Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 7 రోజుల వరుస నష్టాల తర్వాత కిందటి రోజు (ఆగస్ట్ 21) భారీగా పుంజుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఒక్కరోజుకే పరిమితమైంది. ఇవాళ (ఆగస్ట్ 21) మళ్లీ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సెన్సెక్స్ ఫ్లాట్గా 77,530 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 24230 స్థాయిలో ట్రేడవుతోంది. అయితే మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా ప్రముఖ మల్టీనేషనల్ పైపుల తయారీ కంపెనీ షేరు ధర భారీగా పెరిగింది. ఏకంగా 17 శాతానికిపైగా పెరగడంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాల్ని అందిస్తోంది.అదే ప్రముఖ పైప్ తయారీ సంస్థ వెల్స్పన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఆ కంపెనీ చరిత్రలోనే తాజాగా అతిపెద్ద ఆర్డర్ దక్కడంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో రూ. 2005.20 వద్ద ముగిసిన ఈ షేరు ధర ఇవాళ నేరుగా 8 శాతానికిపైగా లాభంతో రూ. 2175 వద్ద ఓపెన్ అవగా, తర్వాత ఇంకా పుంజుకుంది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఒక దశలో 17 శాతానికిపైగా పెరిగి రూ. 2348.90 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. ఇదే ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర కూడా కావడం విశేషం.ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 61.31 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 710 గా ఉంది. గత కొంత కాలంగా ఈ స్టాక్ భారీగా పుంజుకుంటూ వస్తోంది. 5 రోజుల్లో ఏకంగా 27 శాతం పెరగ్గా, నెలలోనే 45 శాతం పెరిగింది. గత 6 నెలల వ్యవధిలో చూస్తే ఏకంగా 200 శాతం పెరగడం విశేషం. ఈ క్రమంలో లక్షను రూ. 3 లక్షలు చేసింది. గత ఐదేళ్లలో 2 వేల శాతానికిపైగా పెరిగింది. ఈ క్రమంలో లక్ష పెట్టుబడిని 20 లక్షలకుపైగా