
ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న 2వ టీ20లో భారత బౌలర్లు చెలరేగారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, ఆఫ్ఘనిస్థాన్ను 20 ఓవర్లలో 159/8 పరుగులకే పరిమితం చేసింది. తెలుగు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (3/24) టాప్ వికెట్టేకర్గా నిలిచాడు. అర్ష్దీప్ సింగ్ 2, బుమ్రా, అక్షర్, రవి బిష్ణోయ్లు చెరో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో కెప్టెన్ జద్రాన్ (37), రషీద్ ఖాన్ (28) రాణించారు. ఈ సిరీస్ తొలి మ్యాచులో భారత్ విజయం సాధించింది.