
అమరావతి, సెప్టెంబర్ 14: ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మాడి (PB) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఏపీపీజీఈసెట్ (APPGECET), గేట్ (GATE), జీప్యాట్ (GPAT) అర్హత కలిగిన అభ్యర్థులకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తదితర ప్రక్రియలు కొనసాగుతాయి.




