
Asia Cup 2026: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై భారత జట్లు తమ దేశభక్తిని, నిబద్ధతను మరోసారి చాటిచెప్పాయి. గత ఏడాది మన దేశ పురుషుల జట్టు ఏ విధంగా అయితే వ్యవహరించిందో ఇప్పుడు మహిళా క్రికెటర్లు కూడా అదే పద్ధతిని పాటించారు. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ తుది పోరులో శ్రీలంక జట్టును చిత్తు చేసి అద్భుత విజయాన్ని అందుకున్నారు. కానీ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ సాహసోపేత నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల నుంచి అపారమైన ప్రశంసలను అందుకుంటోంది.





