
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు.. ఇలా రకరకాల రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగాల విషయానికి వస్తే ఇక్కడ ఇలాంటి రిజర్వేషన్లు లేవు. అయితే కృత్రిమ మేధ (AI) విస్తృతంగా పెరుగుతూ ఉద్యోగాలను మింగేస్తున్న నేపథ్యంలో కొత్త రకం రిజర్వేషన్లు కావాలన్న భావనలు పెరుగుతున్నాయి. అవే ‘మానవ రిజర్వేషన్లు’. కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉద్యోగాల భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కీలక ప్రతిపాదన చేశారు. సాంకేతికంగా ఏఐ చేయగలిగినప్పటికీ, కొన్ని ఉద్యోగాలను పూర్తిగా మనుషులకే కేటాయించే ‘హ్యూమన్ రిజర్వ్డ్’ (Human Reserved) కేటగిరీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇటీవల ప్రచురించిన దాదాపు 6,000 పదాల వ్యాసంలో గేట్స్ ఈ ఆలోచనను వెల్లడించారు. ఏఐ ప్రభావం గతంలోని కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాంకేతిక మార్పుల కంటే వేగంగా ఉండొచ్చని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే డిజిటల్ వ్యవస్థల్లో ఏఐని అమలు చేసే అవకాశం ఉండటంతో, ఉద్యోగాల్లో మార్పులు దశాబ్దాల సమయం తీసుకోకపోవచ్చని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్, మిడ్-లెవల్ ఉద్యోగాలు గణనీయంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు. కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా విశ్లేషణ, రుణాల అంచనా వంటి అనేక పనులను భవిష్యత్తులో ఏఐ నిర్వహించే అవకాశం ఉందని గేట్స్ పేర్కొన్నారు. కేవలం ఉద్యోగాలు కోల్పోయిన వారికి మరో ఉద్యోగం కోసం శిక్షణ ఇవ్వడం మాత్రమే సరిపోదని, ప్రభుత్వాలు ముందుగానే ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గేట్స్ ప్రతిపాదించిన ఈ విధానం ప్రకారం, AI లేదా రోబోట్లు ఒక పనిని చేయగలిగినా.. సమాజం నిర్ణయిస్తే ఆ పనిని మనుషులకే పరిమితం చేయవచ్చు. ప్రకృతి రిజర్వ్లలో కొన్ని ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచినట్లే, కొన్ని ఉద్యోగాలను కూడా సాంకేతిక ఆటోమేషన్ నుంచి రక్షించాలన్నది ఈ ఆలోచన. ప్రత్యేకంగా వృద్ధుల సంరక్షణ, పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్య సేవలు

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ కుమార్తె ఫోబీ గేట్స్కు చెందిన షాపింగ్ స్టార్టప్ ‘ఫియా’ (Phia) తీవ్రమైన ఆరోపణలతో వివాదంలో చిక్కుకుంది. ‘కుకీ స్టఫింగ్’ అనే మోసపూరిత టెక్నిక్ను ఉపయోగించి అక్రమంగా ఆదాయం పొందిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఈ తరహా చర్యలను తీవ్రమైన ‘ఫెడరల్ వైర్ ఫ్రాడ్’గా పరిగణిస్తారు. ఒకవేళ నేరం రుజువైతే గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి అధికారిక అభియోగాలు నమోదు కాలేదు.అసలేమిటీ ‘కూకీ స్టఫింగ్’?వినియోగదారులు ఒక వెబ్సైట్ను సందర్శించినప్పుడు, వారు ఆ సంస్థ అందించే కూపన్లు లేదా ఇతర సేవలను వాడకపోయినా సరే, వారి బ్రౌజర్లో బలవంతంగా ట్రాకింగ్ కుకీలను చొప్పించడాన్ని ‘కుకీ స్టఫింగ్’ అంటారు. దీనివల్ల ఆ తర్వాత యూజర్ ఏదైనా కొనుగోలు చేస్తే, ఆ అమ్మకానికి తామే కారణమని చెప్పి ఆన్లైన్ రిటైలర్ల నుంచి ఈ సంస్థ అక్రమంగా కమీషన్లు పొందుతుంది.బ్లూమ్బెర్గ్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. ఫియా స్టార్టప్లో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు సహ వ్యవస్థాపకులైన ఫోబీ గేట్స్, సోఫియా కియానీలకు కనీసం ఏడు నెలల ముందు నుంచే తెలుసని అంతర్గత సమాచారం సూచిస్తోంది. నైక్, గ్యాప్, నార్డ్స్ట్రామ్ వంటి ప్రముఖ రిటైలర్ల అమ్మకాలను ఈ విధానం ప్రభావితం చేసిందని, కంపెనీ చూపిన మొత్తం ఆదాయంలో అధిక భాగం దీని ద్వారానే వచ్చిందని ఆ నివేదిక పేర్కొంది.ఈ ఆరోపణలు బయటకు రావడంతో జులై 7న ఈ ఫీచర్ను నిలిపివేసినట్లు