
స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ యుగంలో పిల్లల చేతికి పరికరాలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరించే విచిత్రమైన, విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. తన యూట్యూబ్ వీడియోలకు ఎక్కువ వ్యూస్ రావాలన్న తాపత్రయంతో ఓ తొమ్మిదేళ్ల బాలుడు చేసిన పనికి తండ్రి ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది. యూట్యూబ్ ప్రకటనల కోసం ఏకంగా రూ. కోటికి పైగా ఖర్చు చేసేశాడు. డేవ్ అనే వ్యక్తి తొమ్మిదేళ్ల కుమారుడు మైక్.. మైటీ మైక్ ప్లేస్ పేరిట ఒక గేమింగ్ యూట్యూబ్ ఛానెల్ను నడుపుతున్నాడు. అందులో రోబ్లాక్స్, మైన్క్రాఫ్ట్ వంటి ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ వీడియోలు అప్లోడ్ చేసేవాడు.