
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

భారతదేశంలో స్టార్టప్లు, చిన్న వ్యాపారాలకు చేయూతనివ్వడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. ఆలోచన దశ నుంచి ప్రోటోటైప్ తయారీ, వెంచర్ క్యాపిటల్, రుణాల సమీకరణ వరకు వివిధ దశల్లో ఈ పథకాలు అండగా నిలుస్తున్నాయి. అయితే, ప్రతి పథకం అందించే సహాయం, దాని స్వరూపం వేర్వేరుగా ఉంటాయి. అన్ని పథకాలు నేరుగా వ్యవస్థాపకుల చేతికి డబ్బును అందించవన్న విషయాన్ని గమనించాలి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అనేక గణాంకాలు పాతవి లేదా తప్పు అని అధికారిక సమాచారం స్పష్టం చేస్తోంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన పథకాలలో నిధి-ప్రయాస్, సమృద్ధి, టైడ్ 2.0, స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ (CGSS), క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (CGTMSE) ఉన్నాయి. ఈ పథకాలపై పూర్తి అవగాహనతో ముందడుగు వేయడం వ్యవస్థాపకులకు ఎంతో అవసరం.ప్రోటోటైప్, ప్రారంభ దశ కోసం పథకాలునిధి-ప్రయాస్ 2.0: సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద పనిచేసే ఈ పథకం, వినూత్న ఆలోచనలను ప్రోటోటైప్లుగా మార్చడానికి సహాయపడుతుంది. నిధి-ప్రయాస్ 2.0 కింద, టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలకు ఒక్కో స్టార్టప్కు గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు ప్రోటోటైప్ ఫండింగ్ లభిస్తుంది. డీప్టెక్ వంటి అధునాతన ప్రోటోటైప్ల కోసం 'అడ్వాన్స్ ప్రయాస్ సెంటర్లు' రూ. 40 లక్షల వరకు సాయం అందిస్తాయి. గతంలో ఈ పథకం కింద గరిష్ఠ పరిమితి రూ. 10 లక్షలు మాత్రమే. ఇది మహిళల

స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని ముద్రించాలన్న డిమాండ్పై తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సన్న బియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు సమకూరిస్తేనే, కార్డులపై ప్రధాని ఫొటోను ముద్రించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు. పేదల ఆకలి తీర్చే ఈ పథకం విషయంలో అనవసర వివాదాలు సృష్టించవద్దని ఆయన హితవు పలికారు.సూర్యాపేటలో నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రేషన్ బియ్యం పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేసేందుకు రూ. 14.9 కోట్లు ఖర్చు చేస్తోందని, అయితే కేంద్రం నుంచి కేవలం దొడ్డు బియ్యం మాత్రమే సరఫరా అవుతున్నాయని ఆయన తెలిపారు. కొందరు తగినంత ఆర్థిక సహకారం అందించకుండానే రేషన్ బియ్యం పంపిణీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం పట్ల ఉన్న గౌరవంతో, ప్రొటోకాల్కు అనుగుణంగా ఇప్పటికే రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటోను ప్రదర్శిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చిత్రాలను కార్డులపై ముద్రించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు
MP High Court SMA Treatment Aid : అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల పసిపాప ప్రాణాలను కాపాడేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు కీలకమైన చొరవ చూపింది. 'స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎమ్ఏ) టైప్-2' అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్న ఇండోర్కు చెందిన అనికా శర్మ వైద్య చికిత్స కోసం.. రూ. 1 కోటి మేర అదనపు ఆర్థిక సాయం అందించే మార్గాలను అన్వేషించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఈ కేసును మినహాయింపుగా పరిగణించి అవసరమైన మొత్తాన్ని త్వరగా సమకూర్చాలని న్యాయస్థానం భావించింది.రూ.9.55 కోట్ల ఇంజెక్షన్.. భారీగానే అందిన నిధులు, అయినా?ఇండోర్కు చెందిన అనికా శర్మ అనే మూడేళ్ల చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎమ్ఏ) టైప్-2 వ్యాధితో బాధ పడుతోంది. ఎన్నో ఆస్పత్రులు తిరిగాక గానీ ఈ వ్యాధి బయటపడలేదు. అయితే అప్పటికే ఆస్తులు అన్నీ అమ్ముకుని చికిత్స చేయించిన తల్లిదండ్రులకు.. పాపకు రూ.9.55 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇస్తేనే వ్యాధి తగ్గుతుందని చెప్పారు. దీంతో పాప సహా ఆమె తల్లిదండ్రులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం కింద గరిష్టంగా రూ. 50 లక్షల వరకు చిన్నారికి ఆర్థిక సాయం లభిస్తుండగా.. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు చేపట్టిన ప్రచార కార్యక్రమాల ద్వారా దాదాపు రూ. 8 కోట్ల నిధులు సేకరించారు.ఇంకా కోటి రూపాయాలు కావాల్సి రావడంతో..!వీటితో పాటు ఇంకో కోటి రూపాయలు కావాల్సి ఉండగా.. కోర్టును ఆశ్రయించారు పాప తల్లిదండ్రులు. ఈక్రమంలోనే విచారణ జరిపిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్కు చెందిన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ ఎన్ భట్.. కేంద్ర ప్రభుత్వ సాయం రూ. 50 లక్షలతో పాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన రూ. 8 కోట్లను కలిపినా.. ఇంజెక్షన్ కొనుగోలుకు ఇంకా రూ. 1 కోటి మేర కొరత

వివాదాస్పద విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేందుకు కొద్ది రోజులే సమయం ఉండడంతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయిన అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో చర్చలు జరిపారు. ప్రతిపక్ష నేతలతో వరుస భేటీలు జరగడంతో ఈ బిల్లుపై కేంద్రం వెనక్కి తగ్గుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును మార్చి 25న లోక్సభలో ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకు సభలో చర్చకు రాలేదు. ప్రతిపక్షాలు మరియు అనేక సివిల్ సొసైటీ వర్గాలు ఈ బిల్లును మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్వహించిన సమావేశంలో కూడా ఈ వివాదాస్పద బిల్లు ప్రస్తావన రాకపోవడం విశేషం. ఆగస్టు 13తో వర్షాకాల సమావేశాలు ముగుస్తున్నందున ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లును ఆమోదింపజేసుకోవడం కేంద్రానికి కష్టంగా మారింది. ఈ నూతన సవరణ చట్టం ప్రకారం విదేశీ విరాళాల రద్దు లేదా పునరుద్ధరణ జరగని సంస్థల ఆస్తులను ప్రత్యేక నియంత్రణ పరిధిలోకి తెస్తారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేసే డిజిగ్నేటెడ్ అథారిటీకి ఆయా సంస్థల నిధులు మరియు ఆస్తులను నిర్వహించే పూర్తి అధికారాలు లభిస్తాయి. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టడం మరియు పారదర్శకత పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ చట్టం పూర్వకాలానికి వర్తించదని హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చారు. పాఠశాలలు మరియు ఆసుపత్రులు వంటి దాతృత్వ సంస్థల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం పెరుగుతుందని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా మిజోరం మరియు నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని క్రైస్తవ సంస్థలు ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. డీఎంకే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. అమరావతి, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర రంగాల్లో పీపీపీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టుల పైప్లైన్ ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్ల స్టేట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)ను ప్రభుత్వం కేటాయించింది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక మూలధన అవసరాలను VGF ద్వారా సర్కార్ భర్తీ చేయనుంది. ప్రాజెక్టుల ప్లానింగ్, అప్రైజల్, ప్రొక్యూర్మెంట్, అమలు, పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకంగా లేని, భవిష్యత్తులో ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులకు ప్రాజెక్ట్ వయబిలిటీ బ్రిడ్జి ఫండ్ ద్వారా వడ్డీలేని రుణాన్ని అందించే విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రైవేట్ రంగ పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను వినియోగించుకోవడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. నాణ్యమైన ప్రజా సేవలను అందించడంతో పాటు పెట్టుబడిదారులకు అనుకూలమైన మౌలిక వసతుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పీపీపీ విధానాలను పరిశీలించడంతో పాటు, సంబంధిత స్టేక్హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు పీపీపీ పాలసీ-2026ను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. తాడిపత్రిలో హైటెన్షన్ లండన్లో మంత్రి నారాయణ

ప్రపంచీకరణ పెరిగిన ఈ రోజుల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి సమాచారం, సాంకేతికత, ఆస్తులతో పాటు ఆర్థిక వనరులు సులభంగా మారుతున్నాయి. విద్య, వైద్యం, విపత్తు సహాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు (NGOలు) విదేశీ విరాళాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. భారత్లో కూడా అనేక సంస్థలు ఈ విదేశీ నిధులతో సామాజిక అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. అయితే, విదేశాల నుంచి వచ్చే డబ్బు ఏ పనులకు ఖర్చు అవుతోంది? దానివల్ల దేశ భద్రతకు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఏమైనా ప్రమాదం ఉందా? అని చూడటం ప్రభుత్వాల బాధ్యత. అందుకే ఈ విదేశీ నిధులను క్రమబద్ధీకరించడానికి మన దేశంలో 'ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్' (FCRA) అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ' ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు 2026' ప్రవేశపెట్టడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ, రగడ జరుగుతోంది. ఎఫ్సీఆర్ఏ అనేది భారత్లోని వ్యక్తులు, సంస్థలు, ఎన్జీవోలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు లేదా నిధులు స్వీకరించడాన్ని నియంత్రించే ఒక కేంద్ర చట్టం. దీనిని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ చట్టం ఎవరెవరు విదేశీ నిధులు తీసుకోవచ్చు, ఏ నిబంధనలు పాటించాలి, ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలో స్పష్టంగా చెబుతుంది. • పారదర్శకత: విదేశీ విరాళాలు పొందే ప్రతి సంస్థ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. నిర్దేశిత బ్యాంకు ఖాతా ద్వారానే డబ్బులు తీసుకోవాలి. • జవాబుదారీతనం: ప్రతి ఏటా వార్షిక ఆడిట్ రిపోర్టులను ఆన్లైన్లో సమర్పించాలి. ఎంత డబ్బు వచ్చింది, ఎవరు ఇచ్చారు, దేనికి ఖర్చు చేశారో పూర్తి వివరాలు వెల్లడించాలి. • సార్వభౌమాధికార రక్షణ: దేశ భద్రతకు, ప్రజాస్వామ్య ప్రక్రియలకు భంగం కలిగించేలా విదేశీ నిధులు వాడకుండా నిరోధించడం. • పరిమితులు: రాజకీయనాయకులు, ఎన్నికల అభ్యర్థులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, పత్రికా సంపాదకులు విదేశీ నిధులు తీసుకోకూడదు. ఎఫ్సీఆర్ఏ చట్టం

హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘రంజాన్ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు ఇచ్చింది. రంజాన్కు 33 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తా: సంజయ్ హైదరాబాద్/సైదాబాద్/చాంద్రాయణగుట్ట, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘రంజాన్ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు ఇచ్చింది. వారికి ఎందుకిచ్చారని నేను అడగడం లేదు. కానీ 80 శాతం ఉన్న హిందువుల పండుగకు కేవలం రూ.20 కోట్లు విదిలిస్తారా? హైదరాబాద్లో 3,400 ఆలయాలుంటే ఈ నిధులు ఏం సరిపోతాయ’ని మండిపడ్డారు. బోనాల ఉత్సవాలకు ఆలయాల్లో కనీస సౌకర్యాలు సమకూర్చలేదని, అభివృద్ధి గురించి తాము మాట్లాడితే మతం రంగు పులుముతారా అని ప్రశ్నించారు. జెన్ జీల తీరు చూస్తుంటే ముచ్చటేస్తోందని, హిందూ సమాజం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జెన్ జీలు ఆకాశంలోకి రాకెట్లను పంపడమే కాదు, హిందూ సనాతన ధర్మం కోసం కూడా మాట్లాడుతున్నారన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం సంజయ్.. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి, భాగ్యలక్ష్మి, ఉప్పుగూడ మహంకాళి, సైదాబాద్ కుర్మగూడలోని నల్లపోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష మంది భక్తులు సందర్శించుకునే లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో బోనాల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.5.50 లక్షలు మంజూరు చేయడం దారుణమని విమర్శించారు. ఒవైసీ బాధ పడతారనే ఈ ఆలయానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. హిందూ ధర్మమంటే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు భయం పట్టుకుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని మోసపూరిత చరిత్ర కాంగ్రెస్ది అని ధ్వజమెత్తారు. ‘నేను గత జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే హేళన చేసిన కేటీఆర్ ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నారు. కేటీఆర్లాంటి మూర్ఖుడికి కూడా జ్ఞానోదయం

భారత ప్రధాన నరేంద్ర మోదీ శనివారం రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఫోన్లో మాట్లాడారు. తనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సంభాషణ సందర్భంగా భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు చేపట్టాల్సిన కీలక చర్యలపై వారు చర్చించారు. దీనితో పాటు జేడీ వాన్స్-సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించిన సందర్భంగా ప్రధాని మోదీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.రాజ్యతంత్రంలో రాచఠీవి.. మన నెమళ్లు ఇక ఐక్యరాజ్యసమితిలో విదేశీ నిధుల చట్టం వివాదం నేపథ్యం భారత్లోని ఎన్జీఓలు, ట్రస్టులు, విద్యాసంస్థలు, మతపరమైన సంస్థలకు అందే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) ప్రతిపాదిత సవరణలపై ఆమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిలే మూర్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చట్ట సవరణలు మత సంస్థలపై ప్రభావం చూపిస్తాయని రిలే మూర్ కామెంట్ చేయగా.. చట్టసభల వ్యవహారాలు భారత అంతర్గత అంశాలని, అమెరికా సహా పలు దేశాల్లో విదేశీ నిధులను నియంత్రించే చట్టాలు అమల్లో ఉన్నాయని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్షణాన్ని ఆస్వాదించండి! యువతకు మోదీ బిగ్ మెసేజ్..గతంలో ఫోన్ సంభాషణను గుర్తుచేసుకున్న నేతలు మే 2025లో పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో జేడీ వాన్స్, ప్రధాని మోదీ మధ్య జరిగిన చివరి ఫోన్ సంభాషణను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో భారత్పై పాకిస్తాన్ భారీ దాడికి ప్లాన్ చేస్తోందని జేడీ వాన్స్ హెచ్చరించగా.. మా స్పందన అంతకంటే మరింత బలంగా, తీవ్రంగా ఉంటుంది అని తానిచ్చిన సమాధానాన్ని ప్రధాని మోదీ గతంలో లోక్సభ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే