
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ టి.కియోసాకి తన ఫేస్బుక్ ఖాతా వేదికగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై సంచలన విశ్లేషణ చేశారు. ప్రపంచం ఎదుర్కోబోయే తదుపరి ఆర్థిక సంక్షోభం గతంలో చూసిన రూపంలో ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అది నిశ్శబ్దంగా ఆర్థికంగా ప్రజలను నలిపేస్తుందన్నారు. అందరూ తదుపరి ఆర్థిక సంక్షోభం 2008 నాటి పరిస్థితుల్లా ఉంటుందని భావిస్తున్నారు. మార్కెట్లలో తీవ్ర భయాందోళనలు, రాత్రికి రాత్రే బ్యాంకులు మూతపడటం వంటివి చూస్తామని అనుకుంటున్నారు. కానీ, ఈ తదుపరి ఆర్థిక సంక్షోభం అలా ఉండదు. ఇది చాలా నిశ్శబ్దంగా వస్తుంది. ఇది ప్రజల్లో ఒక రకమైన తీవ్రమైన అలసటలా అనిపిస్తుంది. ప్రజలు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. కాగితాలపై ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం మరింత వెనుకబడిపోతున్నారు. ఇది సాధారణ విషయం కాదు.. ఇదొక హెచ్చరిక సంకేతం. 60 శాతం మంది అమెరికన్లు ప్రతి నెలా వచ్చే జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం లేదు, అది ఒత్తిడికి గురవుతోంది. ఆ భారాన్ని అప్పుల ద్వారా మోస్తున్నారు. క్రెడిట్ కార్డులు, 'బై నౌ పే లేటర్' ఆఫర్లు, స్టూడెంట్ లోన్లు, మినిమమ్ పేమెంట్లు సమస్యలను పరిష్కరించవు. కేవలం బాధను వాయిదా వేస్తాయి. వాయిదా పడిన బాధ మాయమైపోదు, అది వడ్డీతో సహా పెరుగుతుంది. అందుకే ఈ సంక్షోభం నాటకీయంగా అనిపించదు. ఇది శాశ్వతమైన ఒత్తిడిలా, ఆర్థికంగా ఎటువంటి మిగులు లేని స్థితిలా మారుతుంది. ప్రజలు భయపడటం లేదు, అలసిపోతున్నారు. ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ప్రజలు భయపడినప్పుడు తిరుగుబాటు చేస్తారు. కానీ అలసిపోయినప్పుడు వ్యవస్థకు లొంగిపోతారు. వారేం చేస్తారు? వేరే దారి లేక మళ్లీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు. పిల్లల ఖర్చుల కోసం రుణాలు తీసుకుంటారు. అద్దె పెరిగినందుకు రెండో షిఫ్ట్ ఉద్యోగం చేస్తారు. ఆ క్రమంలో ఆర్థిక వ్యవస్థ భారీగా కూలిపోనక్కర్లేదు. అది చాలా