
తెలంగాణలో ఈ జలపాతం అందాలు చూస్తే మైమరచిపోవాల్సిందే
తెలంగాణలోని ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో ఆదిలాబాద్ జిల్లాలోని గాయత్రి జలపాతం ఒకటి. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటి ధారలు, చుట్టూ పచ్చని అడవులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ అంటే చారిత్రక కట్టడాలు, పురాతన కోటలకే పరిమితం కాదు.. అద్భుతమైన ప్రకృతి సోయగాలకు కూడా ఈ రాష్ట్రం నిలయం.. రాష్ట్రంలోని అడవుల్లో ఎన్నో అద్భుతమైన జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని గాయత్రి జలపాతం కూడా ప్రకృతి ప్రేమికులకు మంచి గమ్యస్థానంగా నిలుస్తోంది. ఆదిలాబాద్ ప్రాంతంలోని దట్టమైన అటవీప్రాంతంలో గాయత్రి జలపాతం కొలువై ఉంది. కడెం నదీ ప్రవాహం నుంచి ఏర్పడిన ఈ జలపాతం సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతూ అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. చుట్టూ పచ్చని కొండలు, చెట్లు, స్వచ్ఛమైన ప్రకృతి మధ్య జాలువారే నీటి ధారలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రాంతానికి ఎగువ నుంచి భారీగా నీరు చేరుతుంది. దీంతో జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వర్షాలు పడిన తర్వాత గాయత్రి జలపాతం పరిసర ప్రాంతం పచ్చదనంతో నిండిపోవడంతో ప్రకృతి అందాలు మరింత పెరుగుతాయి. గాయత్రి జలపాతం ప్రాంతం ప్రకృతి అందాలతో పాటు అడ్వెంచర్ కార్యకలాపాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివిధ సందర్భాల్లో సాహస క్రీడలు నిర్వహిస్తుంటారు. వాటర్ రాపెల్లింగ్, రాఫ్టింగ్, క్లైంబింగ్, బోటింగ్ వంటి కార్యక్రమాల్లో సాహస ప్రియులు పాల్గొంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆసక్తిదారులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ సాహస క్రీడలను వీక్షించేందుకు కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. హైదరాబాద్ నుంచి సుమారు 260–270 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాయత్రి జలపాతం (ఆదిలాబాద్ జిల్లా) చేరుకోవడానికి రోడ్డు మార్గమే ఉత్తమం. NH-44 జాతీయ రహదారి గుండా నిర్మల్ మీదుగా నేరడిగొండకు వెళ్లాలి. అక్కడ నుండి తర్ణంఖుర్ద్ గ్రామం చేరుకుని, ఆ తర్వాత దాదాపు