
‘డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా!? ప్లేస్ నువ్వు చెబుతావా! నన్ను చెప్పమంటావా!?’ అని వైసీపీ అధినేత జగన్కు మంత్రి లోకేశ్ మరోసారి సవాల్ విసిరారు. ఆయనకు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఆయనలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేయడం రాష్ట్రానికే అవమానమన్నారు. ‘జగన్ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నారు.





