
రామాయపట్నం పోర్టు సమీపంలో భారీ పెట్టుబడులతో చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను సీఎం చంద్రబాబు కోరారు. ఆ రిఫైనరీ సమీపంలో డౌన్స్ట్రీమ్ (శుద్ధి చేసి వినియోగానికి సిద్ధంగా ఉన్న) పెట్రో కెమికల్ పార్క్ను ఏర్పాటు చేయాలని తాజాగా ప్రతిపాదించారు.



