
ముఖ్యమంత్రి ఈ నెల 19వ తేదీన నగర పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో 26,426 మందికి ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. అక్కడ ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పర్యవేక్షించారు. ప్రధాన వేదిక, లబ్ధిదారుల గ్యాలరీలు, పార్కింగ్, భోజన, తాగునీటి సరఫరా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.




