
చెట్టును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
ఓ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీనడంతో వినోద్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చిత్రదుర్గం జిల్లా దండిన కురుబరహట్టి వద్ద జరిగింది.

ఓ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీనడంతో వినోద్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చిత్రదుర్గం జిల్లా దండిన కురుబరహట్టి వద్ద జరిగింది.

రామచందర్ రావు అరెస్ట్ నల్గొండలో చెలరేగిన దాడులు ముదిరిన కాంగ్రెస్ భాజపా వివాదం Ramchander Rao Arrest: తెలంగాణ రాజకీయాలు నల్గొండ జిల్లా వేదికగా తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. భాజపా నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు సిద్ధమైన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు(Ramchander Rao Arrest)ను పోలీసులు ముందస్తు చర్యగా అరెస్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా అడ్డుకున్నట్లు పోలీసులు చెబుతుండగా, ప్రతిపక్ష గొంతు నొక్కడమేనని భాజపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. Gold Silver Price Today: పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే! కోడిగుడ్ల దాడి - కాంగ్రెస్, భాజపా శ్రేణుల పరస్పర ఘర్షణలు: నల్గొండ పట్టణంలో నిన్న కాంగ్రెస్, భాజపా కార్యకర్తల మధ్య చెలరేగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంపై భాజపా శ్రేణులు కోడిగుడ్లతో దాడికి పాల్పడగా, దీనికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు భాజపా జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడికి దిగాయి. ఈ పరస్పర దాడులతో నల్గొండలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితులకు పరామర్శకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు: జిల్లా అధ్యక్షుడి ఇంట జరిగిన దాడి ఘటనను పరామర్శించి, బాధితులకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన రామచందర్ రావును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, నిరంకుశంగా ప్రవర్తిస్తోందని భాజపా నేతలు మండిపడుతున్నారు. పరిస్థితులు చేయిదాటకుండా నల్గొండ వ్యాప్తంగా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు

రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. న్యూఢిల్లీ, ఆగస్టు 22: రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బస్సు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నుంచి బెట్టియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. చిన్న పాప జన్మదినం సందర్భంగా ఈ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఆ కుటుంబం నిర్వహించిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఆ పాప తండ్రి కూడా మరణించారని పోలీసులు చెప్పారు. మృతులందరిని గుర్తించామని పేర్కొన్నారు. అతి వేగంతో వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించే క్రమంలో ఆర్కేస్ట్రా వైపు బస్సు దూసుకెళ్లిందని వివరించారు. ఈ కార్యక్రమం వద్ద ప్రజలు గుంపుగా ఉన్నారని పోలీసులు చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల జాబ్ క్యాలెండర్తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి

అబుజా (నైజీరియా): ఘర్షణలతో తీవ్రంగా ప్రభావితమైన దేశ ఉత్తర ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలో తిరుగుబాటుదారులు, నైజీరియా భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో 10 మంది పోలీసు అధికారులు మృతి చెందారని అధికారులు మంగళవారం వెల్లడించారు. సోమవారం కెబ్బీ రాష్ట్రంలోని సకాబా కౌన్సిల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణలో ఇద్దరు పౌరులు, 17 మంది తిరుగుబాటుదారులు కూడా మృతి చెందారని పోలీసు ప్రతినిధి బషీర్ ఉస్మాన్ ప్రకటనలో తెలిపారు. అంటే మొత్తం కలిపి 29 మంది మృతి చెందారు. తిరుగుబాటుదారులు మోటార్సైకిళ్లపై ప్రయాణిస్తూ, భారీ ఆయుధాలతో ఉన్న సమయంలో భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయని ఉస్మాన్ తెలిపారు. నైజీరియా పట్టణాలు, గ్రామాలపై తరచూ దాడులు చేసే సాయుధ ముఠాలు ఎక్కువగా ఉన్న జంఫారా రాష్ట్ర సరిహద్దు సమీపంలో వారు కనిపించారని చెప్పారు. “దురదృష్టవశాత్తు ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది పోలీసు సిబ్బందిని కోల్పోయాం. ఇద్దరు గాయపడ్డారు. వారికి వైద్య చికిత్స అందుతోంది” అని పోలీసు ప్రతినిధి తెలిపారు. తిరుగుబాటుదారులు నైజీరియా ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో చురుకుగా ఉన్న సాయుధ ముఠాలకు చెందినవారు. వీరిని స్థానికంగా "బాండిట్స్" అని పిలుస్తారు. తిరుగుబాటు, హింసకు పేదరికం, నిరుద్యోగం ఎక్కువగా ఉండటం, ప్రభుత్వ నియంత్రణ బలహీనంగా ఉండటం, జాతి, భూవివాదాలు తీవ్రరూపం దాల్చడం, పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణలు పెరగడం వంటివి కారణాలు. ఆయుధాలు సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. కొంతమంది నేర ముఠాలు గ్రామాలపై దాడులు చేసి డబ్బు వసూలు చేయడం, అపహరణలకు పాల్పడుతున్నారు. జంఫారా, కెబ్బీ, సోకోటో, కత్సీనా రాష్ట్రాల్లో ఇలాంటి సాయుధ గుంపులు తరచూ భద్రతా బలగాలపై, గ్రామాలపై దాడులు చేస్తుంటాయి. ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు) కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా

రాయదుర్గంలో నిర్మించతలపెట్టిన పీఎం ఏక్తా మాల్ ( PM Ekta Mall) టెండర్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు (Sridhar Babu) తెలిపారు. టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల ప్రకారం పూర్తి పాదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగిందని చెప్పారు. రావిర్యాలలో సీఎం రేవంత్ (CM Revanth) సోదరుడి కంపెనీకి తక్కువ ధరకే భూములు కేటాయించారన్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. సీఎం సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భూ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం పారదర్శకత పాటిస్తోందన్నారు. రాజకీయ లబ్ధికోసం కేటీఆర్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా ఇది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులపై కేటీఆర్ రాజకీయం చేయడం సరికాదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రూపొందుతున్న పీఎం ఏక్తా మాల్ పై తప్పుడు ప్రచారాన్ని ఆయన మానుకోవాలన్నారు
హిందూ సంప్రదాయం ప్రకారం తనకు అంత్యక్రియలు నిర్వహించి, అస్థికలను భారత్లోని పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలన్న భర్త చివరి కోరికను నెరవేర్చడానికి ఒక జపాన్ మహిళ వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఉత్తరాఖండ్లోని బాఘేశ్వర్కు చేరుకున్న ఆమె.. తన భర్త అస్థికలను పవిత్ర సరయూ నదిలో నిమజ్జనం చేసి, ఆయన కోరికను ఘనంగా నెరవేర్చింది. జపాన్కు చెందిన మియాకో అనే మహిళ, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలపై గాఢమైన ఆసక్తిని పెంచుకున్న అమెరికాలో జన్మించిన తన భర్త రాబర్ట్ అవశేషాలను తీసుకుని బాఘేశ్వర్కు చేరుకున్నారు.తన జీవిత కాలంలో రాబర్ట్.. తన అంత్యక్రియలు మరియు అస్థికల నిమజ్జనం (హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాల అవశేషాలను పవిత్ర నదిలో కలపడం) ఉత్తరాఖండ్లోని బాఘేశ్వర్ ఉన్న బాగ్నాథ్ ధామ్లో జరగాలని కోరుకున్నారు. స్థానిక గైడ్లు, పురోహితుల సహాయంతో మియాకో బాఘేశ్వర్లోని సరయూ, గోమతి నదుల సంగమ ప్రాంతానికి చేరుకున్నారు. రాబర్ట్ ఆత్మ శాంతి కోసం స్థానిక పూజారుల సహాయంతో నదీతీరంలో సాంప్రదాయ వైదిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన అస్థికలను సరయూ నదిలో నిమజ్జనం చేశారు.భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలు, ఆధ్యాత్మికతపై రాబర్ట్కు ఎంతో గౌరవం ఉందని, తన చివరి కోరికను ఆయన భార్యకు స్పష్టంగా తెలియజేశారని మియాకోకు సహకరించిన స్థానిక గైడ్ తెలిపారు. భర్త ఎంతగానో గౌరవించే సంప్రదాయాల ప్రకారం ఆయన చివరి కోరిక నెరవేరేలా చూడటానికే మియాకో జపాన్ నుంచి బాఘేశ్వర్కు వచ్చినట్లు వెల్లడించారు. ఘాట్ల వద్ద ఉన్న స్థానికులు, తీర్థయాత్రలకు వచ్చిన భక్తులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. భర్త చివరి కోరికను గౌరవించడానికి జపాన్ నుంచి ఉత్తరాఖండ్కు వచ్చిన మియాకో నిర్ణయాన్ని పలువురు ప్రశంసించారు.శివునికి అంకితం చేసిన పురాతన బాఘేశ్వర్లోని ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన బాగ్నాథ్ ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. సరయూ, గోమతి నదుల సంగమ స్థానంలో ఉన్న బాఘేశ్వర్, ఉత్తరాఖండ్లో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉంది