
కేసీఆర్ ఫాంహౌస్పై విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో ఉన్న ప్రైవేటు భూమి ఎంత, ప్రభుత్వ భూమి ఎంత అనే లెక్క తేల్చాలని కలెక్టర్, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణ పర్యవేక్షణ బాధ్యతను ముగ్గురు మంత్రులకు అప్పగించారు. నెలరోజుల్లోగా కేసీఆర్ ఫాంహౌస్ భూముల లెక్కలు తీయకపోతే అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి తేలితే.. అక్కడే దళితులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు.