
© 2026 nimisham.in


Eiffel Tower Shut : ఈఫిల్ టవర్ ఘటనపై ఫ్రాన్స్లో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద హిందు బృందం పర్యటన నేపథ్యంలో మహిళా ఉద్యోగులను పక్కన పెట్టారన్న ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
ఈ ఘటనకు నిరసనగా టవర్ సిబ్బంది సమ్మెకు దిగారు. దాంతో ఒక రోజంతా ఈఫిల్ టవర్ మూసివేయాల్సి వచ్చింది. మంగళవారం నుంచి సాధారణ కార్యకలాపాలు కొనసాగుతాయని సిబ్బంది ప్రతినిధి తెలిపారు.
పారిస్ శివారులోని హిందూ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు BAPS (బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ) బృందం ఫ్రాన్స్కు వచ్చింది. సుమారు 100 మంది హిందూ గ్రూపు ప్రతినిధులు గత వారం ఈఫిల్ టవర్ను సందర్శించారు.
మహిళలను కనిపించొద్దని ఆదేశాలు జారీ : మహిళలనే కారణం చూపి తమను పక్కన పెట్టేలా వృత్తిపరమైన ఆదేశాలు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని సిబ్బంది తీవ్రంగా మండిపడ్డారు. కొందరిని తమ పని ప్రదేశాల నుంచి ఇతర ప్రాంతాలకు పంపించారని, ప్రతినిధి బృందం ఉన్న సమయంలో కొన్ని మార్గాల్లో మహిళా ఉద్యోగులు వెళ్లకూడదని ఆదేశించినట్లు వెల్లడించారు.
ఈ పర్యటన సందర్భంగా మహిళా ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందిలోని మహిళలను కొన్ని ప్రాంతాల నుంచి తప్పుకోవాల్సిందిగా, వారి స్థానాల్లో పురుషులను నియమించాలని ఆదేశించారని అక్కడి ఉద్యోగులు ఆరోపించారు.






