
తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు జనసేన వడివడిగా అడుగులు ముందుకేస్తుంది. ‘జనసేన తెలంగాణ శంఖారావం’ పేరుతో ఖమ్మంలో సభను నిర్వహించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకేంద్రంలో జనసేన జెండానే ఎగురుతుందని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ గడల శ్రీనివాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.




