
ఫ్రెండ్లీ పోలీసింగే లక్ష్యం ఆమదాలవలసలో 'పల్లె నిద్ర
Amadalavalasa: ఫ్రెండ్లీ పోలీసింగే లక్ష్యం ఆమదాలవలసలో 'పల్లె నిద్ర'! Amadalavalasa: శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆమదాలవలస నియోజకవర్గం బొబ్బిలి పేట గ్రామంలో డిఎస్పి వివేకానంద పల్లె నిద్ర' కార్యక్రమం చేపట్టారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె నిద్ర కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని కలిగిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల సహకారంతో పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయడమే పల్లె నిద్ర ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు పెద్ద నేరాలుగాను, శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశముందని, ఇలాంటి అంశాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీసు స్టేషన్లుకు వెళ్ళకుండానే వారి సమస్యలను నేరుగా పోలీసు అధికారులకు తెలిపేందుకు 'పల్లెనిద్ర' ఒక వేదికగా నిలుస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విషయాలను, గ్రామంలో వివిధ రాజకీయ పార్టీల మధ్యగల విభేదాలను, భూతగాదాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు, ప్రజలకు రక్షణగా నిలిచే చట్టాలు, సైబరు మోసాలు, మహిళలు, రహదారి భద్రతపట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వారు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టినట్లు ఆమదాలవలస సీఐ సన్యాసి నాయుడు నాయుడు అన్నారు. సోమవారం రాత్రి చీమలవలస గ్రామంలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పల్లెనిద్ర' కార్యక్రమం అనేది ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో అధికారులు చేపడుతున్న ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు గ్రామాలలో పర్యటించి, గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే గ్రామాల్లో రాత్రి బస చేసిన సీఐ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితి, అసాంఘిక కార్యకలాపాలు, మద్యం, గంజాయి తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రజలు ఎలాంటి సమస్యలు