మహిళలకు రూ.5కే ఆటో ప్రయాణం| Tirupati Auto Driver Ajith ₹5 Ride For Women| Vijay Fan
మహిళలకు రూ.5కే ఆటో ప్రయాణం| Tirupati Auto Driver Ajith ₹5 Ride For Women| Vijay Fan
మహిళలకు రూ.5కే ఆటో ప్రయాణం| Tirupati Auto Driver Ajith ₹5 Ride For Women| Vijay Fan

కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిగురుమామిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హుస్నాబాద్ నుంచి 54 మంది ప్రయాణికులతో కరీంనగర్కు బయలుదేరింది. ఈ క్రమంలో చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించేందుకు డ్రైవర్ హరీశ్ ప్రయత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. అయితే, బస్సు తక్కువ వేగంతో ఉండడం, డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బావి అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. భట్టి భార్య వసూళ్లు.. పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా? ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం

కదులుతున్న బస్సులో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడిన కండక్టర్, డ్రైవర్ తల్లి చీవాట్లతో అలిగి బంధువుల ఇంటికి బయల్దేరిన యూపీకి చెందిన విద్యార్థిని గమ్యస్థానానికి ముందే బస్సు దిగిన బాలిక మాయమాటలు నమ్మి మరో బస్సులోకి.. దాంట్లోనే దారుణం.. నిందితుల అరెస్టు ఆగస్టు 4న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి ఢిల్లీలో నర్సరీ చదివే చిన్నారిపై పాఠశాల బస్సు డ్రైవర్ లైంగికదాడి న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ రాజధాని ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ బాలికపై ఇద్దరు దుండగులు నడుస్తున్న బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 4వ తేదీన జరిగినప్పటికీ.. వివరాలు సోమవారం వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. తల్లి తిట్టిందన్న కోపంతో ఇల్లు వదిలి, ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63లో ఉండే తమ బంధువుల ఇంటికి బస్సులో బయల్దేరింది. చీకటి, దానికితోడు వర్షం కురుస్తుండటంతో ఆ బాలిక తాను దిగాల్సిన ప్రాంతాన్ని గుర్తించలేక, రాత్రి 9 గంటల సమయంలో సెక్టార్ 63 చేరుకోకముందే బస్సు నుంచి దిగేసింది. అక్కడి నుంచి వాళ్ల బంధువుల ఇల్లు మరో 25 కి.మీ.ల దూరం ఉండటంతో.. ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. ఇంతలో ఓ స్లీపర్ బస్సు వచ్చి ఆమె ముందు ఆగింది. దాంట్లో ఉన్న కండక్టర్ తాము నోయిడా సెక్టార్ 63 వైపే వెళ్తున్నామని చెప్పటంతో, ఆ బాలిక బస్సు ఎక్కింది. బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. బస్సు బయల్దేరిన కొంతసేపటికి, కండక్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి జరిపాడు. ఆ తర్వాత డ్రైవర్ కూడా దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా బస్సు కదులుతుండగానే జరిగింది. స్లీపర్ బస్సు కావటంతో కిటికీలకు ఉన్న తెరల వల్ల.. లోపల జరుగుతున్న అఘాయిత్యం గురించి బయట ఎవరికీ కనిపించలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ఓల్డ్

బెంగళూరు: ఓ ఆటో డ్రైవర్ తన భార్య చనిపోయి ఎనిమిదేళ్లు గడిచినా ఆమెను తలచుకుంటూ ఓ ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. తన ఆటోను పూలతో అలంకరించి, భార్య ఫొటోను తన పక్కన ఉంచుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ యూజర్ సూరజ్ ఎస్ కురుప్ ఈ భావోద్వేగ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వృద్ధుడైన ఆటో డ్రైవర్ను చూసిన ఆయన, ఆటో ముందు భాగంలో చక్కగా అమర్చిన పూలను గమనించారు. వీడియోలో సూరజ్ తన కెమెరాను డ్రైవర్ వైపు తిప్పి, ఆ పూలు ఎవరి కోసం? అని అడిగారు. డ్రైవర్ నవ్వుతూ తన భార్య ఫొటో వైపు చూపించాడు. ఆమె ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయిందని వివరించాడు. తనకు ఓ కుమారుడు, కుమార్తె, ఆరుగురు మనవళ్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఇంట్లో ఉండకుండా ఇప్పటికీ ఆటో ఎందుకు నడుపుతున్నారని సూరజ్ అడిగారు. ఇంట్లో కూర్చుంటే ఆలోచనల ప్రవాహం ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ వివరించాడు. అందుకే ప్రతిరోజూ ఆటో నడుపుతూ, దారిలో ఎదురయ్యే వారితో మాట్లాడుతూ తనను తాను పనిలో నిమగ్నం చేసుకుంటున్నానని చెప్పాడు. పూలు, తన భార్య ఫొటో ఆయన రోజువారీ జీవితంలో భాగంగానే కొనసాగుతున్నాయి. వాటి ద్వారా ఆమె ఉనికిని తనకు దగ్గరగా ఉంచుకుంటున్నాడు. ఈ సాధారణ సంభాషణ వీడియోను చూసిన వారిని భావోద్వేగానికి గురిచేసింది. భార్య చనిపోయి అన్నేళ్లు గడిచినా ఆమె కోసం పూలు కొని, వాటిని అలంకరిస్తున్న దానిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదీ చదవండి: 120 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా బతికాడు.. కొంతమంది దీనిని ఎన్నటికీ చెక్కుచెదరని ప్రేమకు అందమైన ప్రతీకగా అభివర్ణించారు. మరికొందరు, మరణం తర్వాత కూడా ఇంతే బలంగా నిలిచే ప్రేమ తమ జీవితంలో కూడా ఉండాలని కోరుకునేలా ఈ కథ ఉందని పేర్కొన్నారు. తనకు సమీపంలోనే ఆ డ్రైవర్ నివసిస్తున్నారని ఓ యూజర్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం ఇదే విధంగా ఆయన తన ఆటోను శుభ్రం

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Autos Bandh: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో మరో వర్గం కూడా భారీ ఆందోళనకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. తమ జీవనాధారంపై పొట్టకొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుండడంతో ఆటో కార్మికులకు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగనున్నారు. గతంలో పలమార్లు హెచ్చరించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈసారి సమ్మె చేపట్టనున్నారు. దీంతో రేపు అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ కానున్నాయి. హైదరాబాద్తో సహా అన్ని జిల్లాల్లో ఆటోలు నిలిచిపోనున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్లో ఏడున్నర లక్షల ఆటోలు పాల్గొనున్నాయి. రోడ్డుపై ఒక్క ఆటో కూడా కనిపించదు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నేరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఆటో కార్మికులు ఈ బంద్ చేపడుతున్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు పైన స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీటర్ ఛార్జీలు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సహాయం అందించకపోవడంతో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆటో కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. వీరి ఆందోళనలకు స్కూల్ వాహనాల కార్మికులు కూడా తోడయ్యారు. ఆటో కార్మికులతోపాటు తాము బంద్లో పాల్గొంటామని స్కూల్ వ్యాన్ల యజమానులు ప్రకటించారు. ఈసీఐఎల్లో ర్యాలీ తెలంగాణలో ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి నిర్వహించనున్న ఆటో, స్కూల్ వ్యాన్ల బంద్ సందర్భంగా బీఆర్టియూ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని ఈసీఐఎల్ కేబుల్ బ్రిడ్జి నుంచి మల్లాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ

'మా విలేజ్ షో' నుంచి పాప్యులర్ అయిన నటుడే అంజిమామ. తనదైన యాసతో చాలా సహజంగా నటించే అంజిమామ, ఆడియన్స్ కి చాలా త్వరగా కనెక్ట్ అవుతూ ఉంటాడు. అలాంటి అంజిమామ తాజాగా 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించాడు." కష్టపడటం నాకు మొదటి నుంచి అలవాటే. ప్లంబర్ గా .. ఎలక్ట్రీషియన్ గా .. ఆర్ ఎంపీ గా డాక్టర్ పనిచేశాను. ఆ తరువాత వాటర్ ప్లాంట్ పెట్టాను. అయినా ఎక్కడా నిలదొక్కుకోలేకపోయాను" అని అన్నారు. "ఆ తరువాత స్నేహితులతో కలిసి ఈజీమని కోసం ఒక స్కీమ్ లో పెట్టుబడి పెట్టాను. దాంతో 24 లక్షల నష్టం వచ్చింది. మంచి జీవితం కోసం .. త్వరగా ఎదగాలనే కోరికతో ఈజీమని దిశగా ఆలోచన చేయడం జరిగింది. కానీ అనుభవంతో చెబుతున్నాను. ఈజీమని దిశగా ఎవరూ వెళ్లకూడదు. ఆ దిశగా ఎవరినీ ఎంకరేజ్ చేయకూడదు. ఆ ఎఫెక్ట్ కారణంగా జీవితంలో నేను మరిన్ని కష్టాలు పడవలసి వచ్చింది" అని ఆయన చెప్పారు. " ఒక వైపున నటుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరో వైపున హైదరాబాద్ లో క్యాబ్ నడుపుతున్నాను. ఎందుకంటే నెల కాగానే ఇంటికి 50 వేలు పంపించవలసి ఉంటుంది. క్యాబ్ నడిపేటప్పుడు మాస్క్ పెట్టుకున్నా నన్ను కొంతమంది గుర్తుపడుతున్నారు. ఈ కష్టాలన్నీ ఎందుకు .. నా ఊరెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఒక ఎకరం పొలం .. నాలుగు బర్రెలు ఉంటే హాయిగా బ్రతకొచ్చని అనిపిస్తుంది" అంటూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు
బెంగళూరుకు చెందిన ఓ బీబీఏ రెండో సంవత్సరం విద్యార్థి 3 నెలల పాటు ర్యాపిడో కెప్టెన్గా పనిచేసి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు వైరల్గా మారింది. కాలేజీ సెలవుల్లో పార్ట్టైమ్గా ఈ ర్యాపిడో డ్రైవర్ పని ప్రారంభించిన అతడు.. గిగ్ ఎకానమీ, రైడ్ యాప్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తాయో స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేసినట్లు తెలిపాడు. మొదట ప్లాట్ఫామ్ పనితీరుపై పెద్దగా అవగాహన లేకపోయినా.. కొద్ది రోజుల్లోనే ఎక్కువ డిమాండ్ ఉండే ప్రాంతాలను గుర్తించి ఆదాయాన్ని పెంచుకున్నట్లు వివరించాడు.ఆ స్టూడెంట్ సాధారణంగా ఉదయం 8 గంటలకు పని ప్రారంభించి.. సాయంత్రం 4.30 గంటల వరకు రైడ్లు చేసేవాడిని అని పేర్కొన్నాడు. బాగా ఆర్డర్లు వచ్చిన రోజు పెట్రోల్ ఖర్చులు, ఇతర వ్యయాలు తొలగించిన తర్వాత సుమారు రూ.1,200 వరకు సంపాదించేవాడని చెప్పాడు. మధ్యాహ్నం సమయంలో రైడ్లు తగ్గినప్పుడు అదనపు ఆదాయం కోసం ఫుడ్ డెలివరీలు కూడా చేసేవాడిని అని తెలిపాడు.My 3-month experience doing Rapido as a side hustle in Bangalore — ₹1.2k/day, algorithm, restaurants & what I learnedఫుడ్ డెలివరీ సమయంలో కూడా తనకు ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయని అతడు చెప్పుకొచ్చాడు. కొన్ని రెస్టారెంట్లలో ఆర్డర్ వెంటనే రెడీ అయ్యేదని.. మరికొన్ని చోట్ల మాత్రం 20 నుంచి 25 నిమిషాల వరకు వేచి ఉండాల్సి వచ్చేదని వివరించాడు. మూడు నెలల పాటు బెంగళూరులోని మెజెస్టిక్, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా రైడ్లు చేశానని.. ఆటో డ్రైవర్లు తనను గమనించినప్పటికీ, ఎవరూ బెదిరించలేదని చెప్పాడు.ఇక తనకు వచ్చిన ఆదాయాన్ని చూపించేందుకు ర్యాపిడో ఎర్నింగ్స్ డ్యాష్బోర్డ్ స్క్రీన్షాట్లను కూడా ఆ విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మే నెలలో 96 ఆర్డర్లు పూర్తి చేసి రూ.5,650 సంపాదించగా.. జూన్లో ఆదాయం గణనీయంగా పెరిగి రూ.16,660కు చేరింది. జూలైలో 3 నెలల ప్రయాణాన్ని ముగించే

ఓ డ్రైవర్ యజమానితో గొడవ పడి జేసీబీతో పరారయ్యాడు. పోలీసులు జేసీబీతో పరారైన డ్రైవర్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సినిమా యాక్షన్ సీన్స్ను తలపించే సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: ఓ డ్రైవర్ యజమానితో గొడవ పడి జేసీబీతో పరారయ్యాడు. పోలీసులు జేసీబీతో పరారైన డ్రైవర్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సినిమా యాక్షన్ సీన్స్ను తలపించే సంఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు ఛేజింగ్ ఆపకపోవటంతో డ్రైవర్ జేసీబీని రోడ్డుపై వదిలి పారిపోయాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని ఖల్లికోటె పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి జేసీబీ డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆగస్టు 15వ తేదీన యజమానితో అతడికి గొడవైంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి జేసీబీతో అక్కడినుంచి పరారయ్యాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖల్లికోటె, రంభ, పురుషోత్తమ్పూర్, కబిసూర్యనగర్ ఏరియా పోలీసులు రంగంలోకి దిగారు. జేసీబీతో పరారవుతున్న డ్రైవర్ను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పురుషోత్తమ్పూర్లోని రోడ్డుకు అడ్డంగా బారికేడ్స్ పెట్టారు. డ్రైవర్ జేసీబీని ఆపకుండా ఆ బారికేడ్స్ను బద్ధలు కొట్టుకుని పోయాడు. దీంతో సినిమా సీన్ను తలపించే ఛేజింగ్ మొదలైంది. గుడియాల్ దగ్గర జేసీబీ డ్రైవర్ ఛేజింగ్కు ముగింపు పలికాడు. జేసీబీని రోడ్డుపై వదిలేసి అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు మొదలెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంగ్లండ్తో తొలి టెస్టు: బాబర్ ఆజమ్కు బిగ్ షాక్.. పాకిస్థాన్కు కొత్త కెప్టెన్ IRCTC అరుణాచల మోక్ష యాత్ర.. 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!

ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. విధుల్లో భాగంగా వర్క్షాప్లో ఉన్న MSRTC ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్.. బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.. ఇంటర్నెట్ డెస్క్: చిన్న క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ బస్స్టాండ్ సమీపంలోని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) వర్క్షాప్లో బస్సు చక్రం కింద పడి ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్ మృతి చెందారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగా చవాన్కు వర్క్షాప్ విధులు కేటాయించినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. చవాన్ ర్యాంప్ సమీపంలో తన పని ముగించుకుని తిరిగి వస్తుండగా, మరో డ్రైవర్ సికందర్ మనేర్ మరమ్మతుల కోసం బస్సును ముందుకు నడిపించాడు. బస్సు ర్యాంప్పై వెళ్తున్న సమయంలో చవాన్ దాని ముందు చక్రం కింద పడిపోయారు. బస్సు చక్రం ఆయనపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. తోటి ఉద్యోగులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును ఆపాడు. సమాచారం అందుకున్న షాహుపురి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్క్షాప్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ప్రమాదం మొత్తం రికార్డయింది. పోలీసులు ఫుటేజీని స్వాధీనం చేసుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సును చూసుకోకుండా సడన్గా కదిలించారని చవాన్ సహోద్యోగులు ఆరోపించారు. నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేల తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్ ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే

హైదరాబాద్లో కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు ఆటో రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ)గా మార్చేందుకు ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీ ఆటో కార్మికులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే కాకుండా, పెరిగిపోతున్న ఇంధన ధరల భారం నుంచి ఉపశమనం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నూతన విధానం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. దీనిద్వారా హైదరాబాద్ పరిధిలోని దాదాపు 18,766 ఆటో రిక్షాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు ఇది ఎంతో తోడ్పడనుంది. ఈ పథకం కింద పాత ఆటోలను ఈవీ రెట్రోఫిట్మెంట్ (మార్పిడి) చేసుకోవడానికి లేదా సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సాయం అందించనుంది. అర్హులైన ప్రతి ఆటో యజమానికి రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్లు రోజువారీ ఇంధనం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల వారి నికర ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది. ఈ నిర్ణయంతో ఆటోల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గి, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలు ఆటో డ్రైవర్ సంఘాలు సానుకూలంగా స్వాగతిస్తున్నాయి. ఈ రకమైన సబ్సిడీ పథకం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడమే కాకుండా, కాలుష్యంతో ఇబ్బందిపడుతున్న నగరవాసులకు స్వచ్ఛమైన గాలి లభించే అవకాశాలు మెరుగుపడతాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హత నిబంధనలు అమలు మార్గదర్శకాలను

క్రికెట్లో కొన్ని సంఘటనలు మ్యాచ్ ఫలితాన్ని మించి అభిమానుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. అలాంటి సంఘటనే 2010 ఆగస్టు 16న శ్రీలంకలోని దంబుల్లాలో జరిగిన భారత్-శ్రీలంక వన్డేలో చోటుచేసుకుంది. ఆ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ 99 పరుగులతో నాటౌట్గా నిలిచిపోయాడు. మ్యాచ్ గెలవడానికి భారత్కు ఒక్క పరుగు మాత్రమే అవసరం కాగా, శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సూరజ్ రందీవ్ వేసిన నోబాల్ కారణంగా సెహ్వాగ్ సెంచరీ మిస్ అయ్యింది. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 46.1 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భారత్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెహ్వాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 100 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 99 పరుగులకు చేరుకున్నాడు. భారత్ స్కోరు 170 వద్ద ఉండగా, జట్టు విజయానికి ఒక్క పరుగు మాత్రమే కావాల్సి వచ్చింది. మరోవైపు సెహ్వాగ్కు కూడా సెంచరీకి ఒక్క పరుగు అవసరం. అలాంటి సమయంలో సూరజ్ రందీవ్ బంతి వేయడానికి ముందే క్రీజ్ దాటి నోబాల్ వేశాడు. అంపైర్ నోబాల్ ప్రకటించడంతో భారత్కు అదనంగా ఒక పరుగు లభించింది. దీంతో మ్యాచ్ అక్కడే ముగిసిపోయింది. సెహ్వాగ్ ఆ బంతిని భారీ సిక్సర్గా కొట్టినా, నోబాల్తోనే భారత్ విజయ పరుగు పూర్తయినందున ఆ షాట్ స్కోరులో చేరలేదు. ఫలితంగా సెహ్వాగ్ 99 పరుగులతోనే నాటౌట్గా నిలిచిపోయాడు. ఈ సంఘటనపై వెంటనే తీవ్ర వివాదం చెలరేగింది. సెహ్వాగ్ మ్యాచ్ అనంతరం నోబాల్ కావాలనే వేసినట్లుగా భావిస్తున్నానని చెప్పాడు. స్పిన్నర్ అయినప్పకీ చాలా ముందుకు వచ్చి ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రందీవ్ సెహ్వాగ్కు క్షమాపణలు కూడా చెప్పాడు. శ్రీలంక క్రికెట్ అధికారులు కూడా ఈ ఘటనపై స్పందించారు. అప్పటి శ్రీలంక జట్టు సహచరుడు తిలకరత్నే దిల్షాన్ రందీవ్ను నోబాల్ వేయమని ప్రోత్సహించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదాన్ని శ్రీలంక క్రికెట్ తీవ్రంగా పరిగణించింది. సూరజ్ రందీవ్కు మ్యాచ్ ఫీజులో

హైదరాబాద్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను సినీ నిర్మాత బొమ్మకు మురళికి చెందిన కారు ఢీ కొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బుధవారం రాత్రి అబిడ్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పరుశురామ్ తెలిపిన మేరకు.. నాంపల్లి ఆండాలమ్మబాడ ప్రాంతానికి చెందిన సునీత గన్ఫౌండ్రీలోని ఎస్బీఐలో హౌస్ కీపింగ్గా పనిచేస్తోంది. బుధవారం రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా అబిడ్స్ చాపల్ రోడ్డు వద్ద ఎదురుగా రోడ్డుపై నిలిచి ఉన్న కారు ఒక్కసారిగా అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ మహానందను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ను చంపుకోండి: నిర్మాత మురళి బాధితురాలి వైద్యానికి అవసరమైన ఖర్చు భరించాలని స్థానికులు డ్రైవర్ను కోరారు. అయితే తాను కేవలం డ్రైవర్మాత్రమేనని.. యజమాని అయిన ప్రొడ్యూసర్ బొమ్మకు మురళితో మాట్లాడాలని సమాధానం చెప్పాడు. దీంతో వారు నిర్మాతతో మాట్లాడారు. అయితే అతను.. డ్రైవర్నే డబ్బులు అడగాలని, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు చెప్పకుండా కారు బయటకు తీసుకెళ్లాడని.. కావాలంటే మీరు చంపుకోండి.. పోలీస్ కేసు పెట్టుకోండి అని అన్నారు. తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని దురుసుగా మాట్లాడాడు. ఇదిలా ఉండగా నిర్మాత భార్యను షాపింగ్ కోసం తీసుకువచ్చి కారును రోడ్డుపైనే ఆపి నిద్రపోయాడు. ప్రొడ్యూసర్ భార్య డ్రైవర్కు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా నిద్రలేచి కారును స్టార్ట్ చేయగా మహిళను ఢీకొట్టినట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ పరశురామ్ తెలిపారు. హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు) ‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు) 'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు) కర్నూలులో వైఎస్ జగన్కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) సొల్లు కబుర్లు ఎందుకు...? దమ్ముంటే నిరూపించు మామయ్య..! బోండా ఉమాకు ఇచ్చిపడేసిన పేర్ని

సంచలనాలకు వేదికైన డిజిటల్ రవాణా రంగంలో ర్యాపిడో సంస్థ మరో భారీ మైలురాయిని అధిగమించింది. బెంగళూరు మహానగరంతో పాటు కర్ణాటక వ్యాప్తంగా క్యాబ్ సేవలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ నుంచి అధికారిక అనుమతి లభించింది. కర్ణాటక ఆన్-డిమాండ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్స్ రూల్స్ 2016 నిబంధనల ప్రకారం ఐదేళ్ల సుదీర్ఘ కాల పరిమితితో..ఆగస్టు 2031 వరకు ఈ లైసెన్స్ను మంజూరు చేశారు. కేవలం టాక్సీ క్యాబ్లకు మాత్రమే వర్తించే ఈ పక్కా చట్టబద్ధమైన పర్మిట్తో, ప్రయాణికులకు సురక్షితమైన, నమ్మకమైన సేవలు అందడమే కాకుండా క్యాబ్ డ్రైవర్ల భవిష్యత్తుకు పూర్తి భరోసా లభించింది.ర్యాపిడో పురిటిగడ్డ అయిన కర్ణాటకలో ఈ సంస్థ రవాణా వ్యవస్థను ఎంతలా శాసిస్తోందో గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలోని బెంగళూరు, మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి, బెలగావి, బళ్లారి, తుమకూరుతో సహా దాదాపు 21 ప్రధాన నగరాల్లో ఈ సంస్థ సేవలు విస్తరించి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏకంగా 3.14 లక్షల మందికి పైగా డ్రైవర్లు ఉపాధి పొందుతుండగా, 2.04 కోట్లకు పైగా వినియోగదారులు సేవలు పొందుతున్నారు. కేవలం క్యాబ్ సేవల కోసమే ఇప్పటివరకు 69 లక్షల మంది ప్రయాణికులు ఈ యాప్ను ఉపయోగించడం విశేషం Rapido Driver నిజాయితీ! 102 జ్వరం.. 8 గంటల లైవ్ లొకేషన్..అర్బన్ మొబిలిటీ మిషన్లో కీలక భాగస్వామి!ఈ చారిత్రాత్మక అనుమతితో పాటు, కర్ణాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అర్బన్ మొబిలిటీ మిషన్ లో కూడా ర్యాపిడో సంస్థను భాగస్వామిగా చేర్చారు. ఆధునిక సాంకేతికతను జోడించి, నగరాల్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా సులభమైన ప్రయాణాన్ని అందించే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నియమావళికి లోబడి పూర్తి భద్రతా ప్రమాణాలతో నడిచే ఈ క్యాబ్ సేవలు, ఐటీ సిటీలో ప్రతినిత్యం ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులకు, సామాన్యులకు గొప్ప ఊరటనివ్వనున్నాయిఏపీలో మరో కొత్త కార్యక్రమం.. డ్రైవర్లకు మంచి అవకాశండ్రైవర్లకు మెరుగైన

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantha Babu)కు మరోసారి చుక్కెదురైంది. డ్రైవర్ సుబ్రహ్మణం (Driver Subrahmanyam) హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇచ్చేందుకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో అనంతాబుతో పాటు ఏ2, ఏ3గా ఉన్న కడియాల సతీశ్ (Kadiyala Satish), మహాలక్ష్మి (Mahalakshmi)కి బెయిల్ను నిరాకరించింది. నిందుతులకు బెయిల్ ఇస్తే సాక్షుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) ముప్పాళ్ల సుబ్బారావు (Muppalla Subbarao) వాదించారు. పీపీ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే కోర్టు పలుమార్లు అనంతబాబుకు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే
మహిళా సాధికారత కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో ముఖ్మమైన ఆలోచన చేస్తోంది. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఏరియా ఆస్పత్రి వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో నూతన102 అంబులెన్సు సర్వీసులను (తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్) మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 300 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సత్యకుమార్ యాదవ్.. మరో రెండు నెలల్లో 200 కొత్త వాహనాల్ని సిద్దం చేస్తామని వెల్లడించారు. మహిళలకు ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు గానూ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మహిళలు అన్ని రంగాల్లో సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారని.. డ్రైవింగ్ కూడా వారికి సాధ్యమేనని మంత్రి వివరించారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల నిర్వహణ సంస్థ అయిన కన్సార్టియం ఆఫ్ విద్యా వేదా ఫౌండేషన్ అండ్ శ్రీనివాసా టూర్స్ అండ్ ట్రావెల్స్.. మహిళా డ్రైవర్ల నియామకానికి ప్రతిపాదన చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూలంగా ఉందని వివరించారు.మరోవైపు గర్భధారణ నుంచి ప్రసవం వరకు 102 వాహనాలు, అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనాలు, గ్రామస్థాయిలో పరీక్షలు, చికిత్సల కోసం 104 వాహనాల సేవలను అనుసంధానిస్తూ.. సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. వారివద్దకే సేవలు తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవలను ప్రసవం తర్వాత.. ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చడానికి మాత్రమే పరిమితం చేయకుండా.. గర్భధారణ దశ నుంచే సేవలు అందించేలా విస్తరిస్తున్నట్లు తెలిపారు. యాంటీనాటల్ చెకప్ల

మహిళలకు ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించడంలో భాగంగా 102 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించే దిశగా చర్యలు చేపడుతున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ సమర్థంగా పనిచేస్తున్నారని.. డ్రైవింగ్ కూడా వారికి సాధ్యమేనని చెప్పారు. 102 వాహనాల నిర్వహణ సంస్థ.. కన్సార్టియం ఆఫ్ విద్యా వేదా ఫౌండేషన్ అండ్ శ్రీనివాసా టూర్స్ అండ్ ట్రావెల్స్ మహిళా డ్రైవర్ల నియామకానికి ప్రతిపాదన చేసిందని.. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా ఉందన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట లోని ఏరియా ఆసుపత్రి వద్ద మంగళవారం 102 ఆధునిక అంబులెన్స్ ల సేవలను ప్రారంభించి, మంత్రి మాట్లాడారు.102.. 104.. 108.. ఒకే లక్ష్యంగర్భధారణ నుంచి ప్రసవం వరకు 102, అత్యవసర పరిస్థితుల్లో 108, గ్రామస్థాయిలో పరీక్షలు, చికిత్సలకు 104 సేవలను అనుసంధానిస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం తగ్గించి.. అవసరమైన సేవలను వీలైనంత వరకు వారి వద్దకే తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.తల్లీబిడ్డలకు మరింత భరోసా102 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను ప్రసవం అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చడానికే పరిమితం చేయకుండా గర్భధారణ దశ నుంచే విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. యాంటీనాటల్ చెకప్లకు వెళ్లే గర్భిణులు 102 సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులను ఆసుపత్రికి తరలించడంతోపాటు రక్తహీనతతో బాధపడే గర్భిణులకు అవసరమైన చికిత్స అందేలా సేవలను విస్తరిస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 500 కొత్త 102 వాహనాలు అందుబాటులోకి తెస్తున్నామని.. తొలి విడతలో 300, మరో రెండు నెలల్లో 200 వాహనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వాహనాల్లో ఏసీ, ఆరు ఎయిర్బ్యాగులు, ఫుట్రెస్ట్, జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర ఎస్వీఎస్ బటన్ వంటి సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నరసరావుపేటలో 50 వాహనాలు ప్రారంభించారు. దీనికి అనుగుణంగా ప్రతి జిల్లాల్లోనూ 300

హైదరాబాద్ నగరం అనగానే చారిత్రక కట్టడాలు, సందడి ప్రదేశాలు గుర్తుకొస్తాయి. అయితే, అదే చార్మినార్ ప్రాంతంలో రాత్రి వేళ ఒక విచిత్రమైన, కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి సరిగ్గా 9 గంటల సమయం.. కంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్న సిద్ధేశ్వరి సుగంధ్ (సిద్ధి) అనే యువతి చార్మినార్ పరిసర ప్రాంతంలో ఇంటికి వెళ్లడానికి ఆటో కోసం వెయిట్ చేస్తోంది. చలిగా ఉండటంతో కుర్తీ, షాల్ కప్పుకుని నిలబడి ఉన్న ఆమె దగ్గరకు ఓ వ్యక్తి స్కూటర్పై వచ్చి ఆగాడు. "మ్యామ్.. ఎక్కడికి వెళ్లాలి? రాపిడో కావాలా? డ్రాప్ చేయమంటారా?" అంటూ చాలా నమ్మకంగా మాట కలిపాడు. ఆ వ్యక్తి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడేసరికి సిద్ధేశ్వరి వెంటనే అప్రమత్తమైంది. అసలు తాను ఎలాంటి రాపిడో రైడ్ బుక్ చేసుకోకుండా ఇతను నేరుగా వచ్చి ఎలా అడుగుతున్నాడా అని సందేహించింది. వెంటనే ఆమె తన మొబైల్లో రికార్డింగ్ ఆన్ చేసి, అతడి వాహనాన్ని గమనించింది. విచిత్రమేమిటంటే ఆ స్కూటర్కు కనీసం వెహికల్ నంబర్ ప్లేట్ కూడా లేదు. "బండికి నంబర్ ఏది? నీ రాపిడో డ్రైవర్ ఐడీ కార్డు చూపించు" అని సిద్ధి గట్టిగా నిలదీసింది. దాంతో ఆ వ్యక్తి కంగారుపడుతూ నీళ్లు నమగడం మొదలుపెట్టాడు. ఐడీ కార్డు చూపించమంటే.. అప్పటికప్పుడు తన ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి రాపిడో యాప్ డౌన్లోడ్ చేయడం ప్రారంభించాడు. తన పేరు ఇర్ఫాన్ అని చెప్పిన ఆ వ్యక్తి, క్రెడెన్షియల్స్ చూపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, విచిత్రంగా "బండి స్టార్ట్ కావడం లేదు మేడమ్" అంటూ సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. అసలు స్టార్ట్ కూడా కాని బైక్ పెట్టుకుని, ఎలాంటి బుకింగ్ లేకుండా ప్యాసింజర్లను ఎక్కించుకోవడానికి ఎలా వస్తావని ఆమె తీవ్రంగా మండిపడింది. అతడి ఫోన్ స్క్రీన్ చూస్తే అప్పుడే ఓటీపీ అడిగే లాగిన్ పేజీ కనిపిస్తోంది. అతడు అసలు రాపిడో డ్రైవరే కాదు

తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిపో కమిటీ డిమాండ్ భద్రాచలం, ఆగస్టు 10 : భద్రాచలం డిపోలో టిఐఎం డ్రైవర్లకు రీజినల్ మేనేజర్ గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ భద్రాచలం డిపో కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం భద్రాచలం డిపో ఏఎంటీ విజయశ్రీ, ఆఫీస్ సూపరింటెండెంట్ విజయలక్ష్మికి టిఎంయు నాయకులు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం రీజినల్ కార్యదర్శి ఆర్.కృష్ణ మాట్లాడుతూ.. గత సంవత్సరం సెప్టెంబర్ 15, 17వ తేదీల్లో ఖమ్మం రీజినల్ మేనేజర్ కార్యాలయంలో విజిలెన్స్, రీజినల్ అధికారుల సమక్షంలో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలను 11 నెలలు గడిచినా అమలు చేయకపోవడంపై కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. మూడు మస్టర్లతో కూడిన డ్యూటీలను కేటాయించాలని, ఎవరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని కోరారు. డిపోలోని పలు అపరిష్కృత సమస్యలపై అధికారులకు మరొక వినతిపత్రం అందజేశారు. టిఐఎం డ్రైవర్లకు 2023 నాటి డ్యూటీ చార్ట్ను పునరుద్ధరించాలని, ఏడీసీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్, కండక్టర్ చార్ట్ కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు ఓటీ డ్యూటీలు, స్పెషల్ ఆఫ్ డ్యూటీలను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. రాజధాని సర్వీసులకు అటెండర్లను కేటాయించాలని, సరిపడా సిబ్బందిని నియమించాలని, మెకానికల్ సిబ్బందికి అవసరమైన పరికరాలు (టూల్స్) అందించాలని కోరారు. అలాగే లేడీ కండక్టర్లకు నెలకు 3 రోజుల సెలవులు ఇవ్వాలని, నైట్ అవుట్ సర్వీస్లలో డ్రైవర్లు, కండక్టర్లకు సరైన రెస్ట్ రూమ్ల సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎంయూ ఖమ్మం రీజినల్ కార్యదర్శి ఆర్. కృష్ణ, భద్రాచలం డిపో కార్యదర్శి జి. యుగంధర్, చైర్మన్ ఎం.ఎస్.రావు, వైస్ ప్రెసిడెంట్ ఎ.రాంబాబు, నాయకులు శ్రీరాములు, వి.వి. రావు, ఎ.వై. నారాయణ, స్వప్నకుమారి, కె.వి.రావు పాల్గొన్నారు. [caption id="attachment_2479430" align="alignnone" width="1200"] 'భద్రాచలం టిఐఎం డ్రైవర్ల హామీలను వెంటనే నెరవేర్చాలి'[/caption]

ఉద్యోగాల కోసం వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగ యువతపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్చేశారు. హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల కోసం వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగ యువతపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్చేశారు. వారి పట్ల అవమానకరంగామాట్లాడినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని శనివారం ఓ టీవీ చానెల్తో మాట్లాడుతూ చెప్పారు. ‘హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తే.. దరఖాస్తు చేసుకోవడానికి వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి తరలి రావడం వారి తప్పా? లేక ఉద్యోగాల కల్పనలో విఫలమైన ప్రభుత్వం తప్పా? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తున్నట్టు?’ అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండులక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన సర్కారు 32నెలలు దాటినా అమలుకు నోచుకోలేదన్నారు. ‘రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా భర్తీ చేసి ఉంటే.. ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేల మంది నిరుద్యోగులు క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా?2 లక్షల ఉద్యోగాల హామీ ఒక బోగస్’అని ఎద్దేవా చేశారు. పీజీలు చేసిన యువత కూడా చిన్న పోస్టుల కోసం పోటీ పడడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు