
Media | హైదరాబాద్ కుత్బుల్లాపూర్ జలమండలి విభాగంలో మీటర్ రీడర్గా పనిచేస్తున్న కిరణ్ అనే వ్యక్తి జీతాలు రాక గుండెపోటుతో మృతి చెందాడని తెలిసిందే. కొద్ది రోజులుగా జలమండలి కార్మికుల సమ్మెలో పాల్గొంటున్న కిరణ్.. అధికారుల వేధింపులు, జీతాలు రాకపోవడం, ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆవేదనకు గురైనట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. రోజూ సమ్మెలో పాల్గొంటూ తెలంగాణ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందాడని పేర్కొన్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ – బాలానగర్ సమీపంలోని ఫతేనగర్లో నిరసనలో పాల్గొని వచ్చాక గుండెపోటుతో చనిపోయిన జలమండలి మీటర్ రీడర్ కిరణ్ ముదిరాజ్ ఇంటి వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ తీరు వల్లే చనిపోయాడంటూ, న్యాయం చేయాలంటూ వచ్చిన తోటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కవర్ చేస్తున్న మీడియాపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
ఓ వైపు మీడియా ప్రతినిధులపై విరుచుకుపడుతూనే.. మరోవైపు ఉద్యోగులను గళ్ల పట్టుకుని లాక్కెళ్లడం వీడియోలో చూడొచ్చు. పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం చేస్తున్నప్పటికీ వినకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహరించడం చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో కాంగ్రెస్ సర్కార్లో ఖాకీల అరాచకం ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది.
మీడియాపై పోలీసుల దౌర్జన్యం
హైదరాబాద్ – బాలానగర్ సమీపంలోని ఫతేనగర్లో నిరసనలో పాల్గొని వచ్చాక గుండెపోటుతో చనిపోయిన జలమండలి మీటర్ రీడర్ కిరణ్ ముదిరాజ్ ఇంటి వద్ద పోలీసుల అత్యుత్సాహం
ప్రభుత్వ తీరు వల్లే చనిపోయాడంటూ, న్యాయం చేయాలంటూ వచ్చిన తోటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కవర్… https://t.co/KcLMx7Y0MW pic.twitter.com/af2lOVpMOT
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2026
Indonesia | 240 మందితో వెళ్తున్న పడవ ఇండోనేషియా తీరంలో గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Low-voltage | నిజాంపేటలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని రైతుల ఆందోళన
Grade-1 Fatty Liver | గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి..?





