
అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటీవల ఒమన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల నడుమ చర్చలు జరుగుతున్నాయనే వార్తలు రాగానే, గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కాస్త తగ్గాయి. అయితే, ఈ హెచ్చుతగ్గుల మధ్య వారంలో మొదటి రోజే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పైకి లేచాయి. దీనికి ప్రధాన కారణం ప్రసిద్ధ 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' ను తిరిగి తెరిచే విషయంలో ఉన్న అయోమయమే. ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కొత్త సముద్ర మార్గాన్ని ఖరారు చేసేందుకు ఒమన్తో ఒప్పందం చివరి దశలో ఉంది. కానీ, అమెరికా ముందుగా తమ మిగిలిన షరతులను నెరవేర్చాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 91 సెంట్లు అంటే 1.09 శాతం పెరిగి బ్యారెల్కు 84.46 డాలర్లకు చేరుకుంది. అలాగే, అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 61 సెంట్లు అంటే 0.78 శాతం పెరిగి బ్యారెల్కు 78.79 డాలర్లుగా నమోదైంది. గత వారం ఇరాన్, ఒమన్ మధ్య ఒప్పందం కుదిరిందనే వార్తల తర్వాత ఆయిల్ ధరలు ఏకంగా 7 శాతానికి పైగా పడిపోయాయి. ఆ సమయంలో హోర్ముజ్ జలసంధి త్వరలోనే తెరుచుకుంటుందని అంతా భావించారు. సాధారణంగా, యుద్ధ పరిస్థితులకు ముందు ప్రపంచవ్యాప్త చమురు అవసరాలలో దాదాపు 20 శాతం ముడి చమురు ఈ హోర్ముజ్ మార్గం ద్వారానే రవాణా అయ్యేది. అయితే, ఆ తర్వాత ఇరాన్ ఇచ్చిన ఒక కొత్త ప్రకటన మార్కెట్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. జూన్ దాడి వల్ల జరిగిన నష్టానికి అమెరికా పరిహారం చెల్లించడంతో పాటు, తమ మిగిలిన షరతులన్నింటినీ పాటిస్తేనే హోర్ముజ్ను తెరుస్తామని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ప్రస్తుతం మార్కెట్ విశ్లేషకులు, వ్యాపారులు కేవలం











