
కలసపాడు: వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద బుధవారం డీటీఆర్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో దాదాపు 40 కుటుంబాలకు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎస్పీడీసీఎల్ ఏఈ ఎం. చిన్నయ్య వెంటనే స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన కొత్త డీటీఆర్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తెప్పించి ఏర్పాటు చేయించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టిన ఏ ఈ చిన్నయ్య, విద్యుత్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.