
బాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక రామాయణం పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా పోస్టర్ విడుదల కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీతారాములుగా రణ్బీర్ కపూర్, సాయి పల్లవి కనిపించి కనిపించి ఆకట్టుకోనున్నారు. తాజాగా రామాయణం సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ను గణేశ్ చతుర్థి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపించారు. నదీ తీరంలో సీతారాములు ఆప్యాయంగా గడుపుతున్న అందమైన క్షణాన్ని ఈ పోస్టర్లో చూపించారు.




