
Namibia vs Zimbabwe Records: టీ20 క్రికెట్లో రికార్డులు బద్దలవడం సహజమే. కానీ ఒకే మ్యాచ్లో ఒకే రికార్డు రెండుసార్లు బద్దలవడం మాత్రం అరుదైన విషయమే. జింబాబ్వే-నమీబియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో ఇదే జరిగింది. ఏడో వికెట్కు అత్యధిక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రపంచ రికార్డు ఒకే మ్యాచ్లో రెండుసార్లు కొత్త రూపు దాల్చింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఒక దశలో 101 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రియాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్ జట్టును ఆదుకున్నారు. ఏడో వికెట్కు కేవలం 48 బంతుల్లోనే అజేయంగా 94 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఏడో వికెట్కు అత్యధిక భాగస్వామ్య రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. అంతకుముందు 2021లో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేనియల్ సామ్స్, మార్కస్ స్టోయినిస్ నెలకొల్పిన 92 పరుగుల రికార్డును అధిగమించారు. బర్ల్ 32 బంతుల్లో 57 పరుగులతో అజేయంగా నిలవగా.. ఎవాన్స్ 24 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా ఆరంభంలో తడబడింది. కానీ ఏడో వికెట్కు వచ్చిన జేన్ గ్రీన్, అలెగ్జాండర్ బుసింగ్-వోల్చెంక్ అద్భుత పోరాటం చేశారు. ఇద్దరూ జింబాబ్వే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ కేవలం 51 బంతుల్లో 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో కొద్దిసేపటి క్రితమే బర్ల్-ఎవాన్స్ నెలకొల్పిన 94 పరుగుల ప్రపంచ రికార్డు మళ్లీ బద్దలైంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఏడో వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నమోదైంది. వోల్చెంక్ 29 బంతుల్లో 56 పరుగులతో చెలరేగగా.. గ్రీన్ కూడా వేగంగా పరుగులు సాధించాడు. నమీబియా విజయానికి చేరువగా వచ్చినా చివరి దశలో వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో నమీబియాకు 16 పరుగులు అవసరమయ్యాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఆ ఓవర్లో