
స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తుండడంతో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త నియామకంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించింది. సమన్వయకర్తగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు ఇటీవల పార్టీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై అధిష్ఠానం తర్జనభర్జన పడుతోంది.





