© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) విమానయాన సంస్థలు, ప్రయాణికులకు హెచ్చరికలు చేశారు. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడులు చేపట్టడానికి సిద్ధమైనట్లు ప్రకటించారు. ఏ క్షణమైనా డ్రోన్లు ప్రయోగించే అవకాశం ఉందని.. రష్యా గగనతలం (Russian Airspace) పౌర విమానయానానికి సురక్షితం కాదని పేర్కొన్నారు. ఎవరూ ఆ ప్రాంతంలో ప్రయాణించొద్దని సూచించారు. మాస్కోలోని విమానాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. పౌర విమానాలు తమ టార్గెట్ కాదని.. అందుకే ఈ బహిరంగ ప్రకటన చేశామన్నారు. విదేశీ ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని జెలెన్స్కీ కోరారు. దాడుల నేపథ్యంలో రష్యా తమ గగనతలాన్ని మూసివేసే అవకాశం ఉందన్నారు. వారు ప్రారంభించిన యుద్ధం వల్లే ఆ దేశానికి ఈ పరిస్థితి ఎదురయ్యిందని పేర్కొన్నారు. జెలెన్స్కీ ప్రకటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) మండిపడ్డారు. వారు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు పునఃప్రారంభించాలని తమపై ఎంత ఒత్తిడి చేసినా.. ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కాగా మంగళవారం రాత్రి కీవ్పై రష్యా చేసిన దాడుల్లో 12మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.