
ఐరోపాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ నాటో వైమానిక దళాలకు ఒక వింత అనుభవం ఎదురైంది. లిథువేనియా గగనతలంలో రాడార్ వ్యవస్థలు గుర్తించిన కదలికలను డ్రోన్ల దండుగా భావించిన నాటో.. అత్యవసరంగా విల్నియస్ విమానాశ్రయాన్ని మూసివేసి యుద్ధ విమానాలను గాల్లోకి పంపింది. అయితే తీరా ఆ దండు వద్దకు వెళ్లి చూసిన పైలట్లు అవి డ్రోన్లు కావు.. కేవలం పక్షుల గుంపు అని తేల్చడంతో అధికారులు హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.





