
ఇరాన్తో తాము ‘పాక్షికంగానే చర్చలు’ జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై కొత్తగా సైనిక చర్యకు ఆదేశించే బదులు, ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచడానికే తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. యాక్సియోస్ వార్తా సంస్థతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్, ఈ విషయాన్ని తాము పెద్దదిగా చేయడం లేదని అన్నారు. ఆర్థికంగా ఇరాన్ చాలా బలహీనమైన స్థితిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను నియంత్రించేందుకు అమెరికా, ఇరాన్, ఒమన్ మధ్య ఒక ఒప్పందం కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి కూడా స్పందించారు. హర్మూజ్ జలసంధిలో తాత్కాలిక సముద్ర మార్గం ఏర్పాటుపై ఒమన్తో తాము ఒక ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించడం ఆపేంత వరకు ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అరాఘ్చి ఆదివారం టెహ్రాన్లో స్పష్టం చేశారు.అయితే, ట్రంప్ వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గత మంగళవారం ఆయన హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్తో తాము చాలా మంచి చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కానీ, వాషింగ్టన్తో ఎలాంటి చర్చలు జరగడం లేదని టెహ్రాన్ వెంటనే ఖండించింది. సోమవారం కూడా ట్రంప్ మాట్లాడుతూ.. "శిరచ్ఛేదం చేసే ముందు ఇరాన్కు


























.webp)
