
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బరిలోకి దిగడం ద్వారా అతను భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సంజయ్ మంజ్రేకర్ క్లబ్లోకి చేరాడు. జైస్వాల్ తన కెరీర్లో ఆడిన 30 టెస్టులను 30 వేర్వేరు వేదికలపై ఆడటం విశేషం. గతంలో సంజయ్ మంజ్రేకర్ వరుసగా 33 టెస్టులు, సచిన్ టెండూల్కర్ 32 టెస్టులు వేర్వేరు మైదానాల్లో ఆడి ఈ జాబితాలో ముందున్నారు.అయితే, ఈ ప్రత్యేక మ్యాచ్లో జైస్వాల్కు నిరాశే ఎదురైంది. 32 పరుగులు చేసిన అతను, కేఎల్ రాహుల్తో సమన్వయ లోపం కారణంగా రనౌట్గా వెనుదిరిగాడు. సింగిల్ తీసే ప్రయత్నంలో ఫీల్డర్ అడ్డురావడంతో జైస్వాల్ జారిపడగా, ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్కు చేరుకున్నారు. దీంతో జైస్వాల్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. టెస్టుల్లో అతను రనౌట్ కావడం ఇది మూడోసారి.మరోవైపు, ఈ మ్యాచ్లో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తన అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. వన్డౌన్లో బరిలోకి దిగిన పడిక్కల్, తన తొలి టెస్ట్ శతకాన్ని నమోదు చేశాడు. శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 134 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో కేఎల్ రాహుల్ కూడా నిలకడగా ఆడి 77 పరుగులు చేశాడు. అయితే, కండరాల నొప్పితో అతను రిటైర్డ్ హర్ట్గా మైదానాన్ని వీడాడు.పడిక్కల్ సెంచరీ భారత జట్టుకు ఎంతో కీలకంగా మారింది. 2024 సెప్టెంబర్లో శుభ్మన్ గిల్ తర్వాత, భారత జట్టు తరఫున వన్డౌన్లో సెంచరీ