
వెస్టిండీస్తో స్వదేశంలో జరిగే వన్డే, టీ20 సిరీస్లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. గిల్ సారథ్యంలోని వన్డే జట్టులో రోహిత్, కోహ్లీలతో పాటు కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నాడు. తెలుగు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని ఆసియా క్రీడల నుంచి తప్పించి, వన్డే జట్టులోకి తీసుకున్నారు. నమన్ ధీర్, ఆకిబ్ నబీ కొత్తగా జట్టులోకి రాగా, పంత్కు చోటు దక్కలేదు. గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో విప్రాజ్ నిగమ్ ఏషియన్ గేమ్స్ జట్టులోకి వచ్చాడు.