
ఓటుకు నోటు’ వ్యవహారంలో రేవంత్రెడ్డిపై నమోదైన కేసు చట్ట ప్రకారం చెల్లదని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2015లో అమల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టం ప్రకారం.. లంచం ఇవ్వజూపడం అనేది నేరుగా నేరం కిందకు రాదని, అది కేవలం ప్రేరేపించడం కిందకే వస్తుందని ఆయన వాదించారు.
Found this helpful?