
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Anil Ravipudi: సంక్రాంతి అంటే అనిల్ రావిపూడిదే.. ఈ ప్లానింగ్ చూసి నేర్చుకోవాల్సిందే!

నటీనటులు : సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్కుమార్, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్, ఉపేంద్ర లిమాయే తదితరులు దర్శకత్వం : వేణుగోపాల్ రెడ్డి సమర్పణ : సందీప్ రెడ్డి వంగా సంగీతం : వాసుకి వైభవ్ ఛాయాగ్రహణం : పవన్ పప్పుల కూర్పు : వేణుగోపాల్ రెడ్డి ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఒక స్టార్టప్ నడుపుతుంటాడు. అతడు చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్కుమార్)తో ప్రేమలో పడతాడు. అన్వేష్ను కలిసేందుకు మైథిలి హైదరాబాద్ వచ్చిన క్రమంలో అనూహ్య సమస్యలు మొదలవుతాయి. ఆమె రాకతో అన్వేష్, అతని స్నేహితుల బృందం ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అసలు మైథిలికి ఏమైంది? ఆ సమస్యల వలయం నుంచి అన్వేష్ అండ్ గ్యాంగ్ ఎలా బయటపడ్డారు? అన్నదే ఈ సినిమా కథ. ‘రోమాంచకం’ సినిమా పెద్దగా కథాబలంపై కాకుండా, సిట్యువేషనల్, సిల్లీ కామెడీపైనే ఎక్కువగా ఆధారపడి సాగుతుంది. చాలావరకు ‘జాతిరత్నాలు’ జోన్ను తలపించేలా సాగే ఈ చిత్రంలో వినోదానికి లోటు లేకుండా చూసుకున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఫన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ను బాగా నవ్విస్తాయి. క్లైమాక్స్ సీన్ను గందరగోళం (కన్ఫ్యూజన్) కామెడీతో డిజైన్ చేసిన విధానం సినిమాకు హైలైట్గా నిలిచింది. సుమంత్ ప్రభాస్ తన కేర్ఫ్రీ యువకుడి పాత్రలో ఎంతో ఈజ్తో నటించి మెప్పించాడు. ఫన్ సీన్లలో చలాకీగా కనిపిస్తూనే, హీరోయిన్ అనంతికతో మంచి కెమిస్ట్రీ పండించాడు. అనంతిక కూడా తన పాత్ర పరిధి మేరకు చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకుంది. ఇక హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్గా కనిపించిన వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ పాత్రలు

Romanchakam Review : సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా తెరకెక్కిన సినిమా రోమాంచకం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు. కథ విషయానికొస్తే.. అన్వేష్(సుమంత్ ప్రభాస్) రోమాంచకం అనే డేటింగ్ యాప్ స్టార్టప్ కంపెనీ పెట్టాలని ఫ్రెండ్స్ తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు. దాని కోసం అమ్మాయిలను అర్ధం చేసుకోవాలని ఇంకో డేటింగ్ యాప్ లో చెన్నై అమ్మాయి మైథిలి(అనంతిక సనీల్ కుమార్)ని పరిచయం చేసుకొని ఇద్దరూ ఫోన్స్ లో మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయి బాగా దగ్గరవుతారు. మైథిలి పుట్టిన రోజు నాడు మొదటిసారి కలవాలని సర్ప్రైజ్ అని చెప్పి చెన్నై వెళ్తాడు అన్వేష్. తను ఒక హోటల్ దగ్గర ఉన్నానని చెప్పి రమ్మంటాడు. కానీ మైథిలి బ్లాక్ చేస్తుంది. దాంతో మైథిలి జ్ఞాపకాలతో, ఫ్రెండ్స్ తో గొడవలతో బాధపడుతుంటే సడెన్ గా ఓ రోజు మైథిలి ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నాను నీతో ఓ రెండు రోజులు ఉంటాను అని చెప్తుంది. మైథిలిని అన్వేష్ తన ఫ్రెండ్ మామ ఫ్లాట్ కి తీసుకెళ్తాడు. కానీ అన్వేష్ బయటకు వెళ్లొచ్చేసరికి మైథిలి ఫ్లాట్ లో కనపడదు. దీంతో అన్వేష్ కంగారుపడతాడు. అసలు మైథిలి ఎందుకు హైదరాబాద్ వచ్చింది? మైథిలి ఏమైంది? మైథిలి కనపడకపోవడంతో అన్వేష్, అతని ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అసలు మైథిలి - అన్వేష్ ప్రేమించుకున్నారా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.. Also See : Sumanth Prabhas : ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్ సుమంత్ ప్రభాస్.. ఫొటోలు వైరల్.. సినిమా విశ్లేషణ.. సందీప్ రెడ్డి వంగ చిన్న సినిమా, అది కూడా లవ్ స్టోరీ నిర్మిస్తున్నాడు

సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం ‘రొమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు గోపాల్రెడ్డి దర్శకత్వం వహించారు. రేపు(సెప్టెంబర్ 3) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరో సుమంత్ ప్రభాస్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. → మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు. → తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. → ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్తై కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది. → రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరైనా చూసి ఒకేలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా ఈ మూవీని చూడొచ్చు. నేను హీరోగా రెండు సినిమాలు చేసినా

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్కుమార్ ఈ సినిమాలో జంటగా నటించారు. రేపు(సెప్టెంబర్ 3) థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ, ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ బ్యాక్డ్రాప్లో, ఇక్కడి యాసతో సాగే ఒక ఫ్రెష్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. కథలో హీరో అన్వేష్ (సుమంత్ ప్రభాస్) తన ఫ్రెండ్స్తో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఒక డేటింగ్ యాప్ స్టార్టప్ను ప్రారంభిస్తాడు. అయితే ఈ డేటింగ్ యాప్ బిజినెస్ ద్వారా చెన్నైకి చెందిన అమ్మాయి (అనంతిక)తో అతను ఎలా కనెక్ట్ అయ్యాడు? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రొమాన్స్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తల్లిదండ్రులు మెచ్చేలా ఎలా నిలిచాడు అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి UA16+ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 16 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చు.ఇక ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ఎంతో గ్రిప్పింగ్గా 2 గంటల 22 నిమిషాలు (142 నిమిషాలు) రన్టైమ్తో ఫిక్స్ చేశారు. సుమంత్ ప్రభాస్ - అనంతిక మధ్య కెమిస్ట్రీ, వాసుకి వైభవ్ మ్యూజిక్, అద్భుతమైన కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కాబోతున్నాయి. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారట. జెన్-జీ ఆడియెన్స్ను మాత్రమే కాకుండా ఫ్యామిలీస్ను కూడా మెప్పించేలా ఉన్న ఈ 'రోమాంచకం' థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి. 'వండర్ వుమెన్' గాల్ గాడోట్ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. డిజిటల్ ప్లాట్ఫామ్పై సందడి!

స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నుంచి వస్తున్న 'రోమాంచకం' విడుదలకి సర్వం సిద్ధమైంది. ‘మా నిర్మాణంలో వృథా ఖర్చులు ఉండవు. కథ ఏం డిమాండ్ చేస్తే అంత వరకే ఖర్చు పెడతాం. చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా మేం పాటిస్తున్న నియమం అదే’ అని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy Vanga) తెలిపారు. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించిన ‘రోమాంచకం’ (Romanchakam) ఈ గురువారం విడుదలకు సిద్దమైంది. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సమర్పకులు. సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), అనంతిక సనీల్ కుమార్ (Ananthika Sanilkumar) జంటగా నటించారు. వేణుగోపాల్ రెడ్డి (T. Venugopal Reddy) దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి ప్రణయ్ మాట్లాడుతూ ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది. తెలంగాణలో, చెన్నైలో 10 రోజులు చిత్రీకరించాం. సుమంత్ ప్రభాస్ క్యారక్టర్ నేపథ్యంగా కథ సాగుతుంది. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు? అతని లైఫ్లో ఏం జరిగింది? అతని ప్రేమకథ ఎలా సాగింది? ఫ్రెండ్స్లో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అనేవి ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఎక్కడా బోర్ కొట్టదు. మా సంస్థ నుంచి వచ్చిన అన్ని సినిమాల్లాగే ‘రోమాంచకం’ కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే.. ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో కాస్త రాద్దాంతం జరిగినప్పటికీ తాజాగా.. సెన్సార్ యు/ఎ రాగా సినిమా నిడివిని 142 నిమిషాలు (2 గంటల 22 నిమిషాలు) గా లాక్ చేశారు. అమెరికాలో సెన్సార్ ఇండస్ట్రీ సారథ్యంలో ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం చేతుల్లో ఉంది. సినిమా నిర్మించడానికి ముందే నిర్మాతలు సెన్సార్ రూల్స్ తెలుసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అర్థమైందని ప్రణవ్ తెలిపాడు. సందీప్ ఈ కథ విని ఓకే చేసిన తర్వాతే పట్టాలెక్కించాం. సందీప్ ‘స్పిరిట్’ పనులతో బిజీగా

ఎలక్ట్రిక్ కారు (ఈవీ) కొన్నవారికి ఛార్జింగ్ స్టేషన్ వెతుక్కోవడం పెద్ద తలనొప్పి అనుకుంటే పొరపాటే. అసలు సమస్య తమ సొంత ఇల్లు లేదా అపార్ట్మెంట్లోని ఎలక్ట్రికల్ వ్యవస్థ దానిని తట్టుకోలేకపోవడమే కావచ్చు. సొంత ఇల్లు ఉన్నవారికి ఛార్జర్ ఏర్పాటు చేసుకోవడం సులభంగా అనిపించినా, అపార్ట్మెంట్లలో నివసించే వారికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఛార్జర్ ఒక్కటే కాదు, భవనం వైరింగ్, ట్రాన్స్ఫార్మర్, మొత్తం సొసైటీ విద్యుత్ వ్యవస్థ అదనపు లోడ్ను మోయగలదా అన్నదే అసలు ప్రశ్న. అందుకే, ఈవీ కొనేముందే ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఇంటికి తగినంత సాంక్షన్డ్ లోడ్ ఉందా?సాధారణంగా ఇళ్లకు 3-4 కిలోవాట్ల (కేడబ్ల్యూ) సాంక్షన్డ్ లోడ్ ఉంటుంది. కానీ, ఒక ఈవీ ఛార్జర్ కారు, ఛార్జర్ రకాన్ని బట్టి అదనంగా 7.5 కేడబ్ల్యూ లేదా అంతకంటే ఎక్కువ లోడ్ను జోడిస్తుంది. "ఈవీ యజమానులు ఇంట్లో ఛార్జింగ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇది ఇంట్లోని ఇతర ఉపకరణాల కంటే చాలా భిన్నమైన లోడ్ అని అర్థం చేసుకోవాలి. ఒక కారును 8 నుంచి 10 గంటల పాటు ఛార్జ్ చేయడానికి కనీసం 7.5 కేడబ్ల్యూ అదనపు లోడ్ అవసరం. ఫాస్ట్ ఛార్జర్లకు 22 కేడబ్ల్యూ వరకు అవసరం పడొచ్చు" అని ఛార్జర్ ఆన్ వీల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ అనిల్ కుమార్ ఎన్డీటీవీకి తెలిపారు. దీనివల్ల ఇంటికి కేటాయించిన అసలు లోడ్ కంటే వినియోగం భారీగా పెరిగిపోతుంది. కాబట్టి, మొదటగా మీ విద్యుత్ కనెక్షన్ సాంక్షన్డ్ లోడ్ ఎంత ఉందో

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా నటి కావ్య కళ్యాణ్ రామ్, సంగీత దర్శకుడు కాల భైరవ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఈ ఆసక్తికరమైన అంశం మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కావ్య కళ్యాణ్ రామ్, కాల భైరవ తమ్ముడైన యంగ్ హీరో శ్రీసింహా కోడూరి సరసన ఉస్తాద్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత కాల భైరవతో ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వెళ్తోంది. ఇక గతంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన జంటలు టాలీవుడ్, కోలీవుడ్లలో వార్తల్లో నిలిచాయి. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నటుడు అనిల్ కపూర్ సరసన మిస్టర్ ఇండియా వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆయన అన్నయ్య, నిర్మాత బోనీ కపూర్ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇదే వరుసలో నటి శ్రియా రెడ్డి కూడా విశాల్ సరసన పొగరు చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో విశాల్ - శ్రియా రెడ్డి రొమాంటిక్ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఆ సెట్ లో శ్రియాకు విశాల్ అన్నయ్య, నిర్మాత విక్రమ్ కృష్ణ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అలాగే సోనియా అగర్వాల్, ధనుష్ సరసన కాదల్ కొండేన్ చిత్రంలో నటించి

రుత్విక్ - విశాఖ ధీమాన్ జంటగా నటించిన సినిమానే 'రాజా ది రాజా'. ఈ ఇద్దరికీ ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అనిల్ బోయిడపు దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్స్ వైపు నుంచి పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా, ఆగస్టు 21వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.విశాఖపట్నంలో సత్యం (నరేశ్) ఒక డాక్టర్ గా చిన్న క్లినిక్ నడుపుతుంటాడు. భార్య .. కొడుకు 'రాజా' ( రుత్విక్) ఇదే అతని ఫ్యామిలీ. తన కొడుకు రాజా పెద్ద డాక్టర్ గా పేరు తెచ్చుకోవాలనేది ఆయన ఆశ. అయితే రుత్విక్ కి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. ఆ విషయాన్ని తండ్రికి చెబితే ఒప్పుకోడని భావించిన ఆయన, మెడికల్ కాలేజ్ కి వెళ్లి వస్తున్నట్టుగా నటిస్తుంటాడు. ఫ్యాషన్ డిజైనర్ గా జాబ్ సంపాదించి ఆ దిశగా ముందుకు వెళుతుంటాడు. తాను డిజైన్ చేసిన డ్రెస్ లతో ఫ్యాషన్ షోలో పాల్గొనే ఒక అందమైన అమ్మాయి కోసం ఆయన అన్వేషిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి 'ఆద్య' అనే ఒక యువతి తారసపడుతుంది. తన సహాయకురాలైన కుమారితో కలిసి, కొత్తగా ఆమె వైజాగ్ వచ్చిందనే విషయం రాజాకి అర్థమవుతుంది. తాము వచ్చింది 'మహీగఢ్' అనే ప్రాంతం నుంచి అంటూ ఆమె ఒక యువరాణిలా మాట్లాడినప్పటికీ, రాజా పెద్దగా పట్టించుకోడు. 'ఆద్య'ను ఫ్యాషన్ షోకి ఒప్పించాలనే విషయంపైనే అతని దృష్టి ఉంటుంది. ఈ విషయంపై ఆద్యా చుట్టూ తిరుగుతూనే ఆమెపై రాజా మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా అతని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇలాంటి పరిస్థితులలోనే రాజా తనని మోసం చేశాడనే విషయం సత్యానికి తెలుస్తుంది. అతనికి డాక్టర్ కావాలనే ఆలోచన లేదనీ, ఫ్యాషన్ డిజైనర్ గా

ఆంధ్రప్రదేశ్లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అతిపెద్ద కీలక అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోని 13,278 గ్రామపంచాయతీల పరిధిలోని 1,33,128 వార్డులకు గాను మొత్తం 1,36,326 పోలింగ్ స్టేషన్లతో తుది జాబితాను అధికారికంగా విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదంతో ఈ ప్రక్రియను పూర్తయినట్లు స్పష్టం చేశారు. స్థానిక పోరుకు సంబంధించి అత్యంత ముఖ్యమైన పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ తుది జాబితా రూపకల్పన వెనుక ఒక స్పష్టమైన టైమ్లైన్ మరియు నిబంధనావళిని ఎన్నికల సంఘం పక్కాగా అమలు చేసింది. ఆగస్టు 12న సర్క్యులర్ జారీతో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఆగస్టు 23న డ్రాఫ్ట్ జాబితా వెలువడింది. ఆగస్టు 26 వరకు అందిన అభ్యంతరాలు మరియు సూచనలను పరిశీలించిన తర్వాతే ఈ సెప్టెంబర్ 1న తుది జాబితా ఖరారైంది. ప్రతి వార్డుకు కనీసం ఒక కేంద్రం ఉండేలా ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అదనపు స్టేషన్లను సైతం అధికారులు సిద్ధం చేశారు. 2021లో ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం 2026 ఏప్రిల్తో ముగియడంతో రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించడం అనివార్యంగా మారింది. దీంతో కొన్ని చోట్ల ఉన్న కోర్టు కేసులు, సరిహద్దుల మార్పులు, పట్టణ పరిధుల విస్తరణ లాంటి అడ్డంకులను దాటుకుంటూ ఈసీ వేగంగా చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేతా కలెక్టర్లు మరియు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరుగులు తీస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ప్రకటనతో ఇక నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. రాజకీయంగా కూడా స్థానిక పోరు వేడి తీవ్రస్థాయికి చేరింది. ఫలితంగా అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తుండగా, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్ని స్థానాల్లో పోటీకి కేడర్ను సిద్ధం చేస్తున్నారు. ఈ

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయ ఘర్షణలతో యాదాద్రి భువనగిరి జిల్లా అట్టుడికింది. భువనగిరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు ఎమ్మెల్యే ఫ్లెక్సీపై నల్లరంగు చల్లారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపైనా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత శానంపూడి సైదిరెడ్డి తీవ్రంగా ఖండించారు. “కాంగ్రెస్కు అధికారం ఇచ్చింది దాడులు చేయడానికా?” అంటూ ప్రశ్నించారు. 60 ఏళ్ల మహిళపై దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. భువనగిరి ఘటనకు నిరసనగా చౌటుప్పల్లో బీజేపీ ఆందోళనకు దిగింది. బీజేపీ సీనియర్ నేత మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు చండూరులో మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్యే బీజేవైఎం కార్యకర్తలు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఒకే జిల్లాలో వరుసగా దాడులు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఇదీ చదవండి: ‘ఫ్రెండ్లీ పోలీస్.. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడమేనా?’ అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం

యువ కథానాయకుడు సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్కుమార్ జంటగా నటించిన రోమాంచకం చిత్రం హైదరాబాద్ స్పెషల్ ప్రీమియర్స్ సెప్టెంబర్ 2న ప్రదర్శితం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి ఒక్క రోజు ముందే ఈ ప్రత్యేక ప్రదర్శనలు ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ స్పెషల్ షోలకు సంబంధించి టికెట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలయికతో వినోదాత్మకంగా ఉంటుంది. విదేశాల్లో యూఎస్, యూకేలలో కూడా సెప్టెంబర్ 2నే ప్రీమియర్ షోలు ప్రదర్శితం అవుతున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను చూడాలని కోరారు. దీంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా థియేటర్ల దగ్గర ప్రీమియర్ షోలకు సంబంధించి బజ్ ఒక్కసారిగా పెరిగింది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి వైవిధ్యమైన సంగీతాన్ని వాసుకి వైభవ్ సమకూర్చడం విశేషం. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుండి యు సర్టిఫికేట్ పొందింది. ఫలితంగా ప్రతి ఒక్కరూ కలిసి హాయిగా థియేటర్లలో చూడదగిన కుటుంబ వినోదాత్మక చిత్రంగా ఇది సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వ్యాప్తంగా ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ఈ చిత్రం పంపిణీ బాధ్యతలను తీసుకున్నారు. భారత్లో సాధారణ థియేట్రికల్ షోలు సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ యంగ్ టీమ్ ప్రయోగాన్ని ఆదరిస్తారని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. స్నేహితుల బృందంతో కలిసి థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయడానికి రోమాంచకం సరైన చిత్రమని మేకర్స్ నొక్కి చెప్పారు. హైదరాబాద్ ప్రీమియర్స్ టికెట్ల విక్రయం వేగంగా సాగుతుండటంతో థియేటర్ల సంఖ్యను పెంచే దిశగా ఆలోచిస్తున్నారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్

'8 వసంతాలు' చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో నాకు లభించిన గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది మరియు నా మనస్సుకు బాగా దగ్గరైంది. ఆ సినిమా తర్వాత నా దగ్గరకు అనేక కథలు వచ్చినప్పటికీ, అవి నన్ను పూర్తి స్థాయిలో ఉత్సాహపరచలేకపోయాయి. అయితే 'రోమాంచకం' కథ విన్న వెంటనే నేను తీవ్రంగా ఎక్సైట్ అయ్యాను మరియు ఈ ప్రాజెక్ట్లో భాగం కావాలని వెంటనే నిర్ణయించుకున్నాను. చాలా కాలంగా ఒక సరదా మరియు ఎనర్జిటిక్ బబ్లీ క్యారెక్టర్ చేయాలనేది నా కలగా ఉండేది, ఈ సినిమాతో ఆ నెరవేరుతోంది. నా సొంత స్వస్థలం కేరళలోని త్రిస్సూర్ కాగా, నా చిన్నతనం నుంచే భరతనాట్యం, మోహినియాట్టం, కూచిపూడి వంటి కళలతో పాటు కరాటేలో కూడా శిక్షణ తీసుకున్నాను. నా తల్లిదండ్రులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, అప్పులు చేసి మరీ నా కళల శిక్షణకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు. 2023లో ‘మ్యాడ్’, 2025లో ‘8 వసంతాలు’ సినిమాలతో తెలుగులో నాకు మంచి పేరు వచ్చింది. గతంలో నేను చేసిన ఇంటెన్స్ పాత్రలకు పూర్తి భిన్నంగా, ఈసారి 'రోమాంచకం'లో ఒక సరదా తమిళ అమ్మాయిగా ప్రేక్షకులను అలరించబోతున్నాను. ఈ సినిమాలో నా సహ నటుడు సుమంత్ ప్రభాస్ డేటింగ్ స్టార్టప్ నడుపుతున్న ఒక యువ ఎంట్రప్రెన్యూర్గా చాలా ఎనర్జిటిక్గా కనిపించనున్నారు. దీంతో ఆయన పాత్రకు పోటీగా ఉండేలా నా క్యారెక్టర్ను కూడా దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇదిలా ఉండగా, షూటింగ్ సమయంలో సుమంత్ మరియు నా మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో నేచురల్గా, ఎలాంటి ల్యాగ్ లేకుండా రూపుదిద్దుకున్నాయి. కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడే నాకు కలిగిన ఆనందం ఖచ్చితంగా థియేటర్లలో ప్రేక్షకులకు కూడా అందుతుందని నమ్ముతున్నాను. మా సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'యూ' సర్టిఫికెట్ లభించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఫలితంగా, ఈ చిత్రాన్ని యూత్తో పాటు కుటుంబ ప్రేక్షకులు

మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని రూ.52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవుతో నిర్మించగా.. సీఎం నేడు ప్రారంభోత్సవం చేశారు. మూసీ నదిలో లక్షా యాభై వేల క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పటిష్ఠంగా దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జితో అంబర్పేట, మూసారాంబాగ్ ప్రాంతాలకు ప్రయాణాలు సులభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎంపీ లు అసదుద్దీన్ ఒవైసీ,అనిల్ కుమార్ యాదవ్,అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ , జూబ్లీహిల్స్ ఎంఎల్ ఏ నవీన్ యాదవ్ , ఎంఎల్ ఏ మల్ రెడ్డి రంగా రెడ్డి,మాజీ ఎంపీ మధు యాష్కీ,ప్రభుత్వ ఉన్నతాధికారులు

‘8 వసంతాలు’ తర్వాత తన దగ్గరకు చాలా స్క్రిప్ట్స్ వచ్చినప్పటికీ ఏవీ తనను ఎగ్జైట్ చేయలేదని, ‘రోమాంచకం’ (Romanchakam) కథ విన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందని హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ (Ananthika Sanilkumar) తెలిపారు. ఈ చిత్ర విశేషాలను ఇంటర్వ్యూలో తెలిపారు అనంతిక సనిల్ కుమార్. ‘8 వసంతాలు’ తర్వాత నా దగ్గరకు చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి. ఎన్నో కథలు విన్నాను. కానీ అవేవీ నన్ను ఎగ్జైట్ చేయలేదు. ఆ సమయంలో ‘రోమాంచకం’ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. కథ విన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి సినిమాలో కదా నటించాలని అనుకున్నాను అనే ఫీల్ కలిగింది. ఇందులో నేను బబ్లీగా, సరదాగా ఉండే అమ్మాయి పాత్రలో నటించాను. ఇలాంటి క్యారెక్టర్లో నటించాలనేది నా డ్రీమ్. యూత్ ఆడియెన్స్ బాగా రిలేట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమాలో నేను తమిళ అమ్మాయిగా కనిపిస్తాను. ఈ తరం యువత జీవితాల్లో జరిగే చాలా కాంటెంపరరీ అంశాలను సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. ఇది ప్రేమకథే అయినప్పటికీ యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సుమంత్ ప్రభాస్ ఈ సినిమా కోసం ఎక్కువ రోజులు వర్క్షాప్ చేశాడు. నేను మాత్రం ఆయనతో పోలిస్తే తక్కువ వర్క్షాప్స్ చేశాను. ఆయన పాత్ర చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది. నా క్యారెక్టర్ను కూడా ఆయనతో పోటీ పడేలా డిజైన్ చేశారు. మా ఇద్దరి మధ్య వచ్చే సంభాషణలు చాలా లైవ్లీగా, నిజంగా ఒక జంట మధ్య జరుగుతున్నట్టుగా సహజంగా అనిపిస్తాయి. సీన్స్ ఎక్కడా ల్యాగ్ లేకుండా వేగంగా సాగుతూ ఎంటర్టైన్ చేస్తాయి. ‘8 వసంతాలు’తో పోలిస్తే ‘రోమాంచకం’ పూర్తిగా డిఫరెంట్ జానర్ మూవీ. ‘8 వసంతాలు’ లాంటి ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమా చేయాలని అనుకున్నాను. అదే సమయంలో ప్రేమకథల్లో కూడా నటించాలని ఉండేది. ‘రోమాంచకం’ షూటింగ్ కూడా సినిమాలో ఉన్నంత సరదాగా జరిగింది

'బలగం' వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్తో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi) తరువాత సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. 'బలగం' వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్తో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi) తరువాత సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజునే వేణు సెకండ్ సినిమాను కూడా నిర్మిస్తానని చెప్పడమే కాకుండా.. దానికి ఎల్లమ్మ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ ఫిక్స్ అయినా హీరోలను వెటకడానికే సమయం పట్టింది. నాని దగ్గర నుంచి మొదలుపెట్టి.. నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్.. ఇలా అందరి పేర్లు వినిపించి చివరకు రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కానున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన దేవిశ్రీ ప్రసాద్ పోస్టర్ మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక ఇక్కడతో అయిపోయిందా అంటే.. హీరోయిన్ కోసం దిల్ రాజు చక్కర్లు కొడుతున్నట్లు టాక్ నడిచింది. కీర్తి సురేష్ అని కొందరు.. ఆ హీరోయిన్.. ఈ హీరోయిన్ అని రకరకాల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో పేరు తెరమీదకు వచ్చింది. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సరసన కథానాయికగా యువ నటి అనంతిక సనిల్కుమార్ ఎంపికైనట్లు సమాచారం. ‘మ్యాడ్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక 8 వసంతాలు సినిమాతో విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది. ఇక అనంతికపై దర్శకుడు వేణు యెల్దండి ప్రత్యేక టెస్ట్ షూట్, ఫోటోషూట్ నిర్వహించారట. ఆమె నటన, లుక్స్ పట్ల దర్శకుడు వేణు,నిర్మాత దిల్రాజు ఎంతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, పవర్ఫుల్ ఎమోషన్స్తో రాబోతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో దేవి సరసన అనంతిక అయితే పర్ఫెక్ట్ ఛాయిస్ అని

సంక్రాంతికి వస్తున్నాం అని ఊరికే మాటలు చెప్పడం కాదు.. ఏకంగా 4 నెలల ముందే మేకర్స్ తమ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. చట్టం తన పని తను చేసుకుపోతున్నట్లు.. పండగ బరిలో ఉన్న హీరోలంతా పక్కా ప్లానింగ్తో అప్డేట్స్ ఇస్తూ ఆసక్తి పెంచేస్తున్నారు. ఎవరికి ఎవరూ తగ్గట్లేదు.. మీరొక అప్డేట్ ఇస్తే మేం రెండిస్తామంటున్నారు. మరి ఆ హంగామా మనం కూడా చూద్దామా..? పండగ సినిమాల ప్రమోషన్స్ అనగానే అనిల్ రావిపూడే గుర్తుకొస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో వస్తున్న సినిమాను జనవరి 12 విడుదల అనే టైటిల్ ప్రకటిస్తూనే ప్రమోషనల్ వీడియో విడుదల చేసారు అనిల్. ఇక శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో రాబోతున్న జార్జ్ క్రిష్ సినిమా ఓపెనింగ్ మొన్నే జరిగింది.. దీని షూట్ కూడా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరగబోతుంది. ఈ ప్రమోషనల్ హంగామాలో చిరు కూడా చేరిపోయారు. బాబీతో ఈయన చేస్తున్న మెగా 158 ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 22న టైటిల్ గ్లింప్స్ రానుంది. చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్తో రాబోతున్న ఈ సినిమా అప్డేట్ మెగా అభిమానుల్లో పండగ ముందే వచ్చినంత జోష్ నింపుతోంది. మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతుంది. మెగా క్యాంపు నుంచే వస్తున్న సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ ప్రమోషన్స్ మొదలయ్యాయి. మొన్నే జనవరి 12 అంటూ డేట్ ప్రకటించారు. ఒకేరోజు ఇటు వెంకటేష్, అటు సాయి ధరమ్ తేజ్ సినిమాలు బాక్సాఫీస్పై దండెత్తబోతున్నాయి. మొత్తానికి 4 నెలల ముందే మొదలైన ఈ ప్రమోషన్ల జాతర చూస్తుంటే.. ఈసారి సంక్రాంతి థియేటర్లలో మామూలు రచ్చ ఉండేలా లేదు. పాన్,ఆధార్ వాట్సాప్లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి? వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్షంలో ఒక అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోపల తాను స్వయంగా పండించిన తాజా ఆకుకూరలను కోసి, తోటి వ్యోమగామి జెస్సికా మీర్తో కలిసి రుచికరమైన వంటకం తయారు చేసుకున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడు మరియు ఇతర సుదూర గ్రహాలపైకి చేపట్టే దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలలో తాజా ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయాలో ఈ ప్రయోగం ద్వారా నిరూపించారు. నాసాకు చెందిన ‘వెజ్జీ’ ప్లాంట్ గ్రోత్ చాంబర్లో ఈ కూరగాయలను దాదాపు నెల రోజుల పాటు శ్రమించి సాగుచేశారు. ఈ ప్రయోగంలో కేల్, వసాబి ఆవాల ఆకుకూరలను సేకరించి పరీక్షించినట్లు మీనన్ తెలిపారు. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తికి మొక్కలు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఎంతగానో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పంటల పెంపకంలో మార్గనిర్దేశం చేసిన నాసా వెజ్జీ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ది మార్షియన్’లో అంగారక గ్రహంపై బంగాళాదుంపలు పండించే మార్క్ వాట్నీ పాత్రను గుర్తుచేస్తూ, ఈ ప్రయోగాన్ని చూసి ఆయన కూడా ఎంతో గర్వపడతారని చమత్కరించారు. ఈ తరహా పరిశోధనలు కేవలం వ్యోమగాములకు పౌష్టికాహారాన్ని, మానసిక ఉత్సాహాన్ని అందించడమే కాకుండా, భవిష్యత్తులో భూమి నుండి అంతరిక్షానికి రవాణా చేయాల్సిన ఆహార భారాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తాయి. రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వెన్నులో వణుకే! యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం! LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త! లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్! అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు

టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్. ఈ ఫ్యామిలీ హ్యాండ్సమ్ హీరోకి మహిళా ప్రేక్షకుల నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. 2000ల ప్రారంభంలో శ్రీకాంత్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. హీరోగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ఆ తరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్గా టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా దూసుకుపోతున్నాడు. ఈమధ్యకాలంలో సహాయ పాత్రలు, విలన్ రోల్స్ లో కూడా అలరించిన శ్రీకాంత్ తాజాగా బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఈవెంట్స్ కు జడ్జిగా వ్వవహరిస్తున్నాడు. రీసెంట్ గా శ్రీకాంత్ జడ్జిగా ఉన్న షోలో సుడిగాలి సుధీర్ తో జరిగిన సంఘటన వైరల్ అవుతోంది. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మల్టీ టాలెంట్ స్టార్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). ప్రస్తుతం ఆయన జీ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో 'డ్రామా జూనియర్స్ సీజన్ 9'కి యాంకర్గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో నటుడు హీరో శ్రీకాంత్, రోజా మరియు దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇటీవల జీ తెలుగు విడుదల చేసిన ఒక వీడియో ప్రోమోలో శ్రీకాంత్ సుధీర్పై తీవ్రంగా విరుచుకుపడటం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోలో, శ్రీకాంత్ స్టేజీ పైకి రాగానే ఆయనను సుధీర్ ఆహ్వానిస్తూ.. "ఏంటన్నా అసలు.. మీరు ఎప్పుడూ చిన్న పిల్లల నవ్వుతో కనిపిస్తారు" అంటూ చనువుగా మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దాంతో ఒక్కసారిగా కోపానికి గురైన సీనియర్ నటుడు శ్రీకాంత్, సుధీర్ మాటలను అడ్డుకుంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "హేయ్ ఆపు! నీకు నేను హీరోలా కనిపించడం లేదా? తగ్గూ.. కొంచెం తగ్గూ.. అతి చేయకు. నీ పరిమితుల్లో (హద్దుల్లో) నువ్వు ఉండు" అంటూ హెచ్చరించారు. ఇన్నాళ్లూ మొహమాటంతో ఊరుకున్నానని, బయట తనకు ఉన్న గౌరవం తనకే ఉందని, ఇలాంటి ప్రవర్తన ఉంటే

సినిమా ఇండస్ట్రీలో పాతనీరు వెళ్లిపోయి కొత్తనీరు రావడం కామన్.. అచ్చం అలాగే సీనియర్ దర్శకుల ప్లేస్ను యంగ్ డైరెక్టర్లు భర్తీ చేస్తూ వాళ్ల మేకింగ్కు వారసులుగా మారుతున్నారు. సీనియర్లు మెల్లగా వేరే జోనర్స్కు షిఫ్ట్ అవుతుంటే.. ఆ గ్యాప్ను ఫిల్ చేస్తూ కుర్రాళ్లు తమదైన స్టైల్తో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నారు. మరి టాలీవుడ్లో ఏ సీనియర్ డైరెక్టర్ ప్లేస్ను ఏ యంగ్ డైరెక్టర్ రీప్లేస్ చేస్తున్నారో చూద్దామా..? ఫ్యామిలీ ఎమోషన్స్, క్యూట్ పంచ్లు అనగానే త్రివిక్రమ్ గుర్తుకొస్తారు.. సింపుల్ కథలతో మ్యాజిక్ చేయాలంటే ఈయనే. ఈ ప్లేస్ను వెంకీ అట్లూరి భర్తీ చేస్తున్నారిప్పుడు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ని త్రివిక్రమ్ గానీ తీశారా అనేంతగా తీసారు వెంకీ. త్రివిక్రమ్ నెక్ట్స్ ఎన్టీఆర్ సినిమాతో ప్యాన్ ఇండియాకు వెళ్తున్నారు.. దాంతో ఆ స్థానానికి సరైన వారసుడిగా వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు యాక్షన్, కామెడీ టైమింగ్తో ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన శ్రీను వైట్ల కొంతకాలంగా ఫామ్లో లేరు. సరిగ్గా అదే టైమ్లో ఆ లోటు భర్తీ చేస్తూ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. తన మార్క్ కామెడీ, యాక్షన్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్తో శ్రీను వైట్ల స్టైల్ను కంటిన్యూ చేస్తూ ఆయన సీటును అనిల్ పర్ఫెక్ట్గా సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు విలక్షణ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్గా కనిపిస్తున్నారు. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఫాంటసీని జోడించారు నాగీ. తన అద్భుతమైన విజన్తో సరికొత్త సినిమాలు తీస్తూ సింగీతం గారికి వారసుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు నాగ్ అశ్విన్. చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్! యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు! వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు

హైదరాబాద్లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జానీ, సుమలత మాస్టర్స్కు ఫెడరేషన్ షాకిచ్చింది. హైదరాబాద్లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ సమావేశంలో డాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగిలిన 23 క్రాఫ్ట్స్కు చెందిన ప్రతినిధులంతా పాల్గొని డాన్సర్స్ యూనియన్లో నెలకొన్న తాజా వివాదాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని (Anil Vallabhaneni) మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. యూనియన్ నాయకులు చేసిన తప్పుల వల్ల సామాన్య డాన్సర్లకు అన్యాయం జరగకూడదని, ఫెడరేషన్ నిర్ణయాలకు కట్టుబడి ఉన్న ప్రతి డాన్సర్కు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. డాన్సర్స్ యూనియన్ ప్రస్తుత కార్యవర్గానికి ఫెడరేషన్ నుంచి ఎలాంటి సహకారం అందదని ఆయన తేల్చిచెప్పారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి ఇండస్ట్రీ పెద్దలు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫెడరేషన్ సూచనలను ఏమాత్రం లెక్కచేయకుండా సుమలత (Sumalatha) డాన్సర్లను రెచ్చగొట్టి ఫెడరేషన్ను ధిక్కరిస్తూ ఎన్నికలు నిర్వహించారు. వారి స్వేచ్ఛకు మేం భంగం కలిగించం కానీ, వారి కార్యవర్గ నిర్ణయాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. వారిపై సహాయ నిరాకరణ కొనసాగుతుంది. అలాగే జానీ మాస్టర్ (Jani Master)పై ఉన్న సస్పెన్షన్ను కొనసాగిస్తున్నాం. ఇది 23 యూనియన్ల ఏకాభిప్రాయ నిర్ణయం. అంతేకాకుండా గతంలో జానీ మాస్టర్ ఫెడరేషన్కు విరాళంగా ఇచ్చిన మూడు లక్షల రూపాయలను తిరిగి ఆయనకే పంపించేస్తున్నాం’’ అని అనిల్ వల్లభనేని ప్రకటించారు. ఇక సినీ కార్మికుల వేతనాల పెంపు ప్రక్రియ వేగంగా జరుగుతోందని, సెప్టెంబర్ నాటికి దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా టికెట్ రేట్ల పెంపులో 20 శాతం మొత్తాన్ని కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని ఇప్పటికే జీవో ఇచ్చారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఆ బ్యాలెన్స్ మొత్తాన్ని వెంటనే ఫెడరేషన్

విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారైంది. ఇంతవరకు #VenkyAnil5, #NKRAR2 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్ను మేకర్స్ ప్రకటించారు. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ను ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు నివాళిగా ‘అప్పుల అప్పారావు’లోని ఓ హాస్య సన్నివేశాన్ని గుర్తు చేస్తూ వీడియోను మొదలుపెట్టారు. ఈవీవీ సత్యనారాయణ తనకు స్ఫూర్తి అని అనిల్ రావిపూడి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.వెంకటేశ్, కల్యాణ్రామ్, కీర్తి సురేశ్, కృతిశెట్టి కలిసి అనిల్ రావిపూడిని సినిమా టైటిల్ ఏంటని అడుగుతారు. అందుకు ఆయన ఎలాంటి తడబాటు లేకుండా ‘జనవరి 12 విడుదల’ అని చెబుతారు. దీంతో నటీనటులు కాసేపు అయోమయానికి గురవుతారు. తాము విడుదల తేదీ గురించి కాదు.. టైటిల్ గురించి అడిగామని చెబుతారు. చివరికి అదే సినిమా టైటిల్ అని అనిల్ వెల్లడించడంతో వీడియో ముగుస్తుంది.కొద్ది రోజుల క్రితం వెంకటేశ్ ఫస్ట్లుక్ను చిత్రబృందం విడుదల చేసింది. సినీ పరిశ్రమలో ఆయన 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోస్టర్ను తీసుకొచ్చారు. ఇందులో లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్రెడ్డిగా వెంకటేశ్ కనిపించారు.భారత సైన్యంలో పనిచేసే ఈ అధికారి కౌంటర్ టెర్రరిజం, బందీలను రక్షించే కార్యకలాపాల్లో నిపుణుడిగా ఉంటారని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఆర్మీ దుస్తుల్లో, సన్గ్లాసెస్తో, ఓ కారు

అనిల్ రావిపూడి ఏం చేసినా ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంటారు. ఆయన సినిమాల టైటిల్స్ విషయంలోనూ ఇదే ప్రత్యేకత కనిపిస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ప్రకటించినప్పుడు కొందరు విమర్శలు, సెటైర్లు చేసినప్పటికీ, ఆ సినిమా విడుదలైన తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. ప్రాంతీయ సినిమా పరిశ్రమలో పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాకు కూడా ఆసక్తికరమైన టైటిల్ను ఎంచుకున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. దానికి అనుగుణంగానే సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశారు. టైటిల్ను ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల చేసిన వీడియో కూడా సరదాగా సాగింది. ఇందులో వెంకటేష్, కల్యాణ్ రామ్తో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి కనిపించారు. జనవరి 12 విడుదల అనే మాట విన్న కీర్తి సురేష్, కృతి శెట్టి అది సినిమా టైటిల్ అనుకోవాలా, లేక విడుదల తేదీ అనుకోవాలా అన్న అయోమయంలో పడతారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి అసలు విషయాన్ని వివరిస్తారు. సినిమా పేరు కూడా జనవరి 12 విడుదలేనని, విడుదల తేదీ కూడా జనవరి 12నే అని చెబుతారు. ఈ సందర్భంగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఓ పాత సినిమాలోని క్లిప్ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ప్రకటన వీడియోలోని కామెడీ, హీరోలతో పాటు హీరోయిన్లను కూడా భాగం చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్లైన్ను కూడా ఖరారు చేశారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ కలయిక నేపథ్యంలో ఈ ట్యాగ్లైన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు జనవరి 12 విడుదలతో అనిల్ రావిపూడి ఎలాంటి కథను చెప్పబోతున్నారు, బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్లైన్ వెనుక

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎత్తివేసిన నాన్-కోఆపరేషన్ కాల్ను పునరుద్ధరిస్తున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో జరిగిన 23 క్రాఫ్టుల అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం మరియు ఇచ్చిన లిఖితపూర్వక హామీని ఉల్లంఘించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు. జానీ మాస్టర్పై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ విధించడంతో సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ వివాదానికి సంబంధించి జూలైలో డ్యాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఫెడరేషన్ జానీ మాస్టర్పై నాన్-కోఆపరేషన్ ప్రకటించినప్పటికీ, జూలై 19న చిరంజీవి మరియు బాలకృష్ణ మధ్యవర్తిత్వంతో సస్పెన్షన్ తాత్కాలికంగా తొలగించబడింది. ఇదిలా ఉండగా, అసోసియేషన్ అంతర్గత వ్యవహారాలు, ఆర్థిక అక్రమాలు మరియు నూతన ఎన్నికల నిర్వహణపై ఇరువర్గాల మధ్య విభేదాలు మళ్లీ మొదలయ్యాయి. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఏకపక్షంగా ఉపఎన్నికలు నిర్వహించడాన్ని ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించి మద్దతును పూర్తిగా ఉపసంహరించుకుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి మరియు నిర్మాతల మండలి ఇచ్చిన సలహాలను పక్కనపెట్టి నిబంధనలు దాటడంపై ఫెడరేషన్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఎన్నికల ద్వారా కొలువుదీరిన నూతన కార్యవర్గానికి ఎలాంటి సహకారం అందించబోమని తేల్చిచెప్పిన ఫెడరేషన్, సాధారణ డ్యాన్సర్లు తమను ఆశ్రయిస్తే మాత్రం పూర్తి రక్షణ అందిస్తామని హామీ ఇచ్చింది. ఫలితంగా జానీ మాస్టర్పై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ అమల్లోకి రావడంతో ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న సినిమాల షూటింగ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 23 క్రాఫ్టులకు చెందిన వర్కర్లు మరియు సాంకేతిక నిపుణులు ఆయన ప్రాజెక్టులకు సహకరించకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలోని పలువురు బడా నిర్మాతలు మరియు

విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి టైటిల్ ఖరారైంది. "జనవరి 12 విడుదల బావ బామ్మర్ది సౌజన్యంతో" అనే ఆసక్తికరమైన శీర్షికను చిత్ర బృందం అధికారికంగా ఎంపిక చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్ ద్వారానే ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ మరియు కామెడీ ఎంటర్టైనర్ అని స్పష్టమవుతోంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే వరుస బ్లాక్బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు, ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్పై చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తూ సందడి చేయనున్నారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా, షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తి చేసుకున్నట్లు సమాచారం అందింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సీజన్ను టార్గెట్ చేస్తూ పక్కా ప్లానింగ్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫలితంగా, జనవరి 12న బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద పోటీని ఇవ్వనుంది. వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలి. పండుగ రోజున కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి మరోసారి
Yes Essence: దేశీయ ఆర్థిక వృద్ధి, సంపద సృష్టిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా సరైన ఆర్థిక పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా ప్రత్యేకమైన క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది యెస్ బ్యాంక్. ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఈ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేకంగా వారి జీవనశైలికి తగినట్లుగా, విలువైన రివార్డులు, ప్రత్యేక సౌకర్యాలను అందించేలా యెస్ ఎసెన్స్ (Yes Essence) పేరుతో క్రెడిట్ కార్డును రూపొందించినట్లు తెలిపింది. నేటితరం ఉద్యోగిణులు, యువ వృత్తి నిపుణులు, డిజిటల్ విధానాలను ఎక్కువగా ఉపయోగించే మహిళల ఆకాంక్షలు, వినియోగ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్డును రూపొందించినట్లు వెల్లడించింది.యెస్ ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు వెల్కమ్ ఆఫర్లు: యెస్ ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ పొందిన వెంటనే ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్, ఫిట్నెస్ బ్రాండ్లపై ప్రత్యేకమైన వెల్కమ్ వోచర్లు లభిస్తాయి. హెల్త్ బెనిఫిట్స్: ప్రతి సంవత్సరం ఉచితంగా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ (క్యాన్సర్ మార్కర్ స్క్రీనింగ్తో సహా) లభిస్తుంది. రోజువారీ ఖర్చులపైనా రివార్డులు: డైనింగ్, గ్రోసరీ, షాపింగ్, బ్యూటీ ఉత్పత్తులు, ట్రావెల్ బుకింగ్స్ పై అదనపు రివార్డు పాయింట్లు ఇస్తున్నారు. వినోదం, కాంప్లిమెంటరీ సర్వీసెస్: బై వన్ గెట్ వన్ (Buy One Get One) సినిమా టికెట్లు, ప్రముఖ మాల్స్లోని ఎంపిక చేసిన అవుట్ లెట్లలో కాంప్లిమెంటరీ కాఫీ సౌకర్యం లభిస్తాయి. బర్త్ డే స్పెషల్స్: పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. మైల్ స్టోన్ బోనస్: నిర్ణీత టార్గెట్ ఖర్చులపై ప్రతి సంవత్సరం 10 వేల వరకు యెస్ రివార్డ్స్ (YES Rewardz) పాయింట్లు పొందే అవకాశం ఉంది.'యెస్ బ్యాంకులో మా వినియోగదారుల మారుతున్న ఆశయాలను అర్థం చేసుకోవడంలోనే అర్థవంతమైన ఆవిష్కరణలు మొదలవుతాయని మేము నమ్ముతాము. ఆర్థిక వృద్ధి, సంపద సృష్టిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న కొద్దీ వారికి తగిన ప్రత్యేక ఆర్థిక పరిష్కారాల అవసరం కూడా పెరుగుతోంది

సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ చూసిన పలువురు హీరోలు మళ్ళీ పొంగల్ బరిపైనే గురి పెట్టారు.. వారిలో టాప్ స్టార్స్, మీడియం స్టార్స్, యంగ్ హీరోస్ ఉన్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఆ ముచ్చటేంటో చూద్దాం. టాలీవుడ్లో సంక్రాంతి (Pongal Movies) సీజన్కు ఉన్న క్రేజ్ మరో పండుగకు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పొంగల్ తరువాత సమ్మర్, దసరా, క్రిస్మస్ సీజన్స్ కు సినిమాలు వచ్చి అలరించేవి. కానీ, ఇప్పుడు అనేకమంది తెలుగు స్టార్స్ సంక్రాంతి బరిపైనే గురి పెడుతున్నారు. అలా ఈ సారి పలువురు స్టార్స్ ముగ్గుల పండుగకు మురిపించే ప్రయత్నం చేస్తున్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఆసక్తిని కలిగిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)- బాబీ కాంబోలో రెండో సినిమా ముందు నుంచీ పొంగల్ కే వస్తుందని వినిపిస్తోంది. ఈ మూవీకి 'కదిరి నరసింహుడు', 'కాకాజీ' అన్న టైటిల్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవి పలుమార్లు సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ సాధించారు. పాలిటిక్స్ వీడి మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన తరువాత చిరంజీవికి బంపర్ హిట్స్ చూపించిన "ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు" చిత్రాలు పొంగల్ కే ప్రేక్షకులను పలకరించడం గమనార్హం. అందువల్ల తన కొత్త సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేసే దిశగా చిరంజీవి అడుగులు వేస్తున్నారు. మరో స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) కూడా పలుమార్లు సంక్రాంతి బరిలో గ్రాండ్ సక్సెస్ చూశారు. వెంకీ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' 2025 బ్లాక్ బస్టర్ గా నిలచింది... అలాగే ఆయన కేమియో రోల్ పోషించిన సమన శంకరవరప్రసాద్ గారు' కూడా బంపర్ హిట్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తోన్న సినిమాను కూడా పొంగల్ లోనే రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మేకర్. ఈ చిత్రానికి 'జనవరి 12 విడుదల' అనే టైటిల్ను ఖరారు

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంపై చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంపై చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తూ వైరల్ అవుతోంది. దివంగత లెజెండరీ దర్శకుడు ఇవివి సత్యనారాయణ వింటేజ్ కామెడీ స్పూర్తితో ఈ టైటిల్ గ్లింప్స్ను డిజైన్ చేశారు. హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్లతో పాటు హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి దర్శకుడు అనిల్ రావిపూడిని ‘సినిమా టైటిల్ ఏంటి?’ అని అడగ్గా, ఆయన ‘జనవరి 12 విడుదల’ అని పదే పదే బదులిస్తారు. రిలీజ్ డేట్ కాదు సినిమా టైటిల్ అడుగుతున్నాం కదా అని వెంకీ అడగగా, అసలు ఆ సినిమా పేరే ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) అని రివీల్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి ‘బావ బావమర్ది సౌజన్యంతో’ అనే సరదా ట్యాగ్లైన్ కూడా జోడించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా పండగ వాతావరణంలో 12 జనవరి, 2027న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టైటిల్, రిలీజ్ డేట్ రెండూ ఒకటే అయ్యేలా డిజైన్ చేసిన ఈ వినూత్న టైటిల్తో సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు మొదలయ్యాయి. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ నిర్వహించే తీరు

2027 సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల లెక్కలు అప్పుడే మొదలైపోయాయి.. 4 ముందే దర్శక నిర్మాతలు పండగ రేసులో కర్చీఫ్లు వేసేస్తున్నారు. పాత సినిమాలకు తోడుగా కొత్త క్రేజీ ప్రాజెక్టులు కూడా ఈ ఫెస్టివల్ బరిలోనే దిగేందుకు ఆసక్తి చూపిస్తూ క్యూ కడుతున్నాయి. ఇంతకీ 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న ఆ భారీ సినిమాలేంటో చూద్దామా? చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న మెగా 158వ చిత్రం ఆన్ టైమ్లో సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా.. దీని షూట్ కూడా వేగంగా జరుగుతుంది. పైగా చిరంజీవి రీ ఎంట్రీలో ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు పండక్కే వచ్చి హిట్టవ్వడంతో.. ఆ సెంటిమెంట్ను గట్టిగా నమ్ముతున్నారు చిరు. అందుకే మెగా 158ను పండక్కే ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్లో సంక్రాంతి అల్లుడు అనే బ్రాండ్ నేమ్ తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. తన సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ 2027 సంక్రాంతికి వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ను సిద్ధం చేస్తున్నారు. పండక్కి మళ్లీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు.. ఇప్పటికే ఫస్టాఫ్ షూటింగ్ కూడా అయిపోయింది.. ఆన్ టైమ్ పండక్కి ల్యాండ్ కానున్నారు అనిల్. సంక్రాంతికి 100 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న శర్వానంద్.. సీనియర్ దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి జార్జ్ క్రిష్ అంటూ పండగ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకున్నారు. జనవరి 14న సినిమా విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైనర్స్కి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన శ్రీను వైట్ల.. 2010లో వచ్చిన నమో వెంకటేశ తర్వాత పండగ సీజన్లో రానున్నారు. ఇలా స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ముందుగానే సీట్లు రిజర్వ్ చేసుకున్నారు. ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. ఆకాశంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా.. ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Zee Media Q1 Results: ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక ఫలితాలు వచ్చేశాయి. క్వార్టర్ 1 ఫలితాల్లో జీ మీడియా అదరగొట్టింది. రూ.190.85 కోట్ల ఆదాయం పొందడం విశేషం. ఏఐ, డిజిటల్లో దూసుకెళ్తున్న భారత మీడియా దిగ్గజం జీ నెట్వర్క్ తదుపరి ప్రణాళికలు, లక్ష్యాలు ఏమిటో జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ తెలిపారు. క్యూ1 ఫలితాలపై అతడు స్పందిస్తూ జీ మీడియా నెట్వర్క్కు సంబంధించి ప్రణాళికలను వెల్లడించారు. సాంప్రదాయ ప్రకటనలపై మాత్రమే ఆధారపడే మీడియా సంస్థ స్థాయి నుంచి విభిన్న ఆదాయ మార్గాలు కలిగిన టెక్-మీడియా కంపెనీగా జీ మీడియా రూపాంతరం చెందుతోందని నెట్వర్క్ సీఈవో రక్తిమ్ దాస్ తెలిపారు. క్యూ1 ఆర్థిక ఫలితాల అనంతరం జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ ప్లాట్ఫామ్లలో వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్రూమ్లు, రీజినల్ నెట్వర్క్ విస్తరణే తమ ప్రధాన లక్ష్యాలని వెల్లడించారు. జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ (జెడ్ఎంసీఎల్) ఆర్థిక ఫలితాలు, సంస్థ డిజిటల్ వ్యూహం, భవిష్యత్ విస్తరణపై జీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆర్థిక పనితీరు – కీలక గణాంకాలు ఆదాయం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1) జీ మీడియా ఏకీకృత ఆదాయం రూ.190.85 ( రూ.1,908.5 మిలియన్లు) కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ ఖర్చులు: నెట్వర్క్ నిర్వహణ ఖర్చులు రూ.174.59 కోట్లు (1,745.9 మిలియన్లు)గా ఉన్నాయి. వ్యూహాత్మక మైలురాయి: క్యూ1 పనితీరు సంస్థ తదుపరి వృద్ధి ప్రయాణానికి బలమైన పునాది వేసింది. సరికొత్త ఆదాయం వైపు మార్పు సాంప్రదాయ ప్రకటనలపై మాత్రమే ఆధారపడే న్యూస్

అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్ చిట్ ఇచ్చినట్లు.. లఖ్నవూ: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. ఆయనతో పాటు.. ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా క్లీన్చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చంపత్ రాయ్కు విరాళాల చోరీ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సిట్ తన తొలి నివేదికలో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సిట్ తన నివేదికను రాష్ట్ర హోంశాఖకు ఇవ్వగా.. ఈ నివేదిక పరిశీలన అనంతరం తదుపరి చర్యల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అందించినట్లు సమాచారం. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదికలో చంపత్ రాయ్తో పాటు మాజీ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా పేర్లు కూడా లేవని సమాచారం. అయితే, విరాళాల వ్యవహారంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరూ జూన్ 27న ట్రస్ట్లోని తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో జూన్ 13న తొలి సిట్ను ఏర్పాటు చేశారు. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తు చేపట్టింది. రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మరో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ నిర్వహిస్తోంది. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సోమవారం సిట్ను ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి

శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెనుకొండ మండలం మావటూరు సమీపంలో గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. బాధితుడి కాళ్లను నరికివేసిన నిందితులు, అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సగం కాలిపోయిన మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.మృతుడిని కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురానికి చెందిన అనిల్ కుమార్ (21)గా పోలీసులు గుర్తించారు. బాధితుడు పెనుకొండ పారిశ్రామిక వాడలోని కియా మోటార్స్ అనుబంధ పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. రోడ్దం మండలం దొడగట్టలోని బంధువుల ఇంట్లో నివసిస్తూ ప్రతిరోజూ విధులకు హాజరయ్యేవాడు. రోజువారీ మాదిరిగానే పనికి వెళ్తుండగా, మార్గమధ్యంలో దుండగులు మాటువేసి అతనిపై దాడికి తెగబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పెనుకొండ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. పాత కక్షలు లేదా వ్యక్తిగత వివాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు

అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్కు ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్) క్లీన్చిట్ ఇచ్చింది. ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా కేసుతో సంబంధం లేదని తేల్చింది. ఈ కేసుపై దర్యాప్తు పూర్తిచేసిన సిట్ తుది నివేదికను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు ఉత్తర్ప్రదేశ్ హోంశాఖ అందించింది. విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో చంపత్రాయ్, అనిల్ మిశ్రా జూన్ 27న తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం సిట్ వారిద్దరినీ విచారించింది. ఆలయానికి వచ్చిన విరాళాల సేకరణ, నగదు నిర్వహణపై వివరాలు సేకరించింది. విచారణలో చంపత్రాయ్ తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. అక్రమాల విషయం తెలిసిన వెంటనే తానే ఫిర్యాదు చేశానని ఆయన దర్యాప్తు అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది.ఈ కేసులో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటైంది. రేంజ్ ఐజీ కిరణ్ ఎస్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్రతన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. జూన్ 23న సిట్ ప్రాథమిక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు

బీజేపీ తన సోషల్ మీడియా విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో సోమవారం ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గంలో, సోషల్ మీడియా కన్వీనర్గా ఛత్తీస్గఢ్కు చెందిన దీపక్ మస్కేను నియమించారు. దాదాపు దశాబ్ద కాలంగా పార్టీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ గా కొనసాగిన అమిత్ మాలవ్యను ఈ బాధ్యతల నుంచి తప్పించడం గమనార్హం.దీపక్ మస్కేకు సహాయకులుగా నలుగురు సోషల్ మీడియా కో-కన్వీనర్లను పార్టీ నియమించింది. వీరిలో ప్రీతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్ ఉన్నారు. అదేవిధంగా, మీడియా కోఆర్డినేటర్గా అనిల్ బలూనీకి బాధ్యతలు అప్పగించగా, ఆశిష్ ఉషా అగర్వాల్, ప్రదీప్ భండారి, సిద్ధార్థ్ యాదవ్ జాయింట్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించనున్నారు.పార్టీలో చేపట్టిన విస్తృతస్థాయి పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. పదేళ్లకు పైగా బీజేపీ జాతీయ ఐటీ సెల్కు నాయకత్వం వహించిన అమిత్ మాలవ్య, గతంలో పశ్చిమ బెంగాల్ కో-ఇన్చార్జ్గా కూడా పనిచేశారు. అయితే, తాజా జాబితాలో సోషల్ మీడియా లేదా ఐటీ సంబంధిత బాధ్యతల్లో ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. రాబోయే పలు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ డిజిటల్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకే ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి 'రామాయణం' యానిమేషన్ మూవీ చేయబోతున్నారు. రామాయణంలోని పాత్రలన్నింటి ఎమోషన్స్ ఆయనే పండించబోతున్నారట. భారతీయ పురాణాలలో గొప్పదైన రామాయణ కావ్యానికి ఉన్న ప్రత్యేక అంతా ఇంతా కాదు. వివిధ భాషల్లో లెక్క పెట్టలేనంత మంది వాల్మీకి రామాయణాన్ని తిరిగి స్పృశించారు. తమదైన భాష్యాన్ని తెలియచేస్తూ సమకాలీనులను ఆనంద పర్చారు. అలానే రామాయణ గాథను, అందులోని సన్నివేశాలను ఎంతోమంది రంగస్థలంపై ప్రదర్శించారు. ఇక ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఎంతోమంది వందల చిత్రాలను రూపొందించారు. ఇప్పటికీ రామాయణం గాథ వెండితెరకెక్కుతూనే ఉంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సైతం రామాయణాన్ని తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కృతం చేయాలని భావిస్తున్నారు. అయితే అది మామూలు సినిమా కాదు యానిమేషన్ మూవీ. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రముఖ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైందని తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలన్నది ఆయన ప్లాన్. అయితే ఆ తర్వాత అనిల్ రావిపూడి ఈ రామాయణం గాథపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారని తెలిసింది. ఇది మామూలు యానిమేషన్ మూవీ కాదని అనిల్ రావిపూడి సన్నిహితులు చెబుతున్నారు. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించేలా రామాయణ గాథను అనిల్ రావిపూడి తీర్చి దిద్దాలని అనుకుంటున్నారట. ప్రతీ సీన్ ను ఓపికగా డిజైన్ చేసుకోవడంతో పాటు ప్రతి పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ ను కాగితంపై రాసుకుని, వాటిని తానే అభినయించి, ఆ మూడ్ను యానిమేషన్ క్యారెక్టర్స్ కు అప్లయ్ చేయమని అనిల్ రావిపూడి చెప్పబోతున్నారట. రామాయణంలో ఒక్కో పాత్రదీ ఒక్కో శైలి, ఒక్కొక్కరిదీ ఒక్కో బాడీ లాంగ్వేజ్. అలానే ఒక్కొక్కరిదీ ఒక్కో లక్ష్యం. వీరందరికీ సంబంధించిన మూడ్స్ ను అనిల్ రావిపూడే పలికించబోతున్నారట. దానిని డిజిటలైజ్ చేసి

సూర్య ప్రకాష్ జోశ్యుల భోగి మంటలతో మొదలవుతుంది తెలుగు వారి సంక్రాంతి. చలికాలపు తెల్లవారుజామున ఇంటి ముందు మంటలు. ఆ తర్వాత పెద్ద పెద్ద ముగ్గులు. గొబ్బెమ్మలు. కొత్త బట్టలు. పిండివంటల వాసన. అమ్మమ్మలు, తాతయ్యలు, అత్తలు, మామలు, బంధువులతో నిండిపోయే ఇళ్లు. పట్టణాల్లో ఉన్నవాళ్లు పల్లెలకు బయలుదేరుతారు. పల్లెల్లో ఉన్నవాళ్లు బంధువుల కోసం ఎదురుచూస్తారు.కోడి పందాలు.గుండాటలు. కొత్త అల్లుడు ఇంటికి రావడం నుంచి.. కనుమ రోజు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వరకు..పెద్ద ఉత్సవంలా సాగుతుంది. ఈ పండుగలో మరో పండుగ ఎప్పుడు చేరిందో మనకు తెలియకుండానే జరిగిపోయింది. అదే సినిమా పండగ. సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా కొత్త సినిమా చూడాలి అన్న భావన తెలుగు కుటుంబ జీవనంలో దాదాపు ఒక భాగమైపోయింది. కాబట్టే సంక్రాంతి అంటే తెలుగు పరిశ్రమలో ఒక రిలీజ్ డేట్ గా చూడరు. అది ఒక బిజినెస్ మోడల్ గా గమనిస్తారు. సంవత్సరం ప్రారంభంలో వచ్చే ఆ కొన్ని రోజులు నిర్మాతలకు ఏడాది మొత్తం కలలో కనిపించే బాక్సాఫీస్ విండో. కుటుంబాలు కలిసి సినిమాలకు వెళ్లే సమయం. థియేటర్లకు అదనపు షోలు వేసే సమయం. స్టార్ హీరోలు తమ మార్కెట్ను పరీక్షించుకునే సమయం. చాలా కాలంగా సంక్రాంతి అంటే ఒకే రకమైన పోటీ కనిపించేది. కృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలు, ఆ తర్వాత కాలంలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ. వెంకటేష్ వర్సెస్ నాగార్జున. స్టార్ వర్సెస్ స్టార్.కానీ ఇప్పుడు ఆ పోటీ స్వభావమే మారుతున్నట్టుంది. 2025 నుంచి 2027 వరకు సంక్రాంతి సినిమాలను వరుసగా చూస్తే ఒక ఆసక్తికరమైన pattern కనిపిస్తుంది. సంక్రాంతి ఇక “ఎవరి స్టార్ పవర్ ఎక్కువ?” అన్నట్లు కాకుండా “ఎవరి సినిమా కుటుంబాన్ని థియేటర్కు తీసుకువచ్చి, అక్కడ రెండు మూడు గంటలు నవ్వించగలదు?” అనే ప్రశ్నగా మారింది. ఈ మార్పుకు ఒకే వ్యక్తిని కారణంగా చూపడం కొంచెం అతిశయోక్తి కావచ్చు. కానీ ఒక

నటసింహం నందమూరి బాలకృష్ణ.. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ హిట్ తర్వాత ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ‘NBK112’ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. అయితే, అనుకోకుండా ‘NBK111’ షూటింగ్ సమయంలో బాలయ్యకు గాయం కావడం, దానికి సర్జరీ జరగడంతో డాక్టర్లు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. సినిమా పరిశ్రమలో ఒక స్టార్ హీరో లేదా అగ్ర దర్శకుడి షెడ్యూల్ మారితే, దాని ఎఫెక్ట్ వరుసగా మిగతా ప్రాజెక్టులపై పడుతుంది. ప్రస్తుతం బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. నిజానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఆగస్టులోనే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, బాలయ్య గాయం వల్ల ఈ సినిమా షూటింగ్ వచ్చే సమ్మర్కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొరటాల శివ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, బాలయ్య తర్వాత చేయాల్సిన మరికొన్ని సినిమాల షెడ్యూల్స్ కూడా రీ-షెడ్యూల్ కాక తప్పడం లేదట. ఈ లైనప్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే... కొరటాల శివ సినిమా పూర్తయిన వెంటనే, బ్లాక్బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉందట. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలియంది కాదు. అయితే, బాలయ్య-కొరటాల సినిమా ఆలస్యం కానుండటంతో అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్ ప్లానింగ్ను మార్చుకోవాలని చూస్తున్నట్లు ఫిలిం నగర్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2027 Pongal Race: 2027 సంక్రాంతికి లెక్కలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఆల్రెడీ ఆరు నెలలు ముందుగానే హీరోలు, దర్శక, నిర్మాతలు ఒకప్పడు బస్సుల్లో ఖర్చీఫ్లు వేసి సీటు రిజర్వ్ చేసుకున్నట్టు .. ఆయా హీరోలు దర్శక, నిర్మాతలు దస్తీలు వేసి పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త సినిమాలు యాడ్ అవుతూనే ఉన్నాయి.. చిరంజీవి- బాబీ కలయికలో వస్తున్న చిత్రం మెగా 158 ఖచ్చితంగా ఆన్ టైమ్ సంక్రాంతికే రావడం పక్కా. ఇందులో ఎవరికీ ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. పైగా చిరంజీవికి రీ ఎంట్రీలో ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు పండక్కే వచ్చి హిట్ కొట్టాయి. దీంతో మరోసారి మెగాస్టార్ సంక్రాంతి సెంటిమెంట్నే నమ్ముకున్నాడు. ఈ సినిమాకు ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ దాదాపు ఖరారు అయింది. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నారు. అనిల్ రావిపూడి వెంకటేష్, కళ్యాణ్ రామ్ల మూవీ.. అనిల్ రావిపూడికి సంక్రాంతి అల్లుడు అనే పేరు వచ్చేసింది. అది నిలబెట్టుకుంటూ 2027 సంక్రాంతికి వెంకటేష్, కళ్యాణ్ రామ్్ల మల్టీస్టారర్ సంక్రాంతికి రెడీ చేస్తున్నాడు. గత మూడు సంక్రాంతులకు వరుసగా తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఇక సంక్రాంతి రేసులో మరో సినిమా శర్వానంద్, శ్రీను వైట్ల ‘జార్జ్ క్రిష్’ కూడా ఏడాది ముందే సంక్రాంతి బెర్త్ లాక్ చేసుకున్నారు. ఇక శర్వానంద్ కూడా ఈ యేడాది సంక్రాంతికి ‘నారీ నారీ

తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సినిమాల జాతర. 2027 సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఇప్పటికే పలు ఆసక్తికరమైన కాంబినేషన్లు, భారీ ప్రాజెక్ట్లు సిద్ధమవుతుండటంతో అప్పుడే సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. 2027 సంక్రాంతి రేసులో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన సినిమాలను ఓసారి చూస్తే.. వెంకటేష్ – కల్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి : సంక్రాంతి కింగ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలసి ఒక క్రేజీ మల్టీస్టారర్ గా కత్తిలాంటి ఐడియాతో వస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి నవ్వుల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ : ‘హను-మాన్’ వంటి సంచలన విజయాన్ని అందించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రవితేజ – శ్రీవిష్ణు – దిల్ రాజు : మాస్ మహారాజా రవితేజ కామెడీ అండ్ విలక్షణ నటనకు పేరుగాంచిన శ్రీవిష్ణు కాంబినేషన్లో ఒక హిలేరియస్ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఎంటర్టైనర్కు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్ – శ్రీను వైట్ల –జార్జ్ క్రిష్ :‘సంక్రాంతి హీరో’గా పేరున్న శర్వానంద్, ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ ‘జార్జ్ క్రిష్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 14, 2027న విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కార్తి – కళ్యాణ్ శంకర్ –
విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వినోదానికి సరికొత్త హంగులు అద్ది, పక్కా కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏమాత్రం విరామం లేకుండా నిరంతరాయంగా చిత్రీకరణ జరుపుతోంది.చిత్ర యూనిట్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు అనిల్ రావిపూడి ఆదివారాలు, పండుగ సెలవులు అనే తేడా లేకుండా ఏకధాటిగా షూటింగ్ పనులను ముందుకు నడిపిస్తున్నారు. సంక్రాంతి నాటికి విడుదల చేయాలన్న పక్కా ప్రణాళికతో టీమ్ మొత్తం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. వేగంతో పాటు అవుట్పుట్ విషయంలో కూడా రాజీపడకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో గ్రాండ్గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు పూర్తి చేసుకున్న విజువల్స్ క్వాలిటీ అద్భుతంగా వచ్చిందని, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.* కావేరీ పాత్ర కోసం చాలా కష్టపడ్డా... ‘ఇరుముడి’లో సెంటిమెంట్తో పాటు మంచి మెసేజ్ ఉంటుంది - ప్రియా భవానీకల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్ఈ సినిమాలో వెంకటేష్ పోషిస్తున్న పాత్ర కథకి ప్రధాన బలంగా నిలవనుంది. ఆర్మీలోని కౌంటర్-టెర్రరిజం, బందీల విముక్తి విభాగంలో పనిచేసే 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి' అనే మోస్ట్ పవర్ఫుల్ సైనిక అధికారి పాత్రలో ఆయన కనిపించనున్నారు. చిత్ర పరిశ్రమలో 40 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. మిలిటరీ గెటప్లో వెంకటేష్ చూపించిన గాంభీర్యం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది.అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్అనిల్ రావిపూడి అనగానే గుర్తొచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి ఈసారి భారీ యాక్షన్, ఆర్మీ నేపథ్యాన్ని జోడించి సినిమాను అత్యున్నత ప్రమాణాలతో మలుస్తున్నారు. ఇందులో వెంకటేష్కు

విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో షూటింగ్ను ఎలాంటి బ్రేక్ లేకుండా శరవేగంగా పూర్తి చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమైంది. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అనిల్ క్షణం తీరక లేకుండా సినిమా షూటింగ్ చేస్తున్నారట. ఆదివారాలు, సెలవులు అనే తేడా లేకుండా టీమ్ షూటింగ్ చేస్తోందట. సంక్రాంతి విడుదలను టార్గెట్గా పెట్టుకుని వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పూర్తయిన సన్నివేశాల అవుట్పుట్ కూడా అద్భుతంగా వస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ప్రాజెక్ట్ విషయంలో నిర్మాణ సంస్థ, దర్శకుడు ఎక్కడా రాజీపడటం లేదని తెలుస్తోంది. భారీ స్కేల్తో పాటు అత్యున్నత నిర్మాణ విలువలను పాటిస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేలా ప్రతి అంశాన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. (VenkyANIL5 - #NKRAR2) అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్కు ఈసారి మరింత భారీ స్కేల్ను జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెంకటేష్–కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో వెంకటేష్ ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’ అనే పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 #NKRAR2 భారీ వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటూ శరవేగంగా ముందుకు సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్కు అద్భుతమైన స్పందన లభించింది. ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్లో, సన్గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి పవర్ ఫుల్ గా కనిపించారు. ఓ రగ్గడ్ SUV పక్కన నిల్చున్న ఆయన లుక్లో ఇంటెన్సిటీ అదిరిపోయింది. ఈ లుక్తో వెంకటేష్ ఓ రగ్గడ్ మిలటరీ ఆఫీసర్గా కనిపించబోతున్నారనే విషయం అర్థమవుతోంది. పోస్టర్లో వెంకటేష్ పాత్రను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేశారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆయన కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్లో నిపుణుడిగా కనిపించనున్నారు. బ్యాక్డ్రాప్లో కనిపించే ఆర్మీ ఇన్సిగ్నియా, క్రాస్డ్ స్వోర్డ్స్ ఎంబ్లమ్ సినిమా మిలటరీ నేపథ్యాన్ని మరింత ఎఫెక్టివ్ గా వున్నాయి. మ్యూటెడ్ బ్లూ-గ్రీన్ స్కై, రాకీ టెర్రైన్, భారీ SUVతో పోస్టర్కు అడ్వెంచరస్, దేశభక్తి టచ్ వచ్చింది. ఎర్తీ క్యామోఫ్లేజ్ టోన్స్ కూడా ఈ రగ్గడ్ లుక్కు చక్కగా సరిపోయాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వారి మధ్య ఉండే కెమిస్ట్రీ, కామెడీ.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్కు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్కు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా

తెలుగు చిత్రసీమలో విక్టరీ వెంకటేష్ తన సినీ ప్రస్థానంలో 40 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. 1986 ఆగస్టు 14న కలియుగ పాండవులు సినిమాతో కథానాయకుడిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన, సరిగ్గా నాలుగు దశాబ్దాల తర్వాత అదే తేదీన అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆగస్టు 14న దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గరపటి, సురేష్ ప్రొడక్షన్స్ బృందం సంయుక్తంగా ఆయన కొత్త చిత్రాన్ని ప్రకటించాయి. ఈ ప్రత్యేక సందర్భంగా వెంకటేష్ను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేస్తూ శక్తివంతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. వెంకటేష్ 1986లో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించి బ్రహ్మపుత్రుడు, స్వర్ణకమలం, ప్రేమ, బొబ్బిలి రాజా, చంటి, దృశ్యం, గురు, ఎఫ్2 వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలతో అలరించారు. కుటుంబ కథా చిత్రాల నుండి పవర్ ఫుల్ యాక్షన్ సినిమాల వరకు ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేసి విక్టరీ అనే బిరుదును సార్థకం చేసుకున్నారు. ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు అనేక నంది పురస్కారాలను అందుకొని నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన చిత్రం వెంకీఅనిల్5 మరియు ఎన్కేఆర్ఏఆర్2గా ప్రచారంలో ఉంది. విడుదల చేసిన పోస్టర్లో వెంకటేష్ కాంబాట్ కామోఫ్లాజ్ యూనిఫాం, సన్గ్లాసెస్, స్కార్ఫ్తో చాలా కమాండింగ్గా కనిపించారు. కౌంటర్-టెర్రరిజం మరియు హోస్టేజ్ నెగోషియేషన్లో నిపుణుడైన ఆర్మీ అధికారిగా ఆయన పాత్ర ఉండబోతోందని చిత్ర బృందం స్పష్టం చేసింది. దీంతో ఈ ఆర్మీ ఆఫీసర్ అవతార్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా బ్యాక్డ్రాప్లో ఆర్మీ ఇన్సిగ్నియా, క్రాస్డ్ స్వోర్డ్స్ సింబల్ మరియు లగ్జరీ కారు పక్కన ఆయన నిలబడి ఉన్న శైలి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి తన ఎక్స్ ఖాతాలో వెంకటేష్తో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా ఉందని రాసుకొచ్చారు

టాలీవుడ్లో సంక్రాంతి సీజన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించే పండగ కావడంతో పెద్ద హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరూ తమ సినిమాలను సంక్రాంతికే తీసుకురావాలని తహతహలాడుతుంటారు. అయితే ఈసారి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాని సినిమాలు సైతం ముందే సంక్రాంతి స్లాట్పై కర్చీఫ్ వేసేస్తున్నాయి. ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీనువైట్లతో కలిసి జార్జ్ క్రిష్ చిత్రాన్ని ఈ రోజు ప్రారంభించారు. సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. మరోవైపు రవితేజ – శ్రీవిష్ణు కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించనున్న ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లనప్పటికీ సంక్రాంతి రేసులోనే నిలపాలని దిల్ రాజు పట్టుదలతో ఉన్నారు. ఇక సీనియర్ స్టార్ హీరోలు కూడా పండగ బరిలో గట్టిగానే పోటీపడుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం సంక్రాంతికి సిద్ధమవుతోంది. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెంటిమెంట్ను కొనసాగిస్తూ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ కూడా ఇదే బరిలో ఉంది. దీనికి తోడు కోలీవుడ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ పోటీని మరింత హీటెక్కిస్తున్నాయి. కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాతో పాటు, ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న కొత్త సినిమా కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. మొత్తానికి సినిమా షూటింగ్లు పూర్తి కాకుండానే విడుదల తేదీల ప్రకటనలతో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పోరు అప్పుడే వేడెక్కింది

దర్శకుడు శ్రీను వైట్ల.. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది నాన్స్టాప్ కామెడీ, అదిరిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్లు. తెలుగు సినిమాలో కామెడీ టైమింగ్కి సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుల్లో ఆయన స్థానం ప్రత్యేకం. దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla).. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది నాన్స్టాప్ కామెడీ, అదిరిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్లు. తెలుగు సినిమాలో కామెడీ టైమింగ్కి సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుల్లో ఆయన స్థానం ప్రత్యేకం. వేగవంతమైన స్క్రీన్ప్లే, ఊహించని ట్విస్టులు, పొట్టచెక్కలయ్యే కామెడీ ట్రాక్స్తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన ఘనత ఆయన సొంతం. ‘ఆనందం’తో మొదలైన ఆయన విజయ ప్రస్థానం.. ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్షా’ లాంటి సినిమాలతో సాగింది. ఒకప్పుడు ఆయన సినిమా వస్తోందంటే చాలు.. థియేటర్లలో నవ్వుల పండగే అని సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయేవారు. ముఖ్యంగా స్టార్ హీరోలతో చేసిన సరికొత్త ప్రయోగాలు, బ్రహ్మానందం లాంటి హాస్య నటులకు రాసిన విలక్షణ పాత్రలు వెండితెరపై నవ్వుల పూలు పూయించాయి. తెలుగు కమర్షియల్ సినిమాకు ఒక సరికొత్త ఫార్ములాను సెట్ చేసిన ఘనత ఆయనది. అయితే కాలక్రమంలో ఒకే తరహా ఫార్ములా రొటీన్ అవ్వడం, కథల్లో కొత్తదనం తగ్గడంతో ఆయనకు కొన్ని వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అయినా సరే.. తన మార్క్ వినోదంతో పాటు నేటి ట్రెండ్కు తగ్గ కథనంతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా అదిరిపోయే రీ-ఎంట్రీ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు శ్రీను వైట్ల. సరైన కథ కుదిరితే ఆయన కలం, కెమెరా ఎంతటి మ్యాజిక్ చేస్తాయో ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు చూశారు. ఈ క్రమంలోనే టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand)తో సరికొత్త సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ చిత్రం అత్యంత గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాత అనిల్ సుంకర అత్యంత భారీ

శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా శుక్రవారం గ్రాండ్గా ప్రారంభమైంది. శర్వానంద్ (Sharwanand), శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా ప్రారంభమైంది. ఉదయం 9:45 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా మాజీమంత్రి తలసాని క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంతో సినిమాకు అధికారికంగా ఫస్ట్ క్లాప్ పడింది. ఈ భారీ ప్రాజెక్ట్ను.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎకె ఎంటర్టైన్మెంట్స్ (AK Entertainments) బ్యానర్పై నిర్మాత అనిల్ సుంకర (AnilSunkara) నిర్మిస్తుండగా ఈ సినిమాకు ‘జార్జ్ క్రిష్’ (George Krish) అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవల కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న శర్వానంద్.. ఈ ప్రాజెక్ట్తో మరో కొత్త జోనర్లో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు శ్రీను వైట్ల కూడా ఈ సినిమాతో బలమైన కమ్బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. కాగా దర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడు ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన మార్క్ కామెడీ, వన్లైనర్ పంచ్లతో పాటు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో కథను సిద్ధం చేసినట్లు సమాచారం. శర్వానంద్కు ఉన్న క్లాస్ అండ్ మాస్ ఇమేజ్కు శ్రీను వైట్ల స్టైల్ కామెడీ జోడైతే థియేటర్లలో మంచి ఎంటర్టైన్మెంట్ అందుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా కథ, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇప్పటికే నారీ నారీ నడుమ మురారి, బైకర్ వంటి రెండు సినిమాలతో హిట్ కొట్టిన శర్వానంద్ త్వరలోనే ముచ్చటగా మూడవ చిత్రం భోగి థియేటర్లలోకి రానుంది

భారత్ వ్యవసాయ వైవిధ్యానికి పెట్టింది పేరు. మన వంటల్లో సాధారణంగా ఉపయోగించే మసాలాల నుంచి.. అరుదుగా లభించే విలువైన గింజలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల వరకు ఎన్నో ప్రత్యేకమైన పదార్థాలు ఇక్కడ పండుతాయి. వీటిలో కొన్నింటి ధరలు సాధారణ పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్రత్యేక వాతావరణం, పరిమిత దిగుబడి, సాగులో ఉండే శ్రమ వంటి కారణాలతో ఖరీదైనవిగా మారిన భారత్లోని 9 ఆహార పదార్థాలేంటో చూద్దాం.1. కశ్మీరీ కుంకుమపువ్వుకశ్మీర్లోని పాంపోర్ ప్రాంతంలో ప్రధానంగా సాగు చేసే కుంకుమపువ్వును ‘ఎర్ర బంగారం’గా పిలుస్తారు. కుంకుమ పువ్వులోని సున్నితమైన ఎర్రని కేశరాలను చేతితోనే సేకరించాలి. ఒక్కో పువ్వు నుంచి చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఇది లభిస్తుంది. దీంతో దీని సాగు, కోత చాలా శ్రమతో కూడుకున్నది. నాణ్యమైన కశ్మీరీ కుంకుమపువ్వు కొన్ని గ్రాములకే రూ.వేలు పలుకుతుంది.2. పచ్చి యాలకులుటీ, బిర్యానీ, స్వీట్లలో కొద్దిగా మాత్రమే ఉపయోగించినా పచ్చి యాలకులు ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. కేరళ, కర్ణాటక, తమిళనాడులో వీటి సాగు ఎక్కువగా జరుగుతుంది. వెచ్చని, తేమతో కూడిన వాతావరణంతో పాటు ప్రత్యేకమైన సంరక్షణ అవసరం. యాలకులను సరైన దశలోనే కోయాలి. ఘాటు సువాసన, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ వీటి ధరను పెంచుతాయి.3. సహజ వెనిల్లావెనిల్లా రుచి కలిగిన ఉత్పత్తులు ఎన్నో ఉన్నప్పటికీ సహజ వెనిల్లా మాత్రం చాలా ఖరీదైన పదార్థం. కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో దీనిని సాగు చేస్తారు. వెనిల్లా పువ్వులకు సాధారణంగా చేతితోనే పరాగసంపర్కం చేయాల్సి ఉంటుంది. కోత తర్వాత

On This Day: భారత క్రికెట్ చరిత్రలో ఆగస్టు 10వ తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2007 జూలై-ఆగస్టు కాలంలో టీమిండియా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్లో పర్యటించింది. ది ఓవల్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు, ఇంగ్లాండ్ బౌలింగ్ను చీల్చిచెండాడుతూ బోర్డుపై ఏకంగా 664 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఆగస్టు 9న ప్రారంభమైన ఈ టెస్టులో భారత జట్టు రెండో రోజున 664 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్లో అత్యంత ప్రధాన విశేషం ఏంటంటే.. నంబర్ 8 స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అద్భుతమైన సెంచరీ సాధించడం. కుంబ్లే 16 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 110 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ సెంచరీతో ఓవల్ మైదానంలో సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆసియా ఆటగాడిగా కుంబ్లే సరికొత్త రికార్డు సృష్టించాడు. సెంచరీ చేసే సమయానికి ఆయన వయస్సు 36 సంవత్సరాల 296 రోజులు. ఈ ఇన్నింగ్స్లో భారత అగ్రశ్రేణి బ్యాటర్లంతా రాణించారు. ఎంఎస్ ధోనీ (92), దినేష్ కార్తీక్ (91), సచిన్ టెండూల్కర్ (82), రాహుల్ ద్రావిడ్ (55), వీవీఎస్ లక్ష్మణ్ (51) హాఫ్ సెంచరీలతో మెరిశారు. వీరితో పాటు వసీమ్ జాఫర్ (35), సౌరవ్ గంగూలీ (37), జహీర్ ఖాన్ (11), ఆర్పీ సింగ్ (11), శ్రీశాంత్ (35) పరుగులు చేశారు. గడిచిన 50 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే, జట్టులోని 11 మంది ఆటగాళ్లూ డబుల్ డిజిట్ (కనీసం 10 పరుగులు) దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత జట్టు భారీ స్కోరు సాధించినప్పటికీ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 345 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్, ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 180/6 వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు 500

Mucchukota: ముచ్చుకోట వద్ద ఉద్రిక్తత రోడ్డుపై వైకాపా నేతల బైఠాయింపు! ఈ వార్తకు సంబంధించిన