
Future City | బ్రదర్స్ కోసమే రేవంత్ ఫ్యూచర్ సిటీ.. అనుముల సోదరులకు అప్పనంగా దోచిపెడ్తున్న సర్కార్
Future City | బ్రదర్స్ కోసమే రేవంత్ ఫ్యూచర్ సిటీ.. అనుముల సోదరులకు అప్పనంగా దోచిపెడ్తున్న సర్కార్

Future City | బ్రదర్స్ కోసమే రేవంత్ ఫ్యూచర్ సిటీ.. అనుముల సోదరులకు అప్పనంగా దోచిపెడ్తున్న సర్కార్

రాజధాని హైదరాబాద్ను భారతదేశంలోనే అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల యూకే, అమెరికా పర్యటనల్లో సాధించిన పురోగతిపై ఉన్నతస్థాయి కమిటీ సోమవారం సీఎంకు నివేదిక సమర్పించింది. ఈ పర్యటనల ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో కీలక ఒప్పందాలు కుదిరినట్లు కమిటీ వెల్లడించింది.అమెరికాకు చెందిన నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లండన్ భారత్లో తమ తొలి ఆఫ్షోర్ క్యాంపస్లను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. ముఖ్యంగా, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ తన క్యాంపస్ను ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రభుత్వ, కార్పొరేట్ అధికారుల కోసం ఎంసీఆర్హెచ్ఆర్డీలో స్వల్పకాలిక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను ప్రారంభించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ కూడా అంగీకరించింది. ఈ కోర్సులు వచ్చే నవంబర్ నుంచే ప్రారంభం కానున్నాయి.సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆగస్టు 19 నుంచి 29 వరకు యూకే, యూఎస్లలో పర్యటించి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ వంటి దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపింది. ఈ చర్చల ఫలితంగా, ఆయా సంస్థల ప్రతినిధుల బృందాలు త్వరలోనే హైదరాబాద్లో పర్యటించి ఇక్కడి వసతులను పరిశీలించనున్నాయి. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్ను అంతర్జాతీయ విద్యా, నైపుణ్య కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, బందరు పోర్టులను అనుసంధానించేలా రెండు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమాంతరంగా పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్వే లైన్, ఫ్యూచర్ సిటీ-బందరు పోర్టు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలను పక్కపక్కనే నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా అంగీకరించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్-విజయవాడ ప్రస్తుత జాతీయ రహదారికి ఎడమవైపు ఎక్స్ప్రెస్వే, కుడివైపు హైస్పీడ్ రైలు మార్గం ఉండేలా అలైన్మెంట్ ఖరారు చేశారు.760 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గంహైదరాబాద్-అమరావతి-చెన్నై మధ్య ప్రతిపాదించిన ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ మొత్తం పొడవు 760 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణ పరిధిలో 180 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. ఈ మార్గంలో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్ (హాలియా), వాడపల్లి వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2.24 లక్షల కోట్లు కాగా, దాదాపు 790 హెక్టార్ల భూమి అవసరమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఈ మార్గంలో మార్కింగ్ పనులు పూర్తయ్యాయి.298 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేహైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్యలో ఉన్న ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ సమీపంలోని తిప్పారెడ్డిపల్లి వద్ద ఈ 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే ప్రారంభం కానుంది. ఇది అమరావతి మీదుగా మచిలీపట్నం-బందరు పోర్టుకు అనుసంధానమవుతుంది. మొత్తం 297.82 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో 118 కిలోమీటర్లు (40 గ్రామాల మీదుగా), ఏపీలో మిగిలిన భాగం (60

రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకూ ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వే లైన్.. ఫ్యూచర్సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు.. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, హైస్పీడ్ రైల్వే లైన్ ప్రాథమిక అలైన్మెంట్లపై స్పష్టత రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్న హైస్పీడ్ ట్రైన్ శంషాబాద్, ఫ్యూచర్సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్, వాడపల్లి వద్ద స్టేషన్లు రాష్ట్ర పరిధిలో 2 జిల్లాలు 40 గ్రామాల మీదుగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పొడవు 297 కిలోమీటర్లు.. అందులో 118 కిలోమీటర్లు తెలంగాణలో హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకూ ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వే లైన్.. ఫ్యూచర్సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు పక్కపక్కనే వెళ్లనున్నాయి. ఈ రెండింటిలో రోడ్డు ఎడమవైపు.. రైలు మార్గం కుడివైపు ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎడమవైపు అంటే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న ప్రస్తుత రహదారికి ఎడమవైపు.. ఫ్యూచర్సిటీ-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. కుడివైపు రైలు మార్గం ఉండనుంది. వీటికి సంబంధించిన అలైన్మెంట్ల విషయంలోనూ ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. హైదరాబాద్-అమరావతి- చెన్నై కారిడార్లో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్ (హాలియా), వాడపల్లి దగ్గర స్టేషన్లు రానున్నాయి. ఈ లైన్ శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ రావిర్యాల ఎగ్జిట్ దగ్గర నిర్మించనున్న 21 కిలోమీటర్ల కొత్త రేడియల్ రోడ్డుకు దగ్గర్లో ప్రారంభమయ్యే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వద్ద కలుస్తుంది. ఈ రైల్వే లైన్ పొడవు మొత్తం 760 కిలోమీటర్లు కాగా.. రాష్ట్రపరిధిలో 180 కిలోమీటర్లు ఉండనుంది. దీనికి సంబంధించి ఆ మార్గంలో పలుచోట్ల మార్కింగ్లు కూడా

రతన్టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్లకు కూడా.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్రం ప్రభుత్వం నిర్మాణ అనుమతులకు 50శాతం టీడీఆర్ ఇచ్చినా చాలు.. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఊతమిచ్చిన ప్రభుత్వం హైదరాబాద్ సిటీ: ట్రాన్స్ఫరబుల్ డెవల్పమెంట్ రైట్స్ (టీడీఆర్)పై చిక్కుముడులు వీడాయి. హెచ్ఎండీఏ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు టీడీఆర్ తీసుకోవడంపై భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. హెచ్ఎండీఏ చేపట్టే ప్రాజెక్టులన్నింటికీ టీడీఆర్లను జారీ చేసే అధికారం ఆ సంస్థకే కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నగరంలో చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ ప్రక్రియలో టీడీఆర్లను ఎవరు జారీ చేయాలనే దానిపై ఇప్పటివరకు సందిగ్ధత నెలకొని ఉండేది. ఏ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ/ఎంఎంసీ)పరిధిలో భూ సేకరణ చేస్తే సంబంధిత కార్పొరేషనే ఇప్పటివరకు టీడీఆర్ జారీ చేసేది. అయితే, రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న రతన్టాటా రేడియల్ రోడ్డుకు పరిహారంగా టీడీఆర్ కావాల్సినవారు ఎంఎంసీని సంప్రదించాలా? హెచ్ఎండీఏను సంప్రదించాలా? లేదా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)ని సంప్రదించాలా అనే సందేహం ఉండేది. ఈ నేపథ్యంలో వీటన్నింటికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ ప్రాజెక్టులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్పమెంట్ అథారిటీనే (హెచ్ఎండీఏ) టీడీఆర్ జారీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ టీడీఆర్లను హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో హెచ్ఎండీఏ పరిధిలో భూసేకరణ, అభివృద్ధి పనులకు ఇక మరింత ఊతం లభించనుంది. బిల్డ్నౌలోనే సింగిల్ బ్యాంకు టీడీఆర్ పొందిన నిర్వాసితులు క్రయ, విక్రయాలు చేసుకోవడానికి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు ప్రత్యేకంగా వెబ్సైట్లోనే టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేశాయి. అయితే, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఎంఎంసీ, సీఎంసీలు, పెరీ అర్బన్ రీజియన్ పరిధిలో ఎఫ్సీడీఏలు వచ్చాయి. దీంతో రాష్ట్రం మొత్తానికి ఒకే టీడీఆర్ బ్యాంకును బిల్డ్ నౌలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక టీడీఆర్ను పలు నిర్మాణ అనుమతులకు వినియోగిస్తూ తప్పదోవ

హైదరాబాద్ శివార్లలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు రాజకీయ వివాదం ముసురుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల పరిధిలో ‘టెసెరాక్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ అనే డిఫెన్స్ స్టార్టప్ కంపెనీకి 5 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పరాకాష్టకు చేరింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ భూకేటాయింపుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.200 కోట్ల విలువ చేసే 5 ఎకరాల అత్యంత విలువైన భూమిని ప్రభుత్వం కేవలం రూ.7 కోట్లకే టెసెరాక్ కంపెనీకి కట్టబెట్టిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఈ కంపెనీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అందుకు సంబంధించిన లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, అంతర్జాతీయ సంస్థలు, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులతో జరిగిన సమావేశాల వివరాలను ఆధారాలుగా చూపించారు. కేవలం లక్ష రూపాయల మూలధనం ఉన్న కంపెనీకి వందల కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై గవర్నర్, లోకాయుక్తను ఆశ్రయించనున్నట్లు తెలపారు. అంతేకాక, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే కేటీఆర్ ఆరోపణలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ కేటాయింపుల్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఆయన స్పష్టం చేశారు. టెసెరాక్ కంపెనీకి ముఖ్యమంత్రి సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సలహా కమిటీ నిబంధనల ప్రకారం, పూర్తిగా పారదర్శకంగానే భూకేటాయింపు ప్రక్రియ ముగిసిందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బిఆర్ఎస్, బీజేపీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. దీనిపై వివాదం ముదరడంతో టెసెరాక్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సైతం స్పందించింది. తెలంగాణ పారిశ్రామిక