
మన దేశంలో పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఇంటి పూజా మందిరాల్లో ఇత్తడి, రాగి పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే కొందరు భక్తులు దేవుడికి అభిషేకం చేయడానికి, నైవేద్యం పెట్టడానికి, పంచామృతం సమర్పించడం సహా చాలా పూజా కార్యక్రమాల్లో వెండి పాత్రలను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. వెండిని పూజా కార్యక్రమాల్లో పవిత్రమైన లోహంగా భావించడానికి కొన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్యపరమైన కారణాలు ఉన్నాయి.





