
వినాయక చవితి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ఎన్నో పౌరాణిక కథలు, చారిత్రక సంఘటనలు, సామాజిక ఐక్యతను పెంపొందించే ఒక గొప్ప ఉత్సవం. దాదాపుగా 50కి పైగా పండుగలను జరుపుకునే హిందువులు, వినాయక చవితిని మాత్రం ప్రతి వీధిలో ఒక విగ్రహాన్ని పెట్టి, మూడు రోజుల నుండి 10 రోజుల వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ పండగ వెనక కొన్ని పౌరానిక కథలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు అజేయమైన విజయాల కోసం పరమేశ్వరుడి కొరకు ఘోర తపస్సు చేశాడట.దీంతో గజాసురుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన శివుడు ఏం వరం కావాలని కొరగా.. గజాసురుడు మీరు ఎప్పటికీ నా కడుపులోనే ఉండిపోవాలి అని కోరాడు. దీంతో తదాస్తు అన్న శివుడు ఇచ్చిన వరం మేరకు సూక్ష్మ రూపంలోకి మారి గజాసురుడి కడుపులోకి వెళ్లిపోతాడు.





