
రూ. 21,250తో కోటీశ్వరుడు అవ్వొచ్చు.. 8-4-3 సీక్రెట్ రూల్ తెలుసా
ఒకప్పుడు కోటీశ్వరుడు అవ్వడం అంటే కేవలం భారీగా సంపాదించే వాళ్లకు మాత్రమే సాధ్యమయ్యే ఒక పెద్ద కల. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మిడిల్ క్లాస్ వేతన జీవులు కూడా పక్కా ప్లానింగ్తో ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా కోటీశ్వరులు అయిపోవచ్చు. దీనికి పెద్దగా రిస్క్ కూడా అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో క్రమం తప్పకుండా చేసే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP), కాంపౌండింగ్ పవర్ తోడుంటే చాలు, అనుకున్న టార్గెట్ను సులువుగా రీచ్ అవ్వొచ్చు. ఫైనాన్షియల్ ప్లానర్లు ఎక్కువగా రికమండ్ చేసే ‘8-4-3 కాంపౌండింగ్ రూల్’ దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ 8-4-3 రూల్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 15 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాలను ఇది చూపిస్తుంది. దీర్ఘకాలంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ సగటున 12 శాతం వార్షిక రిటర్న్స్ ఇస్తాయనే అంచనాతో ఈ రూల్ పనిచేస్తుంది. మార్కెట్ ఒడిదొడుకుల వల్ల రిటర్న్స్ మారే ఛాన్స్ ఉన్నప్పటికీ, లాంగ్ టర్మ్లో 12 శాతం రిటర్న్స్ అనేది రీజనబుల్ అంచనా. మీ ఇన్వెస్ట్మెంట్ కార్పస్ పెరిగే కొద్దీ, అది ఎంత వేగంగా డబుల్ అవుతుందో ఈ రూల్ చాలా క్లియర్ గా వివరిస్తుంది. రూ. 1 కోటి టార్గెట్ను రీచ్ అవ్వడానికి మీరు నెలకు రూ. 21,250 ఎస్ఐపీ స్టార్ట్ చేయాలి. 12 శాతం వార్షిక రిటర్న్స్ వస్తాయని అనుకుంటే, మొదటి 8 ఏళ్లలో మీ ఇన్వెస్ట్మెంట్ విలువ దాదాపు రూ. 34 లక్షలకు చేరుకుంటుంది. ఈ 8 ఏళ్లలో (96 నెలలు) మీరు సొంతంగా ఇన్వెస్ట్ చేసిన అసలు మొత్తం రూ. 20.4 లక్షలు మాత్రమే. మిగిలిన అమౌంట్ అంతా మీకు కాంపౌండింగ్ ద్వారా వచ్చిన లాభం. అంటే మీ డబ్బు మెల్లమెల్లగా పెరగడం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇక అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. ఈ