటుంది. అదేంటో అందరికీ తెలుసు. అవును..! అది తనకు మాత్రమే సాధ్యమనిపించే డ్యాన్స్. చిరు డ్యాన్స్లో ఓ ఊపు ఉంటుందబ్బా అంటారు 90's కిడ్స్ (90's kids). ఇక జెన్జీ(Gen-Z) కుర్రాళ్లేమో బాస్ స్టెప్పేస్తే ఆ గ్రేసే వేరు బ్రో అంటారు. అందువల్లేనేమో తరాలకు అతీతంగా అందరూ చిరు డ్యాన్సులకు కనెక్టవుతుంటారు. చిరంజీవి పాట ఎక్కడ వినిపించినా, అందులోని లిరిక్సే కాదు, ఆయన వేసిన స్టెప్పులు కూడా ఇట్టే గుర్తొస్తాయి. 90's కిడ్స్కు పాటలు వినాలంటే ఒకప్పుడు రేడియో, ఆ తరువాత టేప్ రికార్డర్, వాక్మ్యాన్, సీడీ ప్లేయర్, యూట్యూబ్, స్పాటిఫై.. ఇలా ఎన్నో మారాయి. కానీ, వాటిలో చిరంజీవి పాటలను వింటూ ఎంజాయ్ చేయడంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. అందుకే చిరంజీవి పాటలంటే వారికి ఓ అందమైన జ్ఞాపకం. ఎక్కడైనా 90's కిడ్స్ రీయూనియన్ పార్టీ జరుగుతోందనుకోండి. అందులోకి వెళ్లి చూస్తే చిరంజీవి పాటలతో టాప్ లేచిపోతుంటుంది. ‘జీ.. ఏ.. ఎన్.. జీ.. గ్యాంగ్ గ్యాంగ్.. బజావో బ్యాంగ్ బ్యాంగ్.. గ్యాంగ్ లీడర్’(Gang Leader) అని ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం గట్టిగా అరిచేస్తుంటారు. ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ.. ఎంత కమ్మగా ఉందిరో యబ్బ..’ (Jagadekaveerudu Atilokasundari) అని తమ ఊహల్లోని అతిలోక సుందరిని ఊహించుకుంటూ లయబద్ధంగా స్టెప్పులేస్తుంటారు. ‘బంగారు కోడిపెట్ట వచ్చెనండి
‘ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్కు అలవాటు పడి థియేటర్లకు రావడం మానేశారు’.. ఇదీ కొంతకాలంగా సినీ వర్గాలు చెబుతున్నా మాట. దానికి తగినట్లే 2026లో సంక్రాంతి సీజన్ తర్వాత చాలాకాలం పాటు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే మంచి కంటెంట్ అందిస్తే థియేటర్లకు వచ్చేందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉంటామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇదే విషయాన్ని 2026 సెకండాఫ్ స్పష్టంగా చెబుతోంది. ‘ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు, ఓటీటీల వల్లే థియేటర్ల వ్యవస్థ దెబ్బతింటోంది’ అన్న వాదనలకు టాలీవుడ్ బాక్సాఫీస్ గట్టి సమాధానం చెబుతోంది. కథలో బలం, చెప్పే విధానంలో కొత్తదనం ఉంటే చాలు... ప్రేక్షకులు థియేటర్లను బ్రహ్మరథం పడతారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గత రెండు నెలలుగా వరుస విజయాలతో సినిమా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.‘పెద్ది’తో మొదలై ‘ఇరుముడి’ వరకు ఈ బ్లాక్బస్టర్ వేవ్ ‘పెద్ది’ విజయంతో ఊపందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘మా ఇంటి బంగారం’, వైవిధ్యభరిత కథాంశంతో మెప్పించిన ‘లెనిన్’, సరికొత్త ప్రేమకథగా ఆకట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’, కడుపుబ్బా నవ్వించిన ‘కొరియన్ కనకరాజు’, ఎమోషన్స్ మేళవింపుగా వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలు వరుసగా విజయబావుటా ఎగురవేశాయి. తాజాగా డివైన్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఇరుముడి’ సైతం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుని థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇలా వారానికి ఒక మంచి సినిమా రావడం, అది ప్రేక్షకులను విశేషంగా అలరించడం పరిశ్రమకు సరికొత్త ఊపునిచ్చింది.* డిఫరెంట్ షేడ్స్లో అదరగొట్టేసిన మెగాస్టార్.. సంక్రాంతికి ‘కాకా’ రచ్చకంటెంట్కు జైకొడుతున్న ప్రేక్షక దేవుళ్లుఈ విజయాల వెనుక ప్రధానమైన అంశం కంటెంట్ ప్రాధాన్యత. స్టార్ డమ్ కంటే కూడా కథను నమ్ముకుని తీసిన చిన్న, మధ్యతరహా చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. వీకెండ్ వస్తే చాలు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్స్ బుక్మైషో, డిస్ట్రిక్స్ హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. స్టార్ ఇమేజ్తో పనిలేకుండా ఒక మంచి

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తాయిమామన్ తంగ మోతిరం పథకం టెండర్ ప్రక్రియ పూర్తయింది. ప్రముఖ జ్యువెలరీ సంస్థలు జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యువెలరీస్ ఎంపిక అయ్యాయి. 755 కోట్ల రూపాయల విలువ చేసే టెండర్లు ఇవి. బంగారం ఉంగరాన్ని తయారు చేయడం, రవాణా, ఇతరత్రా ఖర్చులను ఆ సంస్థలే భరించాల్సి ఉంటుంది.ఈ పథకం కింద తమిళనాడులోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే సుమారు 4.42 లక్షల మంది నవజాతా శిశువులకు ఒక్కో గ్రాము చొప్పున బంగారు ఉంగరాలను బహూకరిస్తారు. ఈ పథకానికి సంబంధించిన బంగారపు వ్యయాన్ని మార్కెట్ ధరల ఆధారంగా ప్రభుత్వమే భరిస్తుంది. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచేందుకు విజయ్ ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్నారు.దీనికోసం తమిళనాడు మెడికల్ సర్వీసెస్ జూలై 14న దేశవ్యాప్తంగా టెండర్లను ఆహ్వానించింది. అధికారిక టెండర్ల పోర్టల్ ద్వారా జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యవెలరీస్, జీఆర్టీ జ్యువెలర్స్, ఉమ్మిడి జ్యువెలర్స్ వంటి మొత్తం 11 జ్యువెలరీ సంస్థలు ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. బిడ్డింగ్ దాఖలు చేశాయి. ఆయా సంస్థల్లో అన్నింటికంటే తక్కువ ధరను కోట్ చేశాయి.. జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్.ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎందీంతో వీటిని ప్రభుత్వం ఎంపిక చేసింది. 70:30 నిష్పత్తిలో బంగారు ఉంగరాల తయారీ, సరఫరా బాధ్యతలను అప్పగిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. జాయ్ ఆలుక్కాస్ అతి తక్కువ బిడ్డింగ్ నమోదు చేసింది. ఒకే ఒక్క పైసా సర్వీస్ ఛార్జీని మాత్రమే కోట్ చేస్తూ ఈ టెండర్ను దక్కించుకుంది. బంగారం ధర తప్ప.. ఉంగరం మేకింగ్ ఛార్జీలు, రవాణా, ఇన్సూరెన్స్, హాల్ మార్కింగ్, సర్వీస్ ఛార్జీలు.. అన్నింటికీ కలిపి ఒకే ఒక్క పైసా కోట్ చేసి టెండర్ దక్కించుకుంది జాయ్ అలుక్కాస్.సీఎం విజయ్ బిగ్

దాదాపు మూడు దశాబ్దాల క్రితం కానిస్టేబుల్ను హత్య చేసి పరారైన మాజీ నక్సలైట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల, ఆగస్టు21: దాదాపు మూడు దశాబ్దాల క్రితం కానిస్టేబుల్ను హత్య చేసి పరారైన మాజీ నక్సలైట్ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 1992లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్ల కాలువ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సును అడ్డుకుని హెడ్ కానిస్టేబుల్ షేక్ అబ్దుల్ కరీంను మాజీ నక్సలైట్ మాడుగుల సుబ్బన్న కాల్చి చంపాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ1గా మాడుగుల సుబ్బన్న పేరును పోలీసులు చేర్చారు. నాటి నుంచి అతడి కోసం గాలించినా.. ఆచూకీ లభ్యం కాలేదు. అయితే అతడు కర్ణాటకలోని చిత్రదుర్గలో నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఇటీవల రహస్య సమాచారం అందింది. దీంతో ఆత్మకూరు సీఐ సురేశ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఓ బృందం కర్ణాటక వెళ్లింది. చిత్రదుర్గలో మాడుగుల సుబ్బన్న అలియాస్ గుంటూరు గద్దర్ అలియాస్ మంజునాథ్ పాటిల్ను వారు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని నంద్యాల జేఎంఎఫ్సీ (JMFC) కోర్టులో హజరుపరిచారు. 34 ఏళ్లుగా పరారిలో ఉన్న మాజీ నక్సలైట్ మాడుగుల సుబ్బన్న అరెస్ట్తో ఆత్మకూరు మండల కేంద్రంలో కలకలం రేగింది. సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు నో క్లియరెన్స్.. స్పందించిన కేంద్రం ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం: మంత్రి నారాయణ ఫైర్

రంగులు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కాస్త కష్టమే. మన చుట్టూ ఉన్న ఇళ్లు, దేవాలయాలు, మ్యూజియంలు, ఆఫీసులు.. ఇలా ప్రతి నిర్మాణంలోనూ రంగులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే కొన్ని కట్టడాల్లో రంగులను కేవలం అలంకరణ కోసం కాకుండా.. ఆ నిర్మాణానికే ప్రత్యేక గుర్తింపుగా మార్చేశారు. ఎక్కడ చూసినా కళ, రంగులు, డిజైన్ కలగలిసి చూపరులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందించిన అలాంటి అద్భుత నిర్మాణాల్లో కొన్ని ఇవి. రంగురంగుల ఆలయ నిర్మాణాలకు తమిళనాడు పెట్టింది పేరు. తిరుచిరాపల్లిలోని శ్రీరంగనాథస్వామి ఆలయం కూడా అందుకు ఉదాహరణ. శతాబ్దాల పాటు వివిధ రాజవంశాల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన ఈ ఆలయ సముదాయంలో అనేక గోపురాలు ఉన్నాయి. వాటిపై కనిపించే శిల్పాలు, రంగులు.. ఆలయానికి ప్రత్యేకమైన వైభవాన్ని తీసుకొచ్చాయి. ఆధ్యాత్మికతతో పాటు దక్షిణ భారత ఆలయ శిల్పకళను అద్భుతంగా పరిచయం చేసే ప్రదేశంగా ఇది నిలిచింది. స్పెయిన్లోని లెగనీస్ సెంట్రల్ లైబ్రరీ కూడా ఆకట్టుకుంటుంది. పుస్తకాలను షెల్ఫ్లలో అమర్చినట్టుగా భవనాన్ని నిర్మించారు. సూర్యకిరణాలు భవనంపై పడినప్పుడు గోడలపై కనిపించే రంగులు, టెక్చర్..పేజీలను తలపించేలా ఉంటాయి. లండన్లోని క్రాయ్డన్ ప్రాంతంలో పాదచారుల కోసం కట్టారు. 3డీ పోర్సిలైన్ టైల్స్ను ఉపయోగించి గోడలు, స్తంభాలను నిర్మించారు. ఏ మూల నుంచి చూసినా కొత్త డిజైన్ కనిపించేలా రూపొందించారు. ఇది కేవలం ఒక మార్గంలా కాకుండా.. ఒక కళాత్మక అనుభవాన్ని అందించాలన్న ఉద్దేశంతో దీనిని రూపొందించారు. చెత్తను కాల్చి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ అంటే సాధారణంగా పెద్ద పరిశ్రమ గుర్తుకొస్తుంది. కానీ జపాన్లోని మైషిమా ప్లాంట్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. రంగురంగుల గోడలు, విచిత్రమైన ఆకృతులు, కళాత్మక అలంకరణలతో ఇది బయట నుంచి చూస్తే ఒక థీమ్ పార్క్లా కనిపిస్తుంది. ఆస్ట్రియన్ కళాకారుడు ఫ్రీడెన్స్రైచ్ హండర్ట్వాసర్ రూపొందించిన ఈ నిర్మాణం పరిశ్రమల భవనాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చింది. స్పెయిన్లోని బార్సిలోనాలో ఉన్న ఈ ప్రసిద్ధ కాన్సర్ట్ హాల్ నిర్మాణం

విజయనగరం ఎంపీ, టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు మార్గదర్శి సంస్థపై తనకున్న అచంచల విశ్వాసాన్ని, మద్దతును చాటుకున్నారు. శుక్రవారం ఆయన మార్గదర్శి కార్యాలయాన్ని సందర్శించి, తన కుమార్తె నిఖిల తొలి నెల వేతనంతో ఆమె పేరిట రూ. 25 లక్షల విలువైన చిట్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.ఇటీవల మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మార్గదర్శి కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ, "సత్యం నిప్పు లాంటిది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత, విశ్వసనీయత వంటి విలువల కారణంగానే ప్రజలు మార్గదర్శిపై అపారమైన నమ్మకం ఉంచుతున్నారని ఆయన కొనియాడారు.తాను సుమారు 20 ఏళ్ల క్రితమే మార్గదర్శి సంస్థకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో అంతిమంగా న్యాయమే గెలిచిందని, ఈ పరిణామంతో మార్గదర్శిపై ప్రజల్లో ఉన్న నమ్మకం మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు

ఒకప్పుడు ఇమ్రాన్ హష్మీ అంటే రొమాన్స్, మ్యూజిక్, ఇంటెన్స్ లవ్ స్టోరీస్ కానీ ఆ ఇమేజ్కి కాలం చెల్లిపోయిందనే టైమ్లో ‘ఆవారాపన్ 2’తో మళ్లీ బాక్సాఫీస్పై తన మార్క్ చూపించాడు. ‘ఆవారపన్ 2’... విడుదలైన ఐదు రోజుల్లోనే ఇండియాలో 100.75 కోట్ల నెట్, వరల్డ్వైడ్గా 144.13 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ మెయిన్ లీడ్గా నటించి 100 కోట్ల క్లబ్లోకి వెళ్లిన తొలి సినిమా ఇదే. అంటే చాలా కాలంగా ఎదురుచూస్తున్న సోలో సక్సెస్ ఇప్పుడు సీక్వెల్ రూపంలో దక్కింది. అసలు ఈ సక్సెస్కి బలం 2007లో వచ్చిన ‘ఆవారపన్’కున్న కల్ట్ ఫాలోయింగే. ఆ సినిమా అప్పట్లో థియేటర్లలో పెద్దగా ఆడకకపోయినా కాలక్రమంలో శివ్ పండిట్ క్యారెక్టర్, మ్యూజిక్, ఇమ్రాన్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అదే నోస్టాల్జియా థియేటర్లలోకి ఆడియన్స్ను తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. రీసెంట్ టైమ్లో ఇమ్రాన్ హీరోగా మాత్రమే కాకుండా యాంటాగనెస్ట్, క్యారెక్టర్ రోల్స్ కూడా ఎంచుకున్నాడు ‘OG’, ‘G2’ వంటి సినిమాలతో కొత్త ఇమేజ్కి షిఫ్ట్ అవుతున్న టైమ్లో ‘ఆవారపన్ 2’ మాత్రం ఇప్పుడు సోలో హీరోగా తన మార్కెట్ ఇంకా ఉందని ప్రూవ్ చేసింది. అందుకే ఇది కేవలం మరో హిట్ కాదు ఒకప్పుడు తగ్గిపోయిందనుకున్న స్టార్ మార్కెట్ను మళ్లీ రీసెట్ చేసిన కెరీర్ కంబ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్

Irumudi Movie Review: రవితేజ విశ్వరూపం.. బొమ్మ దద్దరిల్లింది! Irumudi Movie Review: వరస ప్లాపులతో కాస్త వెనుకబడ్డ మాస్ మహారాజ్ రవితేజ, ఈసారి తన రొటీన్ మాస్ ఆరాటాన్ని పక్కన పెట్టి, ఒక బలమైన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆడియన్స్లో మంచి బజ్ క్రియేట్ చేసిన 'ఇరుముడి' సినిమా థియేటర్లలో ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికొస్తే.. సీలేరు ప్రాంతంలోని ఒక చిన్న పల్లెటూర్లో అరటిపళ్ల వ్యాపారం చేసుకునే త్రినాథ్ అనే సగటు కుటుంబ పెద్దగా రవితేజ కనిపిస్తారు. ఆయనకు భార్య కావేరి, కూతురు మణికంఠ అంటే ఎనలేని ప్రాణం. తన వ్యాపారం చేసుకుంటూనే ప్రతి సంవత్సరం నియమంగా అయ్యప్ప మాల వేసుకుంటాడు త్రినాథ్. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి అనుకోకుండా ఒక పెద్ద సమస్య వచ్చిపడుతుంది. ఊరిలో అనుమానాస్పదంగా కొందరు అమ్మాయిలు వరసగా చనిపోతుంటారు. ప్రతీ అమ్మాయిలో తన కూతురినే చూసుకునే హీరో, ఈ మరణాల వెనుక ఉన్న అసలు మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఎదురైన నిజాలు ఏంటి? ఈ మిస్టరీని హీరో ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ. మంచి స్క్రిప్ట్ ఉంటే రవితేజ ఏ రేంజ్ లో రేచ్చిపోతాడో ఈ సినిమాతో మరోసారి చూపించాడు.రవితేజ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ నటనతో సినిమాను తన భుజాలపై మోశారు. చిన్న పాప నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర బాగానే చేశారు. దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న కథ ఆకట్టుకునే విధంగా ఉంది. ఓ ఊరులో జరిగే సాధారణ కథను తెర మీద అద్భుతంగా చూపించారు. ఇక జీవీ ప్రకాష్ తన నేపథ్య సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారనే చెప్పాలి. దర్శకుడు అనుకున్న పాయింట్ను చాలా బలంగా చెప్పగలిగారు. ముఖ్యంగా ద్వితీయార్థాన్ని నడిపించిన తీరు బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కథ మూడ్కి తగ్గట్టుగా కుదిరాయి

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు చిట్టిల పేరుతో మోసం చేశాడు. వైసీపీ నేతగా చలామణి అవుతున్న మండాది శ్రీనివాసరావు దంపతులు చీటిల ముసుగులో రూ.70 లక్షలు కాజేశారు. గుడివాడ, ఆగస్టు 21: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు చిట్టిల పేరుతో మోసం చేశాడు. గుడివాడ ఎన్టీఆర్ కాలనీకి చెందిన మండాది మహాలక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు చీటిల ముసుగులో రూ.70 లక్షలు కాజేశారు. గత 20 ఏళ్లుగా కాలనీలో మత్స్యకార కుటుంబాలకు చెందిన వారితో చీటీలు కట్టించారు. తమకు చెల్లించాల్సిన చీటీ పాటల నగదును చెల్లించకుండా ఎగవేస్తున్నారని గుడివాడ పోలీసులకు జులై 31న బాధితులు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వర్ధంతి.. పవన్ కల్యాణ్ ఘన నివాళులు.. ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

Kagaznagar: ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు! Kagaznagar: కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ లో భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి. అధిత ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలునిర్వహించారుఈసందర్భంగాపట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి బి. అధిత పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మార్కెట్ ప్రాంతంలో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి రాజీవ్ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌక్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అక్కడ శ్రమదానం చేపట్టారు. ఈ సందర్భంగా బి.అధిత మాట్లాడుతూ యువతకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేలా రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని నమ్మిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమైన S.I.R. ప్రక్రియలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అర్హులైన యువతకు ఫారం–6 దరఖాస్తులను అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. బూత్ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలోని యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఫారం–6 దరఖాస్తు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు

ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఏదీ కలిసి రావట్లేదు. ఒకదాని వెంట వరుస దెబ్బలు తగులుతున్నాయి. కొన్ని కీలక విషయాల్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. మొన్నటికి కాక్రోచ్ జనత పార్టీ ధాటికి ఏకంగా కేంద్ర మంత్రే రాజీనామా చేయాల్సొచ్చింది. దాని నుంచి తేరుకోకముందే.. బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో చేతు అనుభవాన్ని చవి చూసింది. సాక్షాత్.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడే ఖాళీ చేసిన ఈ కంచుకోటను నిలబెట్టుకోలేకపోయింది.2010 నుంచి ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహిస్తూ వచ్చిన ఈ నియోజకవర్గాన్ని బంగారం పళ్లెంలో పెట్టి మరీ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వాన్ని వహిస్తోన్న బీజేపీ. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మడమ తిప్పక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కులం, విద్యార్థులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను పునఃసమీక్షించుకుంటోండటం దీనికి నిదర్శనం.దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష నిరోధానికి తీసుకొచ్చిన నూతన యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోనుంది కేంద్రం. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సైతం తెలియజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అధికారికంగా సమాచారం ఇచ్చారు.యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోవడం అనేది.. కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బే. ఈ నిర్ణయం వెనుక కీలక రాజకీయ పరిణామాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇటీవలి కాలంలో ఈ నిబంధనలపై అగ్రవర్ణ సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని బాంకీపూర్ ఉప ఎన్నిక రెఫరెండంగా భావించినట్టయింది. ఇక్కడ ఓటమిపాలు కావడం.. ప్రజల్లో, ప్రత్యేకించి.. అగ్రవర్ణ సామాజిక వర్గాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత పేరుకుపోయిందనేది స్పష్టమైంది.దాదాపు మూడు దశాబ్దాలుగా తమ కంచుకోటగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని ప్రశాంత్ కిశోర్కు ధారాదాత్తం చేసుకోవడం వెనుక యూజీసీ నిబంధనలపై వ్యక్తమైన అగ్రవర్ణాల అసంతృప్తే కారణమని బీజేపీ అంతర్గత వర్గాలు విశ్లేషిస్తోన్నాయి

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రానున్న మూవీలో హీరోయిన్గా సారా అర్జున్ పేరును పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ‘ఆర్సీ 17’ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘బఘీరా’ కన్నుమూసింది. నాలుగేళ్ళుగా తమ కుటుంబంలో భాగమైన బఘీరాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. అంతేకాక పెట్ డాగ్ను ప్రేమగా హగ్ చేసుకున్న ఫోటోలను పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై మళ్ళీ ప్రచారం వేడెక్కింది. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోవడంతో దర్శకుడు వశిష్ఠ లైన్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. విజయదశమికి ఈ కాంబోలో రానున్న చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. మరోసారి అసూయ చాటుకున్న సిద్ధార్థ్ ఆనంద్! Nagarjuna: ఆ సినిమా చేయడమే నేను తీసుకున్న సాహసోపేత నిర్ణయం Sanjjanaa Galrani: విజయ్.. త్రిష.. సంజన గల్రానీ షాకింగ్ కామెంట్స్!

వన్డే వరల్డ్కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు. ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్గా ఉన్న యశస్వి జైశ్వాల్ను కాదని వైభవ్కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు. ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్తో పాటు సంజూ శాంసన్లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను వరల్డ్కప్కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో భువనేశ్వర్ అద్భుతంగా

రెండు వేర్వేరు రాష్ట్రాలు, రెండు వేర్వేరు ప్రభుత్వాలు.. కానీ రాజధాని మాత్రం ఒకటే. ఇది మరెక్కడో కాదు.. మన దేశంలోనే. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు రెండింటికీ ఏకైక రాజధానిగా ఉన్న నగరం చండీగఢ్.. అసలు.. రెండు రాష్ట్రాలకు ఒకే నగరం రాజధానిలా ఎలా మారింది..? భారతదేశంలోని మొదటి ప్లాన్డ్ సిటీగా పిలిచే చండీగఢ్ నగరం కథేంటి? ఈ నగరం ఎందుకు అంత స్పెషల్..? ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం... ఈ ప్రాంతంలో ప్రసిద్ధ చండీ మందిరం ( దుర్గా దేవి గుడి) ఉంది. అలాగే ఇక్కడ ఫేమస్ గఢ్( కోట) కూడా ఉంది. ఈ రెండు పదాలను కలిపి చండీగఢ్ అనే పేరు పెట్టారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు.. పంజాబ్ పాత రాజధాని ‘లాహోర్’ పాకిస్తాన్ లోకి వెళ్లిపోయింది. దీంతో పంజాబ్ కోసం కొత్త రాజధాని నిర్మించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చండీగఢ్ ని రాజధానిగా నియమించారు. స్వతంత్ర భారత ప్రతిభను ప్రపంచానికి చూపించేలా ఒక ఆధునిక నగరాన్ని కట్టాలని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అనుకున్నారు.ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బుసియర్ ఈ నగరానికి ప్లాన్ వేశారు. విచిత్రమేంటంటే.. మనిషి శరీరం ఆధారంగా ఈ నగరాన్ని డిజైన్ చేశారు. క్యాపిటల్ కాంప్లెక్స్ తల భాగంలో, సిటీ సెంటర్ గుండె ఆకారంలో, పార్కులు, చెట్లు ఊపిరితిత్తులు గా విభజించారు. ఇక ఈ నగరాన్ని 'సెక్టర్లు'గా విభజించారు. ప్రతీ సెక్టార్లోనే బడులు, మార్కెట్లు, పార్కులు ఉండేలా ప్లాన్ చేశారు. అయితే చండీగఢ్లో సెక్టర్ 13 ఉండదు. 1966లో పంజాబ్ నుండి 'హర్యానా' ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మన తెలుగు రాష్ట్రాలు విడిపోయినట్లే పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. అయితే.. విభజన తర్వాత చండీగఢ్ మాదంటే మాదని ఇరు రాష్ట్రాలూ పట్టుబట్టాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారం కనుగొంది. చండీగఢ్ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా (UT) ప్రకటిస్తూ, రెండింటికీ ఉమ్మడి రాజధానిగా చేసింది

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Venus Transit In Chitra Nakshatra Effect: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ గ్రహం సంపదతో పాటు ప్రేమ వైభవం విలాసం సౌందర్యానికి కారకుడిగా కూడా భావిస్తారు. ఇదిలా ఉంటే ఆగస్టు 25వ తేదీన 12 గంటల సమయంలో శుక్రుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఒకటే నక్షత్రంలో సంచార దశలో ఉండబోతోంది. ముఖ్యంగా చిత్రా నక్షత్రంలోకి శుద్రుడు ప్రవేశించడం కారణంగా మొత్తం నాలుగు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడబోతోంది. ఈ సమయంలో విపరీతమైన ఆధార మార్గాలు పెరగడమే కాకుండా కొన్ని రాశుల వారికి ఉద్యోగాలపరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పురోగతి కూడా లభిస్తుంది. శుక్రుడి సంచారం కారణంగా ఏయే నాలుగు రాశుల వారికి సమయం అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మేషరాశి చిత్రా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించిన వెంటనే మేషరాశి వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులు కార్యాలయాల్లో మంచి మంచి పనులు చేయగలుగుతారు. కొత్త ప్రాజెక్టుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వనరులు కూడా అంచలంచలుగా పెరుగుతాయి. అంతేకాకుండా డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృషభ రాశి వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా శుక్రుడు సంచార ప్రభావం కొత్త ప్రణాళికలను కూడా

బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు - భీముడు' సినిమాను నిర్మించిన చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ మృతికి తెలుగు దేశం నాయకులు సంతాపం తెలిపారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు - భీముడు' సినిమాను నిర్మించిన నిర్మాత చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ (74) అనారోగ్యంతో ఆగస్ట్ 17న కన్నుమూశారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన 'రాముడు - భీముడు' 1988లో విడుదలై చక్కని విజయాన్ని అందుకుంది. ఇందులో సుహాసిని, రాధ హీరోయిన్లుగా నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఈ సినిమాకు కె. మురళీమోహనరావు దర్శకత్వం వహించారు. తెలుగు దేశం పార్టీలోనూ చురుకైన కార్యకర్తగా పేరు తెచ్చుకున్న సత్యనారాయణ ఆ పార్టీ అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారు. ఆయనకు భార్య గిరిజా కుమారి, కుమారులు వెంకటేశ్వరరావు (నాని), విజయ్ కుమార్ ఉన్నారు. చిట్టూరి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు నిడదవోలు లయన్స్ నేత్రాలయానికి దానం చేశారు. చిట్టూరి మృతికి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పలువురు గ్రామ పెద్దలు నివాళులు అర్పించారు. తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా