
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది. సాయంత్రం ఆలయంలో సేనాధిపతి విష్వక్సేనుడిని అలంకరించి విశేష సమర్పణ, అనంతరం తిరుచ్చిలో ఆశీనులను చేస్తారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థిస్తారు.




