
తెలంగాణ ప్రభుత్వ పాలన, కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయాలపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్లో సీఎం పదవి కోసం పోటీ మొదలైందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణ శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తరహాలో మారే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.




