
కలసపాడు: వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలోని పలు వీధుల్లో అధికారులు ఎల్ఈడీ వీధి దీపాలకు మరమ్మతులు చేయించారు. ఈనెల 12న కాలిపోయిన వీధి దీపాలతో అవస్థలు అనే శీర్షికన ‘ఈనాడు.నెట్’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎంపీడీవో మహబూబ్ బీ, పీడీవో సదాశివరెడ్డి.. సిబ్బందితో కలిసి సమస్యను పరిష్కరించారు. బలిజ వీధితో పాటు ఇతర వీధుల్లో ఉన్న వీధి దీపాలకు మరమ్మతులు చేయించారు. కాలిపోయిన వాటి స్థానంలో కొత్త ఎల్ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేయించి సమస్యను పరిష్కరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.