
కృత్రిమ మేధ (ఏఐ) భారత్లో వ్యవసాయం నుంచి వైద్యం వరకు ఎన్నో రంగాల్లో ఉపయోగపడుతోంది. రైతులకు వాతావరణ సమాచారం అందించడం, పంట నష్టాలను తగ్గించడం, క్షయ వ్యాధిని గుర్తించడం వంటి పనుల్లో ఏఐ మంచి ఫలితాలు ఇస్తోందని ప్రపంచ బ్యాంకు తన 2026 ప్రపంచ అభివృద్ధి నివేదికలో తెలిపింది. అయితే కాల్ సెంటర్లు, సాఫ్ట్వేర్, ఆర్థిక సేవల్లో ప్రారంభ స్థాయి ఉద్యోగాలకు ఏఐ ముప్పుగా మారొచ్చని హెచ్చరించింది.తెలంగాణలో ఏఐ ఆధారిత వాతావరణ అంచనా వ్యవస్థ చిన్న రైతులకు ఉపయోగపడిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ నిర్ణయాలు మార్చుకున్నారు. కొందరు వ్యవసాయంపై పెట్టుబడిని మూడో వంతు వరకు పెంచగా.. మరికొందరికి ఒక్కో రైతుకు 560 డాలర్ల వరకు ఆదా అయింది.ఒడిశాలో 2018లో ప్రారంభమైన ‘ఆమా కృషి’ కార్యక్రమం ఇప్పుడు ‘కృషి సమృద్ధి’గా కొనసాగుతోంది. ఏఐ సలహాలతో రైతులకు సూచనలు అందిస్తోంది. 2022లో సుమారు 30 లక్షల మంది రైతులతో ఉన్న ఈ సేవ ఇప్పుడు 70 లక్షల మందికి పైగా చేరింది. ‘కిసాన్ ఈ-మిత్ర’ చాట్బాట్ 11 భారతీయ భాషల్లో రైతుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది. ఏఐ సేవలు అందుబాటులోకి వచ్చిన 186 రోజుల్లోనే 27 లక్షల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.వైద్య రంగంలోనూ ఏఐ ఉపయోగపడుతోందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ‘కఫ్ ఎగైనెస్ట్ టీబీ’ ద్వారా దగ్గు శబ్దాన్ని పరిశీలించి క్షయ వ్యాధి పరీక్ష అవసరమైన వారిని గుర్తించినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో ఎక్స్రేలను పరిశీలించేందుకు ఏఐను ఉపయోగించగా.. నిపుణుల కంటే మెరుగైన ఫలితాలు