
ప్రకృతి కంటికి కనిపించని రౌద్రరూపం దాల్చితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేపాల్‌లో వచ్చిన వరదలే నిదర్శనంగా నిలిచాయి. వరదల ధాటికి అతలాకుతలమైన పొరుగు దేశం నేపాల్‌లో బాధితులను పరామర్శించేందుకు రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్ నేరుగా రంగంలోకి దిగారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న త్రిశూలి బజార్ ప్రాంతాన్ని ఆయన పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధితులను కలిసిన ఆయన వారి కష్టాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పొరుగు దేశానికి అండగా నిలుస్తూ భారత్ అందిస్తున్న సహాయాన్ని సోనూసూద్ మనస్ఫూర్తిగా కొనియాడారు.మనసారా మెచ్చుకున్న సోనూసూద్నేపాల్‌లో విపత్తు తీవ్రత ఊహించని స్థాయిలో ఉందని, అక్కడి ప్రజలు మళ్లీ సాధారణ జీవితానికి రావడానికి చాలా సమయం పడుతుందని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌కి అందిస్తున్న సహాయం నిజంగా అభినందనీయం. నేపాల్ మళ్లీ సొంత కాళ్లపై నిలబడాలంటే ఈ సహాయం ఇలాగే కొనసాగాలి. నేను స్వయంగా ఇక్కడి కుటుంబాలను కలిసిన తర్వాత అర్థమైంది ఏమిటంటే.. ఈ సమస్య కొద్ది వారాల్లోనో, నెలల్లోనో తీరేది కాదు. మనం నిరంతరం అండగా ఉంటేనే వాళ్లు కోలుకోగలరు అని మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. Nepal flash floods: దేవుడిలా వచ్చి 1,643 మంది పిల్లల్ని కాపాడి.. రియల్ హీరో1,127కు చేరిన మృతుల సంఖ్యనేపాల్‌లో సంభవించిన ఈ జలప్రళయంలో ప్రాణనష్టం ఊహించని రీతిలో ఉంది. నేపాల్ పోలీసుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు మృతుల సంఖ్య ఏకంగా 1,127కు చేరింది. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా, తనహున్, నావల్‌పరాసి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దొరికిన మృతదేహాల్లో ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగలిగారు. మరికొన్ని మృతదేహాలు సరిహద్దులు దాటి భారత్‌లో కూడా లభ్యమవడం విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది.మృత్యువుకు 30 సెకన్ల దూరం! ఒకే ఒక్క మెసేజ్ 8 మంది ప్రాణాలు కాపాడిందిడీఎన్ఏ శాంపిల్స్‌తో గుర్తింపు ప్రక్రియ.గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాల ఆధారాలను భద్రపరిచేందుకు నేపాల్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. డీఎన్ఏ శాంపిల్స్ సేకరించి, చట్టబద్ధంగా సైంటిఫిక్ పద్ధతుల్లో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామని నేపాల్ ప్రధాని బాເລంద్ర షా తెలిపారు. నేపాల్ ఆర్మీ, పోలీసులతో పాటు ఏఆర్‌ఎఫ్‌ బలగాలు రెస్క్యూ ఆపరేషన్లలో అహోరాత్రులు శ్రమిస్తున్నాయి. ప్రధానంగా భారీ వరదలకు గురైన భోటే కోషి నదీ తీరంలోని హైడ్రో పవర్ ప్రాజెక్టుల వద్ద చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత్, చైనాల నుంచి వచ్చిన ప్రత్యేక అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.





