TV9 Telugu · 29 May 2026
షాక్ లో సినీ డైరెక్టర్లు! 66 హార్డ్ డిస్క్ లు మాయం
దర్శకులు జోయా అక్తర్, రీమా కాగ్తీకి ఊహించని షాక్ తగిలింది. ముంబైలోని వారి ప్రొడక్షన్ కంపెనీ ‘టైగర్ బేబీ ఆఫీసులో హార్డ్ డిస్క్లు దొంగతనానికి గురయ్యాయి. ఈ చోరీ ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇంకా విడుదల కాని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు, పెద్ద బ్రాండ్లకు సంబంధించిన యాడ్ షూట్స్, డిజిటల్ ఫుటేజ్ ఉన్న 66 హార్డ్ డిస్క్లు ఆఫీస్ నుంచి మాయం కావడం అందరినీ షాకయ్యేలా చేసింది. ఈ హార్డ్ డిస్క్ల మార్కెట్ విలువే 13 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఒరిజినల్ డేటా గనుక లీక్ అయితే, ఆ నష్టం వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దొంగతనం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.మొత్తం 119 హార్డ్ డిస్క్ల ఇన్వెంటరీ ఉండగా, అందులో 66 డిస్క్లు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ సాదాసీదా స్టోరేజ్ డివైజ్లు కావు, వీటి సామర్థ్యం ఒక్కొక్కటి 16 TB నుంచి ఏకంగా 72 TB వరకు ఉంటుంది. ఈ భారీ స్టోరేజ్ డిస్క్లలో షూటింగ్కు సంబంధించిన రా ఫుటేజ్, రఫ్ ఎడిట్స్, సీన్ కట్స్, పోస్ట్-ప్రొడక్షన్ మెటీరియల్ , గతంలో ఘన విజయం సాధించిన ప్రాజెక్టుల తాలూకు బ్యాకప్ డేటా భద్రపరిచారు. వీటిలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సూపర్ హిట్ అయిన ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్, నెట్ఫ్లిక్స్లో వచ్చిన ‘ఘోస్ట్ స్టోరీస్’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఫైల్స్ ఉన్నాయి. అయితే, ఆఫీస్ క్యాబినెట్లో భద్రంగా ఉండాల్సిన ఆ డిస్క్లను మాయం చేసి, యాజమాన్యానికి అనుమానం రాకుండా ఉండేందుకు దొంగలు వాటి స్థానంలో ఖాళీగా ఉన్న బాక్సులని, కొన్ని పాడైపోయిన డబ్బాలని ఉంచారు. ఈ